తెలంగాణ అమర వీరులకు ఈ విజయం అంకింతం: రేవంత్

TelanganaElections: కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని తెలంగాణ అమర వీరులకు అంకింతం ఇస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  తెలంగాణ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఆదివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి సచివాలయాన్ని సామాన్యులకు అందుబాటులో ఉంచుతామన్నారు రేవంత్ రెడ్డి.  సామాన్యులకు పరిపాలనను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రగతి భవన్ ను డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్…

Read More

పీపుల్స్‌పల్స్‌- సౌత్‌ఫస్ట్‌ ఎగ్జిట్ పోల్ ..తెలంగాణ కాంగ్రెస్దే..!

Telangana election: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా సాగింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ఎదురే లేదు, కాంగ్రెస్‌ ఇక రాదు అని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎన్నికల ముందు పరిస్థితులు ఒక్కసారిగా ‘నువ్వా-నేనా’ అన్నట్టుగా మారడంతో హ్యాట్రిక్‌ విజయంపై ధీమా పెట్టుకున్న బీఆర్‌ఎస్‌  ఆశలు గల్లంతయ్యే అవకాశాలున్నాయి. పీపుల్స్‌పల్స్‌ సంస్థ రాష్ట్రంలో నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ప్రకారం ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య కంటే బీఆర్‌ఎస్‌ ప్రజల…

Read More

ప్రీ_ పోల్ సర్వేలతో డైలమాలో తెలంగాణ ఓటర్లు..!

బొజ్జ రాజశేఖర్ (సీనియర్ జర్నలిస్ట్):  గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రీ- పోల్‌ సర్వేలు రాజకీయ పార్టీలను, ఓటర్లను ఆయోమయానికి గురి చేస్తున్నాయి. జాతీయ సర్వే.. మీడియా..  పోల్‌ మెనేజ్‌మెంట్‌  సంస్థలు ప్రీ పోల్‌ సర్వేలను విడుదల చేశాయి. సర్వేల్లో మెజార్టీ కాంగ్రెస్‌ గెలుస్తుందిని.. కొన్ని సంస్థలు బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని, బీజేపీ, బీఎస్‌పీ పార్టీలు ప్రధాన పార్టీల కొంప ముంచనున్నాయని ఇలా ఎవ్వరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు సర్వేలు బహిరంగం వెల్లడించాయి. …

Read More

బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందే: జె.పి.నడ్డా

Telanganaelections2023: తెలంగాణలో పోటీలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందే.. తోడు దొంగలని బీజేపీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా ఆరోపించారు. కాంగ్రెస్ అంటే కరప్షన్, కొలాబిరేషన్.. బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి మేలు చేసుకోవడం తప్ప తెలంగాణకు చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు. బీజేపీ నాయకత్వంలో భారత దేశంలోని అన్ని వర్గాల సంక్షేమానికి  తగు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. భారత దేశ అంతర్గత భద్రత పూర్తి స్థాయిలో మెరుగయ్యిందన్నారు. ప్రధాని మోదీ  నాయకత్వంలో భారత దేశం కొత్త…

Read More

బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం బీజేపీ గొప్పదనం : పవన్

Telanganaelections2023: ‘సమాజంలోని అన్ని వర్గాలకీ అధికారం అందాలనే బలమైన లక్ష్యంతో 2009 నుంచి పోరాటం చేస్తున్నామన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.  తెలంగాణలో బీజేపీ కూడా అదే ఆశయంతో తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాల నుంచి  ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం ఎంతో ఆనందం కలిగించిందని ఆయన అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కూకట్ పల్లి నియోజకవర్గంలో జరిగిన జనసేన – బీజేపీ సంయుక్త ప్రచార సభలో పవన్  పాల్గొని ప్రసంగించారు. ఆయనతో…

Read More

ప్రీపోల్ సర్వే రిపోర్ట్ ఎక్స్ క్లూసివ్ .. తెలంగాణ ఆ పార్టీదే..!

