ఎర్రకోట ఘటన అవమానకరం : పంజాబ్ సీఎం

దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజున ఎర్రకోట వద్ద జరిగిన ఘటన అవమానకరమని పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ అన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం తనను బాధించాయని.. ఎర్రకోటపై రైతులు జెండా ఎగరవేయడం దేశానికి అవమానకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన వెనక ఎవరున్నారన్నది దర్యాప్తు చేయాలన్నారు.

ఎర్రకోట ఘటన మాపనే : ఎస్ఎఫ్జె

ఎర్రకోట పై జెండా ఎగరవేయడం మాపనే అని నిషేధిత ఖలిస్తాన్ సంస్థ ఎస్ ఎఫ్ జె (సిక్స్ ఫర్ జస్టిస్) ఓ ప్రకటనలో తెలిపింది. అందుకు సంబంధించిన 7 నిమిషాల వీడియో విడుదల చేసింది. అంతే కాక కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే రోజు పార్లమెంట్ పై జెండా ఎగురవేసిన వారికి 3.5 లక్షల డాలర్లు(2.55 కోట్లు).. ఎర్రకోట పై జెండా ఎగురవేసిన వారికి 2.55 లక్షల డాలర్లు( 1.82) ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటనలో వెల్లడించింది.

More From Author

దర్శకధీరుడిపై బోనీ కపూర్ ఆగ్రహం.

‘ సైనా’ ఓటిటిలో