పార్లమెంట్ లో ఇండియా కూటమిని ఏకిపారేసిన బండి సంజయ్..

BJPTelangana: భారతమాతను హత్య చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సైతం విరుచుకుపడ్డారు. ‘‘ఆయన ఎప్పుడేం చేస్తడో ఆయనకే తెల్వదు.. ఒకసారి కన్ను కొడతడు.. ఒకసారి కౌగిలించకుంటడు.. ఇంకోసారి ఫ్లైయింగ్ కిస్ ఇస్తడు.. గజినీ లెక్క తయారైండు.. ఇట్లాంటాయనతో కలిసి అవకాశవాద కూటమి  అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టడం నవ్వొస్తుందని బండి ఎద్దేవ చేశారు. ఏ కాంగీ… బెంగాల్ దీదీ…ఢిల్లీ క్రేజీ….బీహార్ జేడీ…. ఔర్ ఔర్… తెలంగాణ కేడీ……

Read More

ప్రజల అరికాలి కింద పచ్చలు పచ్చలుగా పగిలిన ప్రజా యుద్ద నౌక..

గద్దర్ అనే వాడు చస్తే బాగుండు అని కోరిన ప్రజలు కూడా వుంటారా?వున్నారు. అలాంటి ప్రజలే ఎక్కువ శాతం వున్నారు.పాట గొప్పదే. పాట మాత్రమే గొప్పది. ఆచరణ లేని పాట ప్రజా శత్రువుతో సమానం. “శత్రువుపై జాలి లేని వాడే మన స్నేహితుడు” అని పాట పాడిన చెరబండరాజు పదేపదే గుర్తుకొస్తున్నాడు. గద్దర్ ప్రజా శత్రువు. ఆచరణ లేని సృజన ప్రజాపోరాటాలకు ఏమాత్రం అవసరమే లేదు. ప్రజా యుద్దమే లేకపోతే గద్దర్ లేడు. ప్రజా యుద్దమే లేకపోతే…

Read More

గద్దర్ కి కన్నీటి నివాళి!

రాదిరె:   శిశిర కాలపు శీతగాలి ఒరిపిడి పెడుతోంది. స్వెటర్ కూడా లేదు, వేడి వయసు బద్దకమేమో… కొనాలి అనుకుంటూనే వాయిదా వేస్తున్నా. ఏముందిలే, ఒకపూటేగా….! ఆ ఉత్సాహం, ఆ ఉద్వేగం మాత్రం చూడాలి! ఎందుకనుకున్నానో… ఆ పూట అలా ఫిక్సయిపోయా! 1989 జర్నలిజం వృత్తిలోకొచ్చి నెలలు అవుతోందంతే! రిపోర్టింగ్ కి రాలేదింకా… ట్రయినీ సబెడిటర్ గానే వున్నా! సోమాజీగూడ ఆఫీస్ లో పని కాస్త తొందరగానే ముగించుకొని, బయటపడేటప్పడికి 8 దాటినట్టుంది. జాగుచేయకుండా నేరుగా నిజాం కాలేజీ…

Read More

ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వాన్ని 6 అంశాలపై వివరణ కోరిన గవర్నర్..

తెలంగాణ: ఆర్టీసీ విలీన ప్రక్రియ బిల్లుపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆరు అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు.  ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలు తనకు తెలుసని.. సంస్థ విలీనం అంశం సిబ్బంది ఎప్పటినుంచో కోరుతున్న అంశమని  పేర్కొన్నారు. ఉద్యోగుల చిరకాల కోరిక నెరవేరడానికి తాను అడ్డుపడబోనని.. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలన్నదే తన ఉద్దేశమని గవర్నర్ స్పష్టం చేశారు. అంతేకాక తదుపరి నోటిఫికేషన్ ద్వారా సిబ్బంది ప్రయోజనాన్ని రక్షించేలా చూస్తానని.. ఉద్యోగుల ఆందోళన పరిష్కరించాలన్నదే…

Read More

తెలంగాణలో బీసీల చుట్టు ‘‘రాజకీయం’’..