telanganaelectionsurvey: తెలంగాణలో ఏ ముగ్గురు కలిసిన ఒకటే చర్చ! ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతోంది. ఇప్పటికే ప్రధాన మీడియా సంస్థలతో పాటు పలు సర్వే సంస్థలు ప్రజానాడీ ఎలా ఉండబోతోందన్న అంశంపై అనేక సర్వేలు నిర్వహించాయి. సర్వే ఫలితాలను కూడా వెల్లడించాయి. తాజాగా మా సంస్ధ సైతం రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే నిర్వహించింది. ప్రీ – పోల్ ఫలితాలను వెల్లడించింది.ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఏ…

Read More

చక్రవ్యూహంలో విజేతలు ఎవరు..?

వైయస్ రాజశేఖర్ రెడ్డి ని ఓ ఇంటర్వ్యూలో మీరు సీఎం అవ్వడానికి ఎంత కష్టపడ్డారు అన్నారు ఒక జర్నలిస్ట్ ఆయన నవ్వుతూ “నాకు ఈగో అనే ఒక నరం ఉండేది ఆ నరాన్ని కట్ చేసుకున్న తర్వాత సునాయాసంగా సీఎం అయ్యాను అన్నాడు”   ఎన్నికలు అంటేనే ఒక రాజకీయ వ్యూహం ఉండాలి. పద్మావ్యూహం లా ఎప్పటికి అప్పుడు కొత్త ఎత్తుగడలతో ముందుకు పోతూ సక్సెస్ అవ్వాలి. నాయకుడు ఎప్పటికప్పుడు గ్రౌండ్ రియాల్టీని తెలుసుకునే ప్రయత్నం చేయాలి….

Read More

డబుల్ ఇంజిన్ సర్కారుతో తెలంగాణ అభివృద్ధి పరుగులు : పవన్ కళ్యాణ్

telanganaelections2023: ‘అధికారం, ఆర్థిక వనరులు తెలంగాణలో అన్ని వర్గాలకు సమానంగా అందాలి. ఎన్నో పోరాటాల ఫలితంగా సిద్దించిన తెలంగాణలో సామాజిక న్యాయం ఎంతో అవసరం. ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న బీసీలను తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తామని, అదే లక్ష్యమని ప్రకటించిన బీజేపీ ఆలోచనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. అందరికీ అధికారం అందినపుడే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంద”ని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన వికారాబాద్ జిల్లా, తాండూరు…

Read More

రైతు బంధుకు వచ్చిన అనుమతి…మిగతా బంధులకు ఎందుకు రాలేదు : రేవంత్

telanganaelections2023: రైతు బంధుకు అనుమతి తీసుకురాగలిగిన బీఆరెస్, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుకు ఎందుకు అనుమతి తీసుకురాలేకపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం జుక్కల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో జరిగిన విజయభేరి సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రైతు బంధుకు లేని అడ్డు దళితబంధు, బీసీ బంధు మైనారిటీ బందుకు ఎందుకు? ఇందుకు నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. “రైతు బంధు…

Read More

పార్టీ ఫిరాయించిన పన్నెండు మందిని అసెంబ్లీ గేటును తాకనివ్వవద్దు :రేవంత్ రెడ్డి

telanganaelections2023: ఉద్యమ సమయంలో పదవులను పూచిక పుల్లలా విసిరేశామని కేసీఆర్ చెబుతున్నాడని.. నిజానికి పదవులు విసిరినట్లే విసిరి.. ఎలక్షన్లు, కలెక్షన్లు, సెలెక్షన్ల పేరుతో ఆస్తులను దోచుకున్నారని, రాజీనామా తర్వాత కూడా పదవులు వారే తీసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉద్యమం కోసం తన మంత్రి పదవిని విసిరేసి.. తిరిగి ఆ పదవికి తీసుకోలేదన్నారు. పార్టీ ఫిరాయించిన పన్నెండు మందిని అసెంబ్లీ గేటును తాకనివ్వవద్దని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ మారే వాళ్లకు…

Read More
Optimized by Optimole