పునీత్ కు క‌ర్ణాట‌క ప్రభుత్వం ఘ‌న‌నివాళి..!!

దివంగ‌త‌ నటుడు పునీత్ రాజ్ కుమార్ సంతాప స‌భ‌ను మంగ‌ళ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈనేప‌థ్యంలో క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్‌కు ఘ‌న‌ నివాళి అర్పించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పునీత్ కు ప్రతిష్ఠాత్మక ‘కర్ణాటక రత్న’ పురస్కారం ప్ర‌క‌టిస్తున్న‌ట్లు సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. ఈ మేరకు మరణానంతర అవార్డుపై ట్వీట్ చేశారు. ఈ అవార్డును అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు. కాగా అతిచిన్న వ‌యుసులో అవార్డు ద‌క్కించుకున్న వ్య‌క్తిగా పునీత్ నిలిచాడు. కాగా పునీత్…

Read More

టీ 20 వరల్డ్ కప్ 2021 విజేత ఆస్ట్రేలియా!

టీ20 ప్రపంచకప్‌ 2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీని ఆరంభించిన ఆసీస్.. తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో ఆజట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్‌ మార్ష్‌(77),…

Read More

భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం..!!

ఎడతెరిపిలేని వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో రెండ్రోజులపాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. కొన్నిజిల్లాలో రెడ్‌ అలర్ట్.. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేశారు. ఏకధాటి వర్షాలకు కేరళలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలుప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఎర్నాకులం జిల్లాలో కొండచరియలు…

Read More

కాంగ్రెస్ లో నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి..!

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. దుబ్బాక, హుజురాబాద్‌ లో ఘోర ఓటమితో నిరాశలో ఉన్న కార్యకర్తలకు నేతల మధ్య విభేదాలు మింగుడు పడడంలేదు. తాజాగా జనగామ లొల్లి కాక రేపుతోంది. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డీసీసీ అధ్యక్షుడు జంగారాఘవ రెడ్డి ల మధ్య నడుస్తున్న ఫైట్….. షోకాజ్ నోటీసు వరకు వెళ్లింది. ఈ ఇష్యూలో హస్తం నేతలు రెండుగా చీలిపోయి బలప్రదర్శనలకు దిగుతున్నారు. ఈ ఎపిసోడ్ లో జంగా రాఘవరెడ్డి…

Read More

తెలంగాణాలో కమలం జోరు!

తెలంగాణలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ జోరుమీదుంది. పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. విజయపరంపరను ఇలాగే కంటిన్యూ చేస్తే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో ఢీకొట్టొచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటిదాకా కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే తామూ అనుసరించాలని బీజేపీ పెద్దలు డిసైడ్‌ అయినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే స్ట్రాటజీ అమలు చేసి.. అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. కాగా బలమైన అభ్యర్థులు ఉంటే టిఆర్ఎస్‌ను ఓడించడం తేలికని దుబ్బాక, హుజురాబాద్ ఉప…

Read More

కేసిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు: కేంద్ర మంత్రి షేకావత్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నెల‌కొన్ని జల వివాదంపై స్పందించారు కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల కారణంగానే ట్రిబ్యున‌ల్ ఏర్పాటులో జాప్యం జ‌రుగుతోంద‌న్నారు. సీఎం కేసిఆర్ ప్రెస్ మీట్ పెట్టీ అవాస్తవాలు మాట్లాడారాన్నరు. 2015లో కొత్త ట్రిబ్యునల్ ఎర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందన్నారు.కావాల‌నే కేంద్రాన్ని కేసీఆర్ బ‌ద్నాం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. ఇరు రాష్ట్రాల అంగీకారం త‌ర్వాతే ట్రిబ్యున‌ల్ ఏర్పాటు జ‌రుగుతుందన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం…

Read More

ఫైనల్లో ఆస్ట్రేలియా.. కంగుతిన్న పాక్..!!

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్ కి దూసుకెళ్లింది. గురువారం పాకిస్థాన్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆసీస్ 177 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి పాకిస్థాన్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ వేసింది. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లో డేవిడ్ వార్నర్ (49), మార్కస్ స్టాయినిస్‌ (40) రాణించారు. చివర్లో మాథ్యూ వేడ్‌ (41) ధనాదన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. పాక్ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ నాలుగు, షాహీన్ ఆఫ్రిది ఒక వికెట్ తీశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన…

Read More

చమురు ధరలను జీఎస్టి పరిధిలోకి తెస్తే ధరలు తగ్గుతాయి: గడ్కరీ

పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్‌టి పరిధిలోకి తీసుకొస్తే, వాటిపై పన్నులు మరింత తగ్గుతాయన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే ఇంధన ధరలను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియా ఛానల్ నిర్వహించిన వర్చువల్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీఎస్‌టీ కౌన్సిల్‌లో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా సభ్యులని నితిన్ గడ్కరీ చెప్పారు. పెట్రోలు, డీజిల్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు….

Read More

భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం!

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షంతో చెన్నై నగరం జలమయమైంది. చెన్నై, పుదుచ్చేరి నగరాలతో పాటు తిరువల్లూర్, రాణిపేట్, వెల్లూర్, తిరుపత్తూర్, తిరువనమలై, కల్లకురిచి, సాలెంలో వరద బీభత్సం కొనసాగుతోంది. విల్లుపురం, కుడలోర్, క్రిష్ణగిరి, ధర్మపురి, నమక్కల్, పెరంబలూర్, అరియలూర్ లోనూ జనం అవస్థలు పడుతున్నారు. వరదనీటికి తోడు మురుగునీరు ఇళ్లల్లోకి చేరి జనం నరకం చూస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని హాస్పిటళ్లు, ఆఫీసులు జలమయమయ్యాయి. రోడ్లపై 2 నుంచి 3…

Read More

దేశంలో స్వల్పంగా కరోనా కేసులు నమోదు!

దేశంలో కోవిడ్ కేసులు స్వల్పంగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13 వేల 091​ మందికి పాజిటివ్​గా తేలింది. వైరస్ కారణంగా 340 మందిమృతి చెందారు. ప్రస్తుతం దేశంలో లక్ష 38 వేల 556 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు దేశంలో కొవిడ్​ టీకా పంపిణీ జోరుగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 57,54,817 డోసుల వేసినట్లు వైద్య అధికారులు తెలిపారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,10,23,34,225కి చేరింది….

Read More
Optimized by Optimole