Telangana: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ సీట్లు ఏ పార్టీకి అంటే?
Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఎన్నికల పోలింగ్ కు చాలా రోజులు ఉంది కదా అన్న భ్రమల్లో పార్టీల నేతలు ఉన్నట్లు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. అధికారంలో ఉన్నామని తమకు కలిసొస్తుందని కాంగ్రెస్.. మోదీ గాలితో నెట్టుకు రావొచ్చని అటు బీజేపీ భావిస్తోంది. ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మొద్దు నిద్ర విడిచి ప్రజా క్షేత్రంలో దూకుడుగా వెళుతోంది. మరి ఇప్పటికపుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధిక…
BJP : ‘ మానసిక యుద్ధం’ తోనే బీజేపీ లక్ష్యం సాధ్యం..!
BJP: రాజకీయ యుద్ధంలో పట్టు సాధించాలంటే ప్రత్యర్థులను మానసికంగా బలహీనపర్చాలి… వైరి వర్గంలో విభేదాలు సృష్టించాలి… అని రాజనీతిజ్ఞుడు చాణక్యుడు చెబుతారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఇవే సూత్రాలను అనుసరిస్తోంది. సొంతంగా 370కు పైగా, ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాలు సాధిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. వారు చెబుతున్నట్టు ఇన్ని స్థానాలు సాధించడం సాధ్యమా అని అధ్యయనం చేస్తే ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బెతీయడమే బీజేపీ లక్ష్యంగా కనబడుతోంది. ఆర్టికల్ 370…
Telangana: నమ్మి ఓట్లేసిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది: బండి సంజయ్
Bandisanjay: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.. వంద రోజుల్లో రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తానన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు…రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదని, పంట నష్టపోయిన రైతులకు పరిహారంలో జాప్యమెందుకని నిలదీశారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగట్టడంతో రైతులకు భరోసా ఇచ్చేందుకే ‘రైతు…
Tollywood: Background Artistsని సరిగా గమనించకపోతే మొత్తం సన్నివేశాన్ని చెడగొడతారు..
విశీ( సాయి వంశీ) : ఇటీవల రాజమౌళి & సందీప్రెడ్డి వంగ ఇద్దరూ ఒక ఇంటర్వ్యూలో Background Artists గురించి మాట్లాడారు. నాకు ఆ టాపిక్ చాలా ఆసక్తికరంగా అనిపించింది. మలయాళ సినిమాలో Background Artists గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారని, ఒక సన్నివేశంలో ప్రధాన తారాగణంతో పాటు వెనకాల ఉండే జూనియర్ ఆర్టిస్టులు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే విషయంలోనూ బాగా శ్రద్ధ చూపుతున్నారని మాట్లాడుకున్నారు. బహుశా ఎక్కడా చర్చకు రాని అంశాన్ని వాళ్లు…
BRS: పార్టీ ఫిరాయింపుల పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు..
కవీందర్ రెడ్డి (పొలిటికల్ అనలిస్ట్): పార్టీ ఫిరాయించే వాళ్ళ గురించి వాళ్ళను చేర్చుకునే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత తెరాస కు అందులోని నాయకులకు లేదు ప్రజలకు మాత్రమే ఉంది. 2019 లో గెలిచిన తరువాత బ్రహ్మాండమైన మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్యెల్యేలను చేర్చుకున్నారు. ఇప్పుడు 64 మంది మాత్రమే ఉన్న కాంగ్రెస్ ఊరుకోదు కదా అదే పని చేస్తోంది. ఉదాహరణకు కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు ఓడిపోయిన తరువాత కాంగ్రెస్ నుండి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డిని…
literature: రచయితలై బతికి బట్టకడదామనేనా?
విశీ( సాయి వంశీ): (Note) : ఇది సరదాగా రాసిన పోస్టు. ఇది ఎవర్నీ ఉద్దేశించింది కాదు. చదివి సరదాగా నవ్వుకోండి…. అని నేనంటే అచ్చంగా నమ్మేరు! అలా ఏమీ లేదు. ఇది సీరియస్గా రాసిందే. నాతోసహా కొంతమంది స్వీయ అనుభవాలు విని రాసింది. మనకు ‘రచయిత’ అని పేరు రావడమూ, మన ఇంటిని పోలీస్స్టేషన్కు అద్దెకివ్వడమూ ఒక్కలాంటివే! వేళాపాళా లేని అనేక విషయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అనేక ఊహాగానాలు మన మీద చెలరేగుతూ ఉంటాయి….
Poetry: ‘ నిశ్శబ్దం ‘..నెమ్మదిగా పాకుతోంది..!
Panyala jagannathdas: నిశ్శబ్దం.. రాత్రి తెరలను దించిన చేయి కాంతిని నిశితంగా చూస్తూ పకాలుమని నవ్వుతోంది. సీసాలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నదేమిటి? పరచుకున్న మబ్బు, కాసింత వెలుగు. చీకటి కనుగుడ్లను చీల్చుకుని దూసుకెళ్లిన బాణం ధవళ చిహ్నాలను విడిచిపెట్టింది. కిటికీకి ఆవల రాత్రి తెర మీద ఒక ఉల్క నెమ్మదిగా పాకుతోంది. — కజక్ మూలం: అర్దక్ నుర్గాజ్ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు
