Telangana: ‘విత్తు’ను కాపాడుకోకుంటే ‘విపత్తు’..!!

Telangana: ‘విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది’ అంటాడు శివసాగర్! వేల సంవత్సరాలు దేశీ విత్తనాలు మన వ్యవసాయాన్ని పరిపుష్టం చేస్తూ ఆహార భద్రతకు, ఆరోగ్య సంరక్షణకు భరోసా ఇచ్చాయి. రైతు నిశ్చింతగా, వ్యవసాయం అదుపాజ్ఞల్లో, నేలసారం సురక్షితంగా, వాతావరణం సమతుల్యతతో, ప్రకృతి పరిశుద్ధంగా ఉన్నాయి. అధిక దిగుబడి కోసం వచ్చిన ‘హరిత విప్లవం’ గొడుగు కింద ముందు, వెనుకలాలోచించకుండా చేసిన కొన్ని చర్యలవల్ల పర్యవసానాలు వికటించాయి. పంట దిగుబడి అసాధారణంగా పెరిగి అప్పటి అవసరాల మేర…

Read More

TPCC: టీపీసీసీ మహేష్ ముందున్న సవాళ్లు..!

TelanganaCongress: నెలల నిరీక్షణ తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కి కొత్త అధ్యక్షుడొచ్చారు. జోడు పదవుల్లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఈ పరిణామం కాసింత ఊరట! ఇక, పార్టీ కిరీటం తలపైనుంచి తీసి, పాలనపై దృష్టి కేంద్రీకరించవచ్చు! పీసీసీ పీఠమెక్కనున్న మహేశ్కుమార్ గౌడ్ పాత నాయకుడే! కాకపోతే, పాత-కొత్త నాయకుల నడుమ సమన్వయ సాధన అవసరంతో పాటు పలు సవాళ్లు ఎదురవుతున్న కాలంలో ఆయనకు పీసీసీ పీఠం దక్కింది. పాలకపక్షంగా కాంగ్రెస్ను రాబోయే…

Read More

ఐపీఎల్లో బెంగుళూరు హవా!

ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా బెంగుళూరు దూకుడును ప్రదర్శిస్తోంది. తాజాగా మంగళవారం దిల్లీ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగుతో విజయం సాధించి పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్‌(75 నాటౌట్‌; 42 బంతుల్లో 3×4, 4×6) చక్కటి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పాటిదార్‌(31; 22 బంతుల్లో 2×6), మాక్స్‌వెల్(25;…

Read More

Peoplespulse: డొక్కా సీతమ్మ పథకం అమలు తీరుపై పీపుల్స్ పల్స్ అధ్యయనం..!

DokkaSeethammascheme: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంపై పీపుల్స్ పల్స్ అధ్యయన సమగ్ర నివేదిక.. ఇంటర్‌ విద్యార్థులకు: జీవితంలో ఎవరి కెరీర్‌ కైనా ఇంటర్మీడియటే టర్నింగ్‌ పాయింట్‌. ఇంటర్‌ లోనే విద్యార్థులు తమ జీవితానికి పునాదులు వేసుకుంటారు. ఇంటర్‌ నుంచి బాగా చదువుకుంటేనే మంచి ఉద్యోగం వస్తుంది. ఉన్నత ఉద్యోగం వస్తే కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని విద్యార్థులకు ప్రతి ఒక్కరూ చెప్తుంటారు. కానీ, పేద విద్యార్థులు చదువుకోవాలంటే, ముందుగా వారి కడుపు నిండాలి. అదికూడా సరైన పోషకాహారం…

Read More

ప్రజాస్వామ్య దేవాలయంలో ‘సెంగోల్’ ప్రతిష్ఠ..

‘సెంగోల్’—వీర చోళుల సాంప్రదాయ ప్రతిష్ట.భారత సనాతన ధర్మ శక్తి కాలానికి అతీతంగా నిత్య తేజస్సుతో తరాలు మారినా ప్రకాశిస్తూనే ఉంటుంది. పవిత్ర  బంగారు రాజదండంగా భారతీయ చారిత్రాత్మక, వారసత్వ, ఆధ్యాత్మిక చరిత్రకు నిదర్శనం. 1947లో స్వాతంత్ర్య సిద్ధి సమయంలో తిరువావధూతురై నుండి ఢిల్లీకి చేరిన పవిత్ర రాజదండం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చొరవతో తిరిగి నూతన పార్లమెంట్ లో స్పీకర్ ప్రాంగణంలో ప్రతిష్టించబోతుండడంతో అది తిరిగి తన పునర్వైభవాన్ని పొందనుంది. పవిత్ర రాజదండం కేవలం…

Read More

ఐపీఎల్ వాయిదా!

ఐపీఎల్ తాజా సీజన్లో పలువురు ఆటగాళ్లకు కరోనా సోకడంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం అధికార ప్రకటన చేసింది. ఆటగాళ్ళ భద్రత కోసం ఏర్పాటు చేసిన బయో బబుల్( గాలి బుడగ) ఫెయిల్ కావడం టోర్నీ వాయిదాకు ముఖ్య కారణంగా తెల్సుతుంది. ఓ వైపు దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో టోర్నీ దుబాయ్ కి షిఫ్ట్ చేయలని వార్తలు వచ్చిన.. స్వదేశంలోనే టోర్నీ నిర్వహిస్తామని తెలిపిన బోర్డు.. పలు…

Read More

చంద్రయాన్-3 విజయం.. యావద్భారతీయులది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

BJPTelangana: చంద్రుడి దక్షిణ ధృవం మీద ఇస్రో పంపించిన ‘విక్రమ్’ల్యాండర్ విజవంతంగా ల్యాండ్ అవడం.. యావద్భారతం గర్వించే క్షణమని గౌరవ కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన  తొలి దేశంగా నిలిచిందన్నారు.బుధవారం చంద్రయాన్-3 ల్యాండ్ అయిన అద్వితీయమైన ఘట్టాలను.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, ఇతర సీనియర్ నాయకులతో కలిసి పెద్ద ఎల్ఈడీ స్క్రీన్‌పై కిషన్ రెడ్డి…

Read More
Optimized by Optimole