సీఎం జగన్ ‘హిట్లర్ ‘ : సుంకర ప‌ద్మ‌శ్రీ

విజ‌య‌వాడ‌: ఏపీలో వైసీపీ ఆరాచ‌క పాల‌న‌పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఫైర్ అయ్యారు.ప్రజా సమస్యలపై పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి నేడు పాదయాత్ర, నిరసనలకు అడ్డు తగులడం శోచ‌నీయ‌మ‌న్నారు. ప్రజా సమస్యలను చెపితే ప్రభుత్వం తట్టుకోలేకపోతుందన్నారు. జగన్ కు బుద్ధి చెప్పాలంటే ఛలో అసెంబ్లీ కచ్చితంగా నిర్వహించి తీరాలని తేల్చిచెప్పారు.ఈ కార్య‌క్ర‌మంలో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇక గన్నవరం లో మహిళ టీచర్స్ ను దారుణంగా…

Read More

హుజుర్ న‌గ‌ర్ లో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం..!!

హుజూర్‌నగర్ లో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం న‌డుస్తోంది . అధికార బిఆర్ ఎస్ , కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు నువ్వా- నేనా త‌ర‌హాలో మాట‌ల తూటాలు పేలుస్తుంటే.. బీజేపీ, స్వ‌తంత్ర అభ్య‌ర్థులు సేవా కార్య‌క్ర‌మాలతో దూసుకుపోతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు టైం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టం.. టికెట్ కోసం కొత్త ముఖాలు తెర‌పైకి రావ‌డం.. చూస్తుంటే అసెంబ్లీ పోరు ర‌స‌కంద‌కాయంగా ఉండే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌ల కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. ద‌మ్ముంటే త‌న‌పై పోటిచేయాల‌నిఎమ్మెల్యే…

Read More

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు: సంకినేని

సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామపంచాయతీలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీ నుండి ఆత్మకూరు మండలంలోని శక్తి కేంద్రాలలో 28 కార్నర్ మీటింగ్ లు నిర్వహించబోతున్నట్లు తేల్చిచెప్పారు. శుక్రవారం బీజేపీ ఆత్మకూరు(S) మండల కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలలో కేంద్ర…

Read More

దేవ‌ర‌కొండ బ‌రిలో నిలిచే ఎర్ర ‘గులాబీ’ నేత ఎవ‌రు ?.. ప్ర‌తిప‌క్ష అభ్య‌ర్థి ఎవ‌రు ?

తెలంగాణ‌లో బిఆర్ ఎస్ కమ్యూనిస్టుల పొత్తు దాదాపు ఖ‌రారైంది. మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా క‌లిసిన ఈరెండు పార్టీలు.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటిచేయ‌నున్నాయి. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ‌ జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టులకు  కొంత పట్టు ఉండడంతో..రానున్న ఎన్నిక‌ల్లో రెండు లేదా మూడు సీట్ల‌లో ఆపార్టీ అభ్య‌ర్థులు పోటి చేసే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేవ‌ర‌కొండ ఎమ్మెల్యే సీటు కోసం.. ఆ పార్టీ నేత‌లు ఇప్ప‌టికే కార్య‌చ‌ర‌ణ‌ను రూపొందించిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. కాగా అధికార…

Read More

సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుంది: INTUC జనక్ ప్రసాద్

మంచిర్యాల: సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుందన్నారు INTUC నాయకుడు జనక్ ప్రసాద్. కేంద్రం పార్లమెంటులో తీసుకొచ్చిన Mmdr యాక్ట్ కు టిఆర్ఎస్ ఎంపీలు కూడా మద్దతు పలికారని ..ప్రైవేటీకరణ జరిగితే తెలంగాణలో సింగరేణి కనుమరుగు అవుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ..22 సంవత్సరాలుగా సింగరేణి కంపెనీ లాభాల్లో ఉందన్న ఆయ‌న .. ప్ర‌ధాని, కేసీఆర్ లు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిప‌డ్డారు. బొగ్గును ఆదాని కంపెనీలో కొనమని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని ..దానివల్ల రాబోయే…

