Modi:పదేళ్ల పాలన ట్రెయిలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అంటున్న మోదీ
Nancharaiah merugumala senior journalist: ఇది ట్రెయిలర్ మాత్రమే, అసలు పని పూర్తవ్వాలంటే ఇంకా సమయం కావాలి:మోదీ ‘ ప్రధానమంత్రిగా నా పదేళ్ల కృషి కేవలం ట్రెయిలర్ మాత్రమే, ఇంకా నేను ముందు ముందు చేయాల్సింది చాలా ఉంది, ’ అని నరేంద్రమోదీ మంగళవారం అహ్మదాబాద్ లో ప్రకటించారు. మరి ‘మిగిలిపోయిన పనులు’ పనులు పూర్తి చేయడానికి భారత ఓటర్లు మరో పదేళ్లు ప్రధాని కుర్సీలో మోదీని ఉండనిస్తే…చివరాఖరుకు (2034) ఆయన 84 సంవత్సరాల దగ్గరకు చేరుకుంటారు….
Astu: మానవ సంబంధాల్లోని లోతైన తాత్వికతకు అద్దం పట్టే మరాఠీ మూవీ..
విశీ( సాయివంశీ): కొన్ని సినిమాల గురించి తప్పకుండా చెప్పాలనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో ఇదీ ఒకటి. 2015లో సుమిత్రా భావే, సునీల్ సుక్తంకర్ల దర్శకత్వంలో మరాఠీలో వచ్చిన ‘అస్తు’. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ రిటైర్డ్ సంస్కృత ప్రొఫెసర్ కథ. అనుకోకుండా ఒక రోజు ఆయన తన ఇంటివారికి కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోతే? ఇలాంటి కథలు అంతకు ముందు, ఆ తర్వాత కొన్ని వచ్చాయి. అయితే ఈ సినిమాలో చూపించి జీవన తాత్విక అంశాలు ప్రత్యేకంగా అనిపిస్తాయి. కథ: …
janasenatdp: ” ప్రతి చేతికీ పని – ప్రతి చేనుకు నీరు ” స్లోగన్స్ తో జనసేన – టీడీపీ వినూత్న ప్రచారం..
janasenatdp: ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై జనసేన- టీడీపీ కూటమి రూపొందించిన వీడియోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ” హల్లో ఏపీ – బైబై వైసీపీ “.. ” ప్రతి చేతికీ పని – ప్రతి చేనుకు నీరు ” స్లోగన్స్ తో రూపొందిన వీడియోలు నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక జనసేన, టీడీపీ అభిమానులు గురించి ఎంత చెప్పిన తక్కువే.. దొరికిందే చాన్స్ అన్నట్లు వీడియోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు….
BJPTELANGANA: తెలంగాణ బీజేపీలో మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి చేరికపై రచ్చ..
BJPTELANGANA: సెల్ఫ్ గోల్ కొట్టడంలో తెలంగాణ బీజేపీ నేతలు దిట్ట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకొని చచ్చి చెడి 8 స్థానాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం దేశమంత ప్రధాని మోదీ చరిష్మా.. రామమందిర ప్రాణ ప్రతిష్టతో బీజేపీ గాలి వీస్తోంది. ఈతరుణంలో అందివచ్చిన సువర్ణవకాశాన్ని క్యాష్ చేసుకోవడంలో మాత్రం తెలంగాణ బీజేపీ నాయకత్వం తడబడుతోంది. దీనికి తోడు సొంత పార్టీ నేతలపై దాడులు చేయించిన నేతలను పార్టీలో చేర్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అసెంబ్లీ…
TragicLife: కత్తి పట్టినవాడు కత్తి వల్లే మరణిస్తాడనే వాక్యం నిజమైంది..!
విశీ( సాయివంశీ) : నిండా 19 ఏళ్లు. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి, అందులో రౌడీలు, డాన్లు చేసే పనులు నచ్చాయతనికి. తానూ అలాగే అవ్వాలని అనుకున్నాడు. మెల్లగా మొదలైన అతని నేరాల పరంపర భారీ స్థాయికి చేరింది. చివరకు అతని ప్రాణాలు తీసింది. కత్తి పట్టినవాడు కత్తి వల్లే మరణిస్తాడనే బైబిలు వాక్యం నిజమైంది. 20 ఏళ్లు రాకుండానే మరణించిన ఈ యువకుడి జీవితం ఎంతోమందికి గుణపాఠం. పిల్లల్ని పెంచే తల్లిదండ్రులకు జీవనపాఠం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని…
Bandisanjay:కేటీఆర్ కండకావరంతో కన్నుమిన్నూ కానకుండా మాట్లాడుతున్నారు: బండి సంజయ్
Bandisanjay: పార్లమెంట్ లో తాను ఏనాడూ మాట్లాడలేదని, ఒక్క పైసా తీసుకురాలేదంటూ కేటీఆర్ పచ్చి అబద్దాలాడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. కేటీఆర్ కు కళ్లు దొబ్బాయని, ఒక్క పార్లమెంట్ రికార్డులు చూసుకోవాలని సూచించారు. పార్లమెంట్ లో నిరంతరం వినోద్ కుమార్ మాట్లాడారని కండకావరమెక్కి మాట్లాడుతున్న కేటీఆర్… మరి వినోద్ కుమార్ సాధించేదేమిటో చెప్పాలన్నారు. కరీంనగర్- జగిత్యాల, కరీంనగర్–వరంగల్, ఎల్కతుర్తి – సిద్ధిపేట రోడ్ల విస్తరణకు నిధులెందుకు తేలేదని ప్రశ్నించారు. ఆయా…
Nalgonda: ఉమ్మడి నల్గొండ జిల్లాలో తహశీల్దార్ల ‘ భూ’ లీలలు..
Nalgonda: గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో పాత ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జరిగిన భూ అక్రమాలపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో పనిచేసిన తహశీల్దార్లు ప్రజా ప్రతినిధులు.. అధికారుల అండ చూసుకుని చేసిన అక్రమాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను సైతం అక్రమంగా కాజేసారన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో.. వారు బండారం బయటపెట్టాలని బాధితులు పట్టుదలగా ఉన్నట్లు ఉమ్మడి జిల్లాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి….