జెషోరేశ్వరి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు!

బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శనివారం ఢాకాలోని జెషోరేశ్వరి కాళీ ఆలయన్ని సందర్శించారు. వెండితో తయారుచేసిన బంగారు పూత పూసిన మకుటాన్ని కాళీ మాత కు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నుంచి మానవాళిని కాపాడాలని కాళీమాతను ప్రార్థించినట్లు తెలిపారు. హిందూ మైథాలజీ ప్రకారం 51 శక్తి పీఠాల్లో జేషోరేశ్వరి కాళీ ఆలయం ఒకటని.. దీన్ని 16 వ శతాబ్దంలో నిర్మించారని అన్నారు. ప్రపంచంలో అశాంతి కి…

Read More

ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి చరణ్ ఫస్ట్ లుక్ విడుదల!

మెగాపవర్ స్టార్ రామ్చరణ్ జన్మదినం పురస్కరించుకొని ఆర్ఆర్ ఆర్ చిత్ర బృందం అతని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. దర్శకుడు రాజమౌళి ఈ పోస్టర్ ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ధైర్యం, గౌరవంం, సమగ్రత, ఉన్న మా సీతారామరాజు ని మీకు పరిచయం చేస్తున్నాం అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ విల్లు ఎక్కు పెట్టిన సీతారామరాజులా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. దీంతో అభిమానులు సమ సంతోషాన్ని సోషల్ మీడియాలో…

Read More

తెలంగాణకు కరోనా ముప్పు పొంచి ఉంది : డాక్టర్ శ్రీనివాసరావు

రాష్ట్రానికి కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పుపొంచి ఉందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. అందరూ జాగ్రత్తగా ఉండకపోతే కోవిడ్ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం తప్పక పాటించాలని.. పండగలకు పిల్లలు వయోవృద్ధులు దూరంగా ఉండాలని సూచించారు. గత అయిదారు నెలలుగా ప్రజలు జాగ్రత్త పాటించకపోవడమే కేసుల పెరుగుదలకు కారణమని శ్రీనివాస రావు పేర్కొన్నారు. కోవిడ్ కేసుల పెరుగుదలకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన…

Read More

‘మాస్టర్ బ్లాస్టర్’కు కరోనా పాజిటివ్!

భారత లెజెండ్ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ మేరకు వైరస్ చూపినట్లు అతను శనివారం ట్వీట్ చేశారు. కొవిడ్ జాగ్రత్తలు పాటించినప్పటికీ, స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా తేలినట్టు మాస్టర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని..  వైద్యుల సూచన మేరకు క్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు.  అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని , క్లిష్ట పరిస్థితుల్లో ఎంతోమందికి అండగా…

Read More

ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ నీలం స్నాహి !

ఏపీ నూతన ఎన్నికల కమిషనర్గా మాజీ సీఎస్ నీలం స్నాహి ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదన మేరకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమె పేరును ఖరారు చేశారు. ప్రస్తుత గవర్నర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఈనెల 31 న ముగియనున్న నేపథ్యంలో ఆమె ఎంపిక జరిగింది. గతంలో నీలం స్నాహి ఏపీ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తదనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా పనిచేశారు. 1984 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన…

Read More

విమోచన దినం స్ఫూర్తిదాయకం : ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం బంగ్లాదేశ్ లో పర్యటించారు. బంగ్లాదేశ్ విమోచన దినోత్సవ, ఉత్సవాల్లో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా డాకా విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.తొలుత పోరాట యోధులకు నివాళులర్పించిన మోడీ, అనంతరం మాట్లాడుతూ.. వారు ప్రాణాలను తృణప్రాయంగా  వదిలిరారే తప్ప, ప్రశ్నించే తత్వాన్ని వీడనాడలేదని స్పష్టం చేశారు. అన్యాయం, అనిచివేత అంతం చేయడానికి విమోచన ఉద్యమం జరిగిందని, ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని మోడీ అన్నారు.  

Read More

రాష్ట్రంలో మరో సారి లాక్ డౌన్ ఉండదు : సీఎం కేసీఆర్

తెలంగాణలో లాక్ డౌన్ పై ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో శుక్రవారం స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ ఉండదని కెసిఆర్ స్పష్టం చేశారు.కోవిడ్ కేసుల పెరుగుదలపై ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం  తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ విషయమై ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో భాగంగానే విద్యాసంస్థలు మూసివేసామని అన్నారు. రాష్ట్రంలోని పలు రంగాలకు సంబంధించిన పెద్దలు తనను కలిశారని, రాష్ట్రంలో మళ్ళీ లాక్ డౌన్…

Read More

తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ!

తిరుపతి బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఎఎస్ రత్నప్రభ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఆమె పేరును బీజేపీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. గతంలో రత్నపభ కర్ణాటక ప్రభుత్వ కార్యదర్శిగా పనిచే శారు. పదవీవిమరణ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ప్రధానంగా కొందరి పేర్లు వినిపించిన తుదకు ఆమెను ఎంపిక చేశారు. తిరుపతిలో విద్యావంతులు ఎక్కువగా ఉండడంతో, దానిని దృష్టిలో పెట్టుకొని, అధిష్టానం అభ్యర్థిని…

Read More

బెంగాల్లో 200 పైగా స్థానాలు గెలుస్తాం : రాజ్నాథ్ సింగ్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా స్థానాలు గెలుస్తుందని  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తంచేశారు. గురువారం బెంగాల్ ఎన్నికలు పర్యటనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200 పైగా స్థానాల్లో విజయం సాధించిడం ఖాయమని అన్నారు. బెంగాల్లో  ప్రజాస్వామ్యం ఖునీ అయ్యిందన్నారు. ప్రభుత్వం అంటే రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని తృణమూల్  ప్రభుత్వానికి హితబోధ చేశారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా …

Read More

ప్రస్తుతం లాక్ డౌన్ అవసరం లేదు : శక్తి కాంతా దాస్

దేశంలో కోవిడ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ అవసరం లేదని భారతీయ రిజర్వు బ్యాంక్ చీఫ్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. గురువారం టైమ్స్ నెట్‌వర్క్ నిర్వహించిన ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా కొనసాగాలన్నారు. రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళనకరమే అయినప్పటికీ ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలన్నారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుండటాన్ని గుర్తు చేశారు. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ…

Read More
Optimized by Optimole