Headlines

Helath: నార్మల్ డెలివరీ మంచిదా.‌. సిజేరియన్ మంచిదా?

సాయి వంశీ ( విశీ) :  సాధారణంగా జరిగే ప్రసవాన్ని ఏ డాక్టర్ కూడా కాంప్లికేట్ చేసి సిజేరియన్ చేయాలని అనుకోరు. అలా అన్నారు అంటే, అక్కడ నిజంగానే ఏదో సమస్య ఉంది అని అర్థం. అన్ని సమస్యలూ చూసేవాళ్లకూ, ఒక్కోసారి తల్లికి కూడా అర్థం కావు. ప్రసవం అని మనం చాలా సహజంగా అంటున్నాం కానీ, ఒక స్త్రీకి తొలి కాన్పు నార్మల్ కావాలంటే మూడు నుంచి నాలుగు గంటలసేపు పడుతుంది. అంతంతసేపు ఎదురుచూడాలంటే కడుపు…

Read More

Muslims: ముస్లిం పురుషులు ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవచ్చు..?

Allahabad: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పర్ఖన్‌కు పెళ్లయ్యింది. ఆ విషయాన్ని దాచి మరో అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నాడు. అతను ముస్లిం. ఆ మహిళలిద్దరూ ముస్లింలు. రెండో భార్య కోర్టును ఆశ్రయించింది. తన భర్తకు ముందే పెళ్లయిన విషయం తనకు తెలియదని, ఆ విషయం దాచి తనను పెళ్లి చేసుకున్నాడని వివరించింది. తన పెళ్లిని రద్దు చేయాలని కోరింది. కేసు అలహాబాద్ హైకోర్టు దాకా చేరింది. 2020లో మొదలైన కేసుకు సంబంధించి ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించింది….

Read More

అమిత్ షా, జేపీ నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేంటి?: బండి సంజయ్

BJPTelangana: తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్ధమైందని వచ్చిన వార్తలు ఊహాగానాలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొట్టిపారేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. గతంలో మమతా బెనర్జీ, స్టాలిన్, నితీష్ కుమార్ వంటి ప్రతిపక్ష నేతలను కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశాభివ్రుద్దే బీజేపీ లక్ష్యమని అన్నారు. తెలంగాణలోని…

Read More

Telangana: తెలంగాణ లోక్ సభ లో బీజేపీ హవా.. newsminute24 ట్రాకర్ పోల్ సర్వే..!

Loksabhaelections2024:   తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధిక సీట్లు గెలిచే అవకాశం ఉందన్న దానిపై పలు సర్వే సంస్థలు ప్రజానాడీ తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా newsminute24 వెబ్ సైట్ ట్రాకర్ పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బీజేపీ పార్టీ అధిక సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. రెండవ స్థానంలో అధికార కాంగ్రెస్ పార్టీ నిలిచే అవకాశం ఉన్నట్లు newsminute24 సర్వే…

Read More

తెలంగాణలో దూకుడు ప్రదర్శిస్తోన్న కమలనాథులు!

తెలంగాణలో విజయ సంకల్ప సభ సక్సెస్ తో జోరుమీదున్న కమలనాథులు దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరికలకు సంబంధించి కమిటీలను నియమించిన రాష్ట్ర నాయకత్వం.. టీఆర్ ఎస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించిన సమాచారం కోరుతూ.. ఆపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాచారం హక్కు చట్టం కింద ఒకేసారి 88 దరఖాస్తులు చేసి షాకిచ్చారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో…

Read More

మనసును ఇలాగే జయించాలి… మనుషులుగా మనం గెలవాలి…

మనుషులుగా గెలుద్దాం…. నాతో ఉన్న ఈ చిన్నారులు ఇద్దరు నా దగ్గర చదువుతున్న ఏడవ తరగతి విద్యార్థులు. కళ్యాణి, భార్గవి. ఈరోజు కళ్యాణి పుట్టినరోజు. సరిగ్గా నెలరోజుల క్రితం ఈ ఇద్దరు పిల్లల తల్లి  చిన్న కలతకు పెద్ద శిక్ష వేసుకుని హార్పిక్ బాటిల్ తాగేసి ఆత్మహత్య చేసుకుంది. వారం రోజులు ఆసుపత్రిలో పోరాడి మృత్యువు ఒడిలోకి జారుకుంది. ఆగస్టు 15 ఆజాదీకా అమృతోత్సవం రోజున ఈ పిల్లలిద్దరికీ క్రమశిక్షణలో ఉత్తమ బహుమతి సర్టిఫికెట్ తో సహా…

Read More

Prajahitayatra: 6 గ్యారంటీల కోసం బీఆర్ఎస్ ఎందుకు కొట్లాడటం లేదు?

Bandisanjay: ‘‘మరో 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది. 6 గ్యారంటీలు అటకెక్కబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. ఎన్నికల  హామీలను కాకి ఎత్తుకెళ్లిందని చెప్పబోతున్నారని.. గట్టిగా నిలదీస్తే మేం హామీలను అమలు చేయాలనుకున్నాం.. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది… ఎన్నికలైపోంగనే అమలు చేస్తామని కాంగ్రెస్ కాకమ్మ కథలు చెప్పబోతుందని ఆయన ఎద్దేవ చేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా  బండి సంజయ్ జమ్మికుంట టౌన్ లో ప్రసంగించారు….

Read More

చెన్నె సూప‌ర్ కింగ్స్ కి ఎదురుదెబ్బ!

ఐపీఎల్ ఆరంభానికి ముందు చెన్నె సూప‌ర్ కింగ్స్ కి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు ప్ర‌ధాన పేస‌ర్ ఆస్ట్రేలియా ఆట‌గాడు జోష్ హెజెల్ వుడ్ ఈఏడాది ఐపీఎల్ టోర్నికి దూర‌మ‌వుతున్న‌ట్లు గురువారం ప్ర‌క‌టించాడు. సుధీర్ఘ కాలం బయో బ‌బుల్‌లో ఉన్నందున, విశ్రాంతికోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వుడ్‌ తెలిపాడు. రాబోయే రెండు నెల‌లు కుటుంబ స‌భ్యుల‌తో ఆస్ట్రేలియాలో గ‌డ‌ప‌నున్న‌ట్లు వుడ్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్, యాషెస్ సిరిస్లతో పాటు టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ ఉన్నందున దానిని…

Read More

భాషా సంస్కృతిని కాపాడుకోవాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

తెలుగు భాషా సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.ప్రాచీన సాహిత్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ ఆమెరికా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచికను ఆయన ఆవిష్కరించారు.భాషను మరిచిపోతే తెలుగు సంస్కృతి కూడా దూరమవుతుందని ఆయన పేర్కొన్నారు. తెలుగులోని అనంత సాహితీ సంపదను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యతలను- తెలుగుభాష కోసం కృషి చేస్తున్న సంస్థలు తలకెత్తుకోవాలని…

Read More
Optimized by Optimole