ఒక్క రోజే 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు!

దేశంలో కరోనా కేసులు దడ పుట్టిస్తున్నాయి. గతం వారం రోజులుగా కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,47,417 కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి 380 మంది ప్రాణాలు కోల్పోయారు. 84,825 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Read More

తొలి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత ఆటగాళ్లు..

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్లో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసేరికి ఒక వికెట్ కోల్పోయి 17 పరుగులు చేసింది. క్రీజులో మహారాజ్(6), మార్​క్రమ్(8) ఉన్నారు. అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌.. ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది. కెప్టెన్ విరాట్​ కోహ్లీ(79) ఒంటరి పోరాటంతో ఆమాత్రమైనా స్కోర్ చేయగలిగింది. మిగతా ఆటగాళ్లలో పుజారా(43), పంత్(27) ఫర్వాలేదనిపించారు. రహానే(9), అశ్విన్(2), శార్దూల్ ఠాకూర్(12)…

Read More

సూపర్ స్టార్ మూవీ వాయిదా!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట చిత్రం మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో సినిమా మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని భావించిన చిత్ర యూనిట్.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి చిత్రాల విడుదలకు లైన్లో ఉండటంతో.. నిర్మాతల విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 1 వ తేదిన విడుదల చేస్తామని ప్రకటించింది. తాజాగా కథానాయకుడు మహేశ్‌బాబు తోపాటు, నటి…

Read More

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీదే హవా.. సర్వేలో వెల్లడి!

దేశంలో ఎన్నికల మిని సంగ్రామం మొదలైంది. అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్తో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. దీంతో ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించి టైమ్స్ నౌ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కమలం పార్టీ హవా కొనసాగుతుందని వెల్లడైంది. కాగా వచ్చే నెల జరగనున్న ఎన్నికల్లో కాషాయం పార్టీ ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, గోవాల్లో మరోమారు అధికారాన్ని చేపడుతుందని తేలింది. ఒక్క పంజాబ్‌ మినహా.. మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు…

Read More

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటన!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. యూపీలో ఏడు విడతల్లో పోలింగ్ జరగనుండగా,మణిపూర్‌లో రెండు, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవాల్లో ఒకే విడతల్లో పోలింగ్ ముగియనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపడతామని ప్రకటించింది ఎన్నికల కమిషన్. కరోనాను దృష్టిలో పెట్టుకున్ని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఇక షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించడం…

Read More

సూపర్ స్టార్ సోదరుడు మృతి.. షాక్ లో అభిమానులు!

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేశ్ బాబు సోదరుడు…ఘట్టమనేని రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన….శనివారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో హుటహుటీన AIG ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. కాగా రమేష్ బాబు అల్లూరి సీతారామరాజు చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మోసగాళ్ళకు మోసగాడు, దేవుడు చేసినమనుషులు చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరుతెచ్చుకున్నారు. ఏడేళ్ల విరామం అనంతరం సామ్రాట్ చిత్రంతో కథానాయకుడిగా ఆకట్టుకున్నారు.ఆయన దాదాపుగా…

Read More

దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందా..?

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వారం రోజులుగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందలు, వేల నుంచి లక్షలకు కేసులు చేరుకుంటున్నాయి. ఏడు నెలల తర్వాత మరోసారి లక్షకు పైగా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మరోవైపు మహారాష్ట్ర, బెంగాల్‌, ఢిల్లీ, కేరళ, కర్ణాటకల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వీకేండ్‌లో పూర్తి ఆంక్షల అమలుకు పలు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. కాగా శనివారం ఒక్కరోజే లక్షా 17 వేల 100 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఏడు నెలల కాలంలో…

Read More

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన వన రాఘవ!

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాల్వంచ ఫ్యామిలీ సుసైడ్‌ ఘటనలో ఏ2గా ఉన్న వనమా రాఘవను ఎట్టకేలకు భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా సరిహద్దుల్లోని దమ్మపేట వద్ద అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌ వెల్లడించారు. విశ్వనీయ వర్గాల సమాచారం మేరకు ఓ వాహనంలో రాజమండ్రి పారిపోతున్నారన్న సమాచారంతో రాఘవను ఛేజ్‌ చేసి దమ్మపేట పరిసరాల్లో అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. పూర్తి స్థాయి విచార‌ణ జ‌రిపిన త‌ర్వాత అతన్ని కోర్టులో హాజ‌రు ప‌రుస్తామ‌ని…

Read More

దేశంలో కరోనా కల్లోలం!

దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా గురువారం ఒక్కరోజే 90 వేల పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు 2 వేల 630కి పెరిగాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 36,265 కరోనా కేసులు వెలుగు చూడగా.. ఒక్క ముంబయిలోనే 20,181 కేసులు నమోదయ్యాయి. 8,907 మంది కోలుకోగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ధారావిలో కొత్తగా 107 కేసులు వెలుగు చూశాయి.మరోవైపు వందకు చేరువలో ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. దీంతో…

Read More

సూపర్ స్టార్ మహేష్ బాబుకి కరోనా పాజిటివ్!

సూపర్ స్టార్ మహేష్‌ బాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనే ఈవిషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తనకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందని… స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి.. వైద్యుల సలహాలు తీసుకుంటున్నట్లు మహేష్‌ చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీకా తీసుకుంటే ఆస్పత్రిలో చేరే ప్రమాదం తక్కువగా ఉంటుందని.. అందుకే ప్రతీ ఒక్కరు టీకాలు తీసుకోవాలని… అలాగే కోవిడ్‌…

Read More
Optimized by Optimole