పచ్చని పల్లెల్లో చిచ్చు రేపుతున్న వైసీపీ ప్రభుత్వం: నాదెండ్ల మనోహర్
Janasena : ‘ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే మూక దాడులు… అభివృద్ధిపై నిలదీస్తే పోలీస్ కేసులు పెట్టిస్తున్న వైసీపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతోందని మండిపడ్డారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. అధికార పార్టీ అక్రమాలను అడ్డుకుంటూ, లోపాలను ఎత్తి చూపుతున్న వారిపై వ్యవస్థలను ఇష్టారీతిన ప్రయోగిస్తూ జనసేన పార్టీ కార్యకర్తలను బెదిరించామని సంబరపడుతోందన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలెవరూ బెదిరింపులకు భయపడేవారు కాదాని.. మీరు ఎంత బెదిరిస్తే అంత బలంగా పోరాడుతామని.. బలపడతామని వైసీపీ దమనకాండపై దండెత్తుతామ’ని…