Hyderabad: మరోసారి బట్టబయలైన కేటీఆర్ ఫేక్ ఓటర్ల బాగోతం…!!

Hyderabad:  జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల‌ జాబితాలో అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు మరోసారి తప్పని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ నకిలీ ఓటర్లను నమోదు చేసిందని కేటీఆర్ ప్రదర్శించిన వివరాలలోని డొల్లతనం తేటతెల్లమైంది. కేటీఆర్ ఆరోపణల ప్రకారం, 19,000 ఓటర్లను జాబితాలో చేర్చార‌ని, ఇందులో 1,942 ఓటర్లు పలుమార్లు నమోదయ్యారని, యూసుఫ్‌గూడ‌లోని రెండు చిరునామాలలో వ‌రుస‌గా 32, 43 మంది ఓటర్లు, హైలం కాల‌నీలో అడ్ర‌స్సులేని చిరునామాలో 42 మంది ఓటర్లు ఉన్నారని…

Read More

Bandisanjay: బండి సంజయ్ వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: ప్రవీణ్ రావు

Karimnagar: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపి బండి సంజయ్ కుమార్ పై అసత్య ఆరోపణలు చేస్తున్న నేతలపై బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు  ఓ పొలిటికల్ టూరిస్ట్ లాంటి నాయకుడు..ఆయన ప్రజల సమస్యల కోసం ఏనాడూ కొట్లాడింది లేదు..అలాంటిది నేత ఎంపీ బండి సంజయ్ కుమార్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పిఆర్పి ఎన్నికల సమయంలో హడావిడి చేయడం తప్ప  ఆయన…

Read More

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి!

ఊహాగానాలకు తెరదించుతూ.. ముందునుంచి అనుకున్నట్లే తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు గా రేవంత్ రెడ్డి నియమిస్తూ ఏఐసీసీ(అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ) ప్రకటించింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఐదుగురుని ఏఐసిసి నియమించింది. సీనియర్ నేతలు టి.జగ్గారెడ్డి, జె.గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌లతో పాటు అజారుద్దీన్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా సురేశ్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, రమేశ్‌ ముదిరాజ్‌,…

Read More

Israel: ఉగ్రవాద సంస్థల ‘మాస్టర్‌ మైండ్ల’కు ఒక కన్ను పోయినా మెదడు బాగే పనిచేస్తుందట!

Nancharaiah merugumala senior journalist: (‘ఒంటి కన్ను జాక్‌’ (హమాస్‌ నేత) దెయిఫ్‌ మొన్న 1200 ఇజ్రాయెలీల ప్రాణాలు తీసే ప్లాన్‌ వేస్తే…మరో ‘ఒన్‌ అయిడ్‌ జాక్‌’ శివరాసన్‌ 32 ఏళ్ల క్రితం రాజీవ్‌ గాంధీని దగ్గరుండి మరీ చంపించిన టైగర్ల వ్యూహకర్త) ======================= వారం రోజుల యూదుల మ్యూజిక్‌ ఫెస్టివల్‌ సుక్కోత్‌ ముగింపు దశకు చేరిన శనివారం ఇజ్రాయెల్‌ లోకి వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి. 1200 మందికి పైగా ఇజ్రాయెలీలు పాలస్తీనా విమోచన తీవ్రవాద సంస్థ…

Read More

వైసీపీ పాలనతో పదడుగులు వెనక్కి వెళ్లిపోతున్నాం: పవన్ కళ్యాణ్

Janasena : తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కచ్చితంగా జనసేన జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆరు నూరైనా సీటూ, గెలుపూ మనదేనని స్పష్టం చేశారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ని గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో క్లిష్టమైన సమయంలో మనోహర్ గారు అసెంబ్లీని ఎంతో సమర్థంగా నడిపించిన విధానం ఆయనలోని నాయకత్వ పటిమను, రాష్ట్రం పట్ల ఆయనకున్న నిబద్ధతను వెల్లడించాయన్నారు. అటువంటి…

Read More

SoniaGandhi:ఇందిర రాజ్యసభకు ఎన్నికైన దాదాపు 60 ఏళ్లకు అదే సభలో అడుగుబెడుతున్న సోనియా!

Nancharaiah merugumala senior journalist: ఇందిర రాజ్యసభకు ఎన్నికైన దాదాపు 60 ఏళ్లకు అదే సభలో అడుగుబెడుతున్న ఆమె పెద్ద కోడలు సోనియా! పార్లమెంటు ఎన్నికల ముందు కాంగ్రెస్‌ భవిష్యత్తుకు చక్కటి సూచిక ఇదేనేమో? మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటుకు తొలిసారి ఎన్నికైంది ఇప్పటికి దాదాపు 60 ఏళ్ల క్రితం. తండ్రి పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ మరణించిన మూడు నెలలకు 1964 ఆగస్టులో వారి కుటుంబ ‘సొంత రాష్ట్రం’ ఉత్తరప్రదేశ్‌ నుంచి ఇందిరమ్మను రాజ్యసభకు కాంగ్రెస్‌…

Read More

కన్నడ బ్రాహ్మణ దంపతుల అల్లుడు రిషి సునక్‌ ఇంగ్లండ్‌ ప్రధానైతే..?

nancharaiah merugumala (సీనియర్ జర్నలిస్ట్) బ్రాహ్మణ స్త్రీ కూతురు కమల అమెరికా ఉపాధ్యక్షురాలైతేనే సంబరపడ్డాం! మరి కన్నడ బ్రాహ్మణ దంపతుల అల్లుడు రిషి సునక్‌ ఇంగ్లండ్‌ ప్రధానైతే…. –––––––––––––––––––––––––––––––––––––––––––– తమిళ బ్రాహ్మణ డాక్టర్‌ శ్యామలా గోపాలన్‌ కూతురు కమలా హ్యారిస్‌ 2020 ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు కొందరు భారతీయులు సంబరపడ్డారు. 2022 జులై మాసంలో ది యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (అదే ఇంగ్లండ్‌ అధికారిక నామం) ప్రధానమంత్రిగా కన్నడ బ్రాహ్మణ దంపతులు సుధ, నాగవార రామారావు (ఎన్‌…

Read More
Optimized by Optimole