రియాలిటీ షోకూ హోస్ట్ గా కంగనా రనౌత్..?

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ ఓ రియాలిటీ షోకు హోస్ట్​ గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్.. డిజిటల్​ ప్రొడక్షన్​ హౌస్​ ఏఎల్​టీ బాలాజీ ఈ రియాలిటీ షోనూ నిర్మించనుంది.కాగా ఏక్తా కపూర్​ కోసం తొలిసారి వ్యాఖ్యాతగా మారనున్నాను అంటూ కామెంట్​ చేసిన కంగనా..కాసేపటికే ఆ పోస్ట్​ను తొలగించారు. దీంతో ఈ విషయాన్ని త్వరలోనే నిర్మాత ఏక్తా కపూర్​ అధికారికంగా ప్రకటించే అవకాశం…

Read More

కేసిఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాలి_ బండి సంజయ్

రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న సీఎం కేసీఆర్‌పై దేశద్రోహం కేసుపెట్టాలన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌. మంగళవారం మీడియాతో మాట్లాడిన సంజయ్.. కేసిఆర్ పై ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ అంబేడ్కర్‌ను కేసీఆర్‌ అవమానించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మర్చాలనడం వెనక ఉద్దేశ్యం ఏంటో తెలపాలన్నారు. కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన కుంభకోణాల్ని బయటికి తీయబోతున్నామన్నారు. త్వరలో ఆయన అరెస్ట్‌ ఖాయమని తెలిసే.. ప్రజల్లో సానుభూతి కోసం కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. దళితుడైనందుకే…

Read More

సీఎం యోగి గెలుపు కోసం రంగలోకి ‘హిందూ యువవాహిని ‘

ఉత్తరప్రదేశ్లో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు ప్రచారాన్ని హెరెత్తిస్తున్నారు. అటు ప్రతిపక్ష పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో బీజేపీ అగ్రనాయకులు రాష్ట్రంలో పర్యటిస్తు.. కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఇక సీఎం యోగి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేస్తుండటంతో .. తన మానస పుత్రిక హిందూ యువవాహిని ఆయన గెలుపు బాధ్యతలను భుజానకెత్తుకుంది. ఇరవై ఏళ్ల క్రితం గోరఖ్పుర్ మఠాధిపతిగా యోగి స్థాపించిన ఆసంస్థ.. గత కొన్నేళ్లుగా నిద్రాణంలోనే ఉంది. ఇప్పుడు గోరఖ్పుర్…

Read More

అట్టహాసంగా ముగిసిన గణతంత్ర ముగింపు వేడుకలు..

ఢిల్లీ విజయ్‌చౌక్‌లో బీటింగ్ రీట్రీట్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గణతంత్ర ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన బీటింగ్ రీట్రీట్ వేడుకులను రాష్ట్రపతి, ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు తిలకించారు. తొలిసారిగా వెయ్యి మేడిన్ ఇండియా డ్రోన్లతో ఏర్పాటు చేసిన లేజర్ షో కనువిందు చేయగా.. వివిధ బ్యాండ్ల ప్రదర్శన ఎంతగానో ఆలరించింది. యూకే, రష్యా, చైనా తర్వాత రిపబ్లిక్ డే ముగింపు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ నిలిచిందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్…

Read More

నవజ్యోత్ సింగ్ సిద్దూ పై సోదరి సంచలన వ్యాఖ్యలు!

పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ సోదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం తల్లిని, తనను ఇంట్లోంచి గెంటేశారని సిద్ధూ సోదరి సుమన్​ తూర్ ఆరోపించారు. అమెరికా నుంచి చండీగఢ్​ వచ్చిన ఆమె మీడియా సమావేశంలో తన తల్లి పడిన కష్టాలను తెలుపుతూ కన్నీటీ పర్యంతమయ్యారు. ఓ విషాదకర ప్రమాదంలో అక్క, కుటుంబ సభ్యులు మరణిస్తే.. సిద్ధూ కనీసం సంతాపం తెలపలేదన్నారు సుమన్ తూర్ . ఈ…

Read More

ఢిల్లీ విజయ్ చౌక్ వద్ద.. అద్భుత దృశ్యం ఆవిష్కృతం!

గణతంత్ర వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని విజయ్‌చౌక్‌ వద్ద నిర్వహించే బీటింగ్ రీట్రీట్‌లో….అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తైన సందర్భంగా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాల ఇతివృత్తంగా వెయ్యి డ్రోన్లతో ప్రదర్శన చేపట్టారు. ఐఐటీ ఢిల్లీకి చెందిన బోట్‌ల్యాబ్‌ డైనమిక్స్‌ అనే స్టార్టప్‌ సంస్థ దీన్ని ఆపరేట్‌ చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖతో క‌లిసి ఈ షోను ప్రదర్శించింది. చైనా, ర‌ష్యా, బ్రిటన్ త‌ర్వాత వెయ్యి డ్రోన్‌ల‌తో ఇంత పెద్ద ఎత్తున డ్రోన్ షో…

Read More

ప్రముఖ పంచాంగకర్త గుండెపోటుతో కన్నుమూత

ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి హఠాన్మరణం చెందారు. సోమవారం సాయంత్రం ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో యశోద ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. జ్యోతిషులుగా 30 ఏళ్లకు పైగా ములుగు సిద్ధాంతి సేవలందించారు. ములుగు సిద్ధాంతి ఆకస్మిక మరణం పట్ల జ్యోతిషవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు 4 దశాబ్ధాలకు పైగా నిష్పక్షపాతమైన, నిజమైన జ్యోతిష ఫలితాలను ప్రజలకు అందించారు రామ లింగేశ్వర సిద్ధాంతి. పంచాంగం ద్వారా భవిష్యత్తులో…

Read More

వన్డే సిరీస్ దక్షిణాఫ్రికా కైవసం..!

దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత జట్టు ఓటమిని చవిచూసింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టు.. చివరికి వరకు పోరాడిన ఫలితం దక్కలేదు. ఫలితంగా ప్రొటీస్​ జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను అతిథ్య జట్టు 3_0 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందుటాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు.. ఓపెనర్ డికాక్ (124) సెంచరీతో అదరగొట్టాడు. అతనికి తోడు…

Read More

మూడోసారి ప్రధానిగా మోదీ!

దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చింది. కాకపొతే ఎన్డీయే సీట్ల సంఖ్య 296కు పడిపోతుందని చెప్పింది. అంతేకాక త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ మోదీకి 50 శాతం పైగా మద్దతు తెలుప్తున్నట్లు సర్వే రిపోర్ట్ చెబుతుంది. కాగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి సొంతంగా 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వస్తుందని…..

Read More

మరోసారి బ్లాక్ ఫంగస్ కలకలం.. యూపీ లో తొలి కేసు!

దేశంలో కరోనా మరోసారి పంజా విసురుతోంది. రోజువారిగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఓవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్‌ హడలెత్తిస్తోంది. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇవి చాలదన్నట్లు.. బ్లాక్‌ ఫంగస్‌ సైతం మరోసారి కలకలం రేపుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. కాంట్‌ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని జీఎస్‌వీఎం ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. బాధితుడి ఒక…

Read More
Optimized by Optimole