Telanganapolitics: తెలంగాణలో బీసీల చుట్టు ‘‘రాజకీయాలు’’ తిరుగుతున్నాయి. ఓడెక్కే వరకు ఓడ మల్లన్న..ఓడ దిగాక బోడ మల్లన్న. అన్నట్లు బీసీల పట్ల రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అగ్ర కులాల  వారు రెండు దశాబ్దాలుగా రాజ్యాధికారం చేపడుతున్నారు. కానీ జనాభాలో 50 నుంచి 60 శాతం ఉన్న బీసీలు రెండు అక్కెన్ల పరిధిలోపు అసెంబ్లీకి పరిమవుతున్నారు. దీనికి కారణం అధికారం చేజిక్కించుకుంటున్న రాజకీయ పార్టీ వాళ్లది తప్పా..? రాజ్యాధికారం చేజిక్కించుకోవడంలో వెనుకబాటులోఉంటూ వస్తున్న బీసీలది తప్పా..? అంటే సమాధానం…

Read More

ఎవరి గోల వారిదే…

ఐ.వి.మురళీ కృష్ణ శర్మ(రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ):  తెలంగాణాలో నాలుగు నెలల్లో జరగనున్న మూడవ అసెంబ్లీ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని పార్టీలు వ్యూహరచనలలో తనముకలయ్యాయి. ఎవరికివారే ఎదుటువారిని దెబ్బకొట్టేలా ఎత్తుగడలు వేస్తుండడంతో రాష్ట్రంలో అయోమయం రాజకీయ వాతావరణం నెలకొంది. బడాబడా హామీలతోపాటు ఎదుటి పక్షాలపై విమర్శలను ఎక్కుపెడుతున్నారు. తమ అభ్యర్థులు సరైన పోటీ ఇవ్వగలరో లేదో సంశయంతో ఇతర పార్టీల నేతలను అక్కున చేర్చుకుంటున్నారు. నేడు ఒక పార్టీలో ఉన్న వారు తెల్లారేసరికి ఎవరి పంచన…

Read More

తెలంగాణ బీజేపీకి అమిత్ షా వార్నింగ్..టార్గెట్ ఫిక్స్..!

BJPTelangana: తెలంగాణ బిజెపి నాయకత్వానికి కేంద్ర హోమంత్రి అమిత్ షా అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా ముఖ్య నేతలంత అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాల్సిందేనని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆరు నూరైనా సరే  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయం పార్టీ 75 సీట్లు గెలిచి తీరాలని రాష్ట్ర నాయకత్వానికి షా  టార్గెట్ ఫిక్స్ చేశారని.. ఇందులో  భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇంట్లో ముఖ్య నేతలంతా హై…

Read More

ఆస్తుల కోసమే ఆర్టీసి వీలినం : పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి

Telanganacongress:  తెలంగాణ  ఆర్టీసీ నీ ప్రభుత్వంలో విలీనం చేయడం ఎన్నికల  స్టంట్అ గా అభివర్ణంచారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి.  గత 9 సంవత్సరాలుగా గుర్తు రాని ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు గుర్తొచ్చారా కేసిఆర్ అంటూ ఆయన నిలదేశారు.  ఆర్టీసీకి ఉన్న వేలాది కోట్ల ఆస్తులను వీలినం చేయడం కోసం ఈ నాటకానికి తెరదీశారని ఆరోపించారు. ఆర్టీసి ఉద్యోగులకు బాకీ ఉన్న 2013 ఎరియర్స్ .. రెండు పీఅర్సీ లతో పాటు ప్రభుత్వం లో…

Read More

TSPSC : గ్రూప్ _1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ విడుదల…!

Telangana: తెలంగాణ గ్రూప్_1 ప్రిలిమ్స్ తుది కీ  విడుదలైంది. టీఎస్పీఎస్సీ అధికారులు ఫైనల్ కీ ని మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. జూన్ 28న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కి సంబంధించి ప్రాథమిక కి రిలీజ్ అయింది. అనంతరం అధికారులు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న TSPSC   ఫైనల్ కీ విడుదల చేసింది.

Read More

BJPTelangana: బండికి ప్రమోషన్.. అరుణకు మరోసారి అవకాశం..!

BJPTelangana:  తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నేతలకు కీలక బాధ్యతలను అప్పగించింది. బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.అలాగే జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేఅరుణకు రెండో సారి అవకాశం కల్పించింది. ఏపీ బీజేపీ నేత సత్యకుమార్‌ను రెండోసారి బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు అరుణ్‌ సింగ్‌ నేతల నియమాకాలకు…

Read More
Optimized by Optimole