Read More

కౌన్ బ‌నేగా న‌ల్ల‌గొండ ఎమ్మెల్యే..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ న‌ల్ల‌గొండ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. మ‌రోసారి ఎమ్మెల్యేగా గెల‌వాల‌ని సిట్టింగ్ ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్ రెడ్డి అభివృద్ధి కార్య‌క్ర‌మాల పేరిట దూకుడును ప్ర‌ద‌ర్శిస్తుంటే.. ప‌క్క‌లో బ‌ళ్లెంలా సొంత పార్టీ నేత‌లే టికెట్ రేసులో మేమున్నామంటూ సేవా కార్య‌క్ర‌మాల పేరుతో గ్రామ‌గ్రామాన విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఇక ప్ర‌తిపక్ష బీజేపీ ,కాంగ్రెస్ పార్టీ నేత‌లు తామేమి త‌క్కువ కాదన్న త‌ర‌హాలో స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. బిఆర్ఎస్ లో గ్రూపు త‌గాదాలు… అధికార…

Read More

పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ని కలిసిన టీఎన్జీవో కేంద్ర సంఘం..

రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను విన్నవించుకున్నారు. రాష్ట్రంలో అత్యద్భుత పనితీరు కనబరుస్తూ.. కేంద్రం నుండి 10 జాతీయ అవార్డులను సాధించిపెట్టిన శాఖ మూల స్తంభాలైన పంచాయతీ కార్యదర్శుల సంక్షేమం పట్ల అధికారులు దృష్టి సారించాలని కోరారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్…

Read More

ప్రజలకు ఎల్లవేళలా పోలీసులు అందుబాటులో ఉండాలి: ఎస్పీ అపూర్వ రావు

Nalgonda: జిల్లా ఎస్.పి అపూర్వ రావు డిండి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల పని తీరు గురించి స్టేషన్ ఎస్. ఐ… ఎస్పీకి వివరించారు. అనంతరం స్టేషన్ సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ పోలీసులు అందుబాటులో ఉండాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపుర్యకంగా నడుచుకోవాలని.. వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. జిల్లా పోలీస్ వ్యవస్థ.. ప్రజలకు…

Read More

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని బీఆర్ఎస్ బహిష్కరించడం సిగ్గు చేటు : బండిసంజ‌య్‌

రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తప్పుపట్టారు. ఆదివాసీ మహిళా రాష్ట్రపతి తొలిసారి పార్లమెంట్ లో ప్రసంగిస్తుంటే జీర్ణీంచుకోలేకే బీఆర్ఎస్ బహిష్కరించిందన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల మహిళలంటే బీఆర్ఎస్ కు అసహ్యమని, ముర్ము రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు యత్నించారన్నారు. కేసీఆర్ తొలి కేబినెట్ లో మహిళలకు చోటు కల్పించలేదని సంజ‌య్ గుర్తు చేశారు. తక్షణమే మహిళలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి…

Read More

అతిథి అధ్యాపక పోస్టుల కోసం అప్లై చేసుకోండి : ప్రిన్సిపల్ శైలజ

సూర్యాపేట: బాలెం గురుకుల మహిళ డిగ్రీ కళాశాలలో అతిధి అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ డా. శైలజ ఓ ప్రకటనలో తెలిపారు. కెమిస్ట్రీ, బోటని, ఎకనామిక్స్ సబ్జెక్ట్స్.. అతిధి ఆధ్యాపకుల పోస్టులు ఖాళీ ఉన్నట్లు వెల్లడించారు. సంబంధిత pG లో 55 శాతం (ఎస్సీ, ఎస్టీలు 50 శాతం) మార్కులు పొందిన వారు అర్హులుగా పేర్కొన్నారు.ph.D/ Net/set/slet ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు.. అర్హత గల అభ్యర్థులు, ఫిబ్రవరి 4 వ తేదీ సాయంత్రం…

Read More
Optimized by Optimole