2024 ఏపీ కింగ్ మేకర్ ఎవరు..? జనసేన రోల్ ఏంటి?
ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి రాష్ట్ర శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో మూడింటికి మూడూ తెలుగుదేశం గెలుచుకోవడంతో, ఇక రాబోయే శాసనసభా ఎన్నికల్లో నాలుగు దిక్కులూ తమవేనని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒంటరిగా పోటీ చేసినా టీడీపీ గెలిచేస్తుందని ఆ పార్టీలోని సీనియర్ నాయకులు, ఆ పార్టీకి మద్దతిచ్చే మేధావులు ప్రచారం కూడా మొదలుపెట్టారు. కానీ, పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపును చూసి గెలుపనుకంటే అది వాపేగానీ, బలుపు కాదు….
“హాలో ఏపీ.. బైబై వైసీపీ” జనసేన నినాదం: పవన్ కళ్యాణ్
Varahivijayayatra: ‘అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి … అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి… జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి… “హాలో ఏపీ.. బైబై వైసీపీ” ఇదే జనసేన ఎన్నికల నినాదం కావాల’ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వారాహి విజయయాత్రలో భాగంగా గురువారం అమలాపురం గడియార స్తంభం కూడలిలో భారీ బహిరంగ సభలో భాగంగా.. అందరితో నినాదాన్ని పలికించారు.సభకు హాజరైన అశేష జనవాహిని ‘హల్లో ఏపీ… బైబై వైసీపీ’ అని నినదిస్తుంటే అమలాపురం…
టీమిండియా కెప్టెన్సీ మార్పు పై హగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
టీమిండియా కెప్టెన్ మార్పుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టుకు కెప్టెన్సీ మార్పు మంచిది కాదని ఆప్రభావం కోహ్లీ ఆటతీరుపై పడుతుందని, ఇది భారత క్రికెట్ సంస్కృతికి విరుద్ధమని హెచ్చరించాడు. క్రికెట్లో ఎంతపెద్ద ఆటగాడికైనా ఒడిదుడుకులు సహజమని అంతమాత్రాన అతని శక్తి సామర్ధ్యాలను శంకించడం సబబు కాదని హితువు పలికాడు. ఆస్ట్రేలియా టూర్లో అతని సారధ్యంలో జట్టు వన్డే సిరీస్ కోల్పోవడం, అడిలైడ్ టెస్టులో అత్యల్పంగా 36 పరుగులకే…
పెగాసస్ పై విచారణకు ప్రత్యేక కమిటీ_ సుప్రీం
దేశంలో పెగాసస్ నిఘా వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పలు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. పెగాసస్ వ్యవహారంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటీని నియమిస్తున్నట్లు తెలిపింది.చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతం అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన సరికాదని, ఈ విషయాన్ని కోర్టు సహించదని స్పష్టం చేసింది. ఈ కేసులో కొందరు పిటిషనర్లు పెగాసస్ ప్రత్యక్ష…
దీదీ కి మరో షాక్!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ , పార్టీలోని ప్రముఖ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నియోజకవర్గమైన హార్బర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దీపక్ హల్దార్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించాడు. దీంతో ఎన్నికల సమయానికి ఇంకెంతమంది అసంతృప్తులు పార్టీని వీడుతారాన్న చర్చ జరుగుతోంది. కాగా ఇప్పటివరకూ తృణమూల్ పార్టీలో కీలక నేతలైన సువెందు అధికారి , సోవన్…
ఐపీఎల్ కు గుడ్ బై చెప్పనున్న మిస్టర్ కూల్ కెప్టెన్?
Msdhoni: టీంఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ కు గుడ్ బైచెప్పనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ ప్రజెంటేషన్ అనంతరం మాట్లాడిన ధోని.. రెండేళ్ల తర్వాత అభిమానులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. మా పట్ల ప్రేక్షకులు చూపే అభిమానం, అప్యాయతకు రుణపడి ఉంటాం.. కెరీర్ లో ఇదే నాచివర దశ అంటూ మహీ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మహీ.. ఐపీఎల్ 2023 టోర్నమెంట్…
కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి..
కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. ఉత్తరాయణం అనంతరం వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే.. వైకుంఠ ఏకాదశిగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజున వైకుంఠవాకిళ్లు తెరచుకొంటాయి.భక్తులు వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం ద్వారా భగవంతుని దర్శించుకుంటారు. ‘హరివాసరమం ‘.. అసుర(రాక్షసుల) బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడన్నది…
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం ఎపిసిసి వినూత్న కార్యక్రమం..
విజయవాడ: కర్ణాటక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వచ్చే నెలలో జరగబోయే కర్ణాటక ఎన్నికల్లో…కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్ర రాజు..ఆంధ్ర నుండి బెంగళూరు వెళ్లే బస్సులలో ట్రైన్లలో కరపత్రాలు పంచుతూ హస్తం పార్టీ గెలుపును కృషి చేయాలని కరపత్రాలు పంపిణీ చేశారు. బెంగళూరుకు వెళ్లే తెలుగువారికి కాంగ్రెస్ పార్టీ రావలసిన ఆవశ్యకతను వివరిస్తూ ఆయన పంపిణీ చేసిన కరపత్రాలు సోషల్ మీడియాలో హాట్ ఆఫ్…
Kalkireview: కల్కి 2898 ఏడీ పై డిఫరెంట్ రివ్యూ.. థింక్ ఇట్..!
Swetha vadlakonda: అందరూ కల్కి 2898 ఏడీ సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు కాబట్టి.. నేను నా ఊహకు పనిచెప్పి ఒక చిన్న కథనం రాద్దామనుకుంటున్నా. కల్కి సినిమా సందర్భం : మూడో ప్రపంచ యుద్ధం పూర్తయ్యి ప్రపంచమంతా నాశనమైంది. కులాలు, మతాలు నశించిపోయాయి. దైవం అనే అంశం కనుమరుగైపోయింది. ఆ యుద్ధం జరిగేందుకు సుప్రీమ్ యస్కిన్ అనే అతను అన్ని దేశాలకు సహాయం అందించాడు. ఆ తరువాత కాంప్లెక్స్ అనే దానిని తయారు చేశాడు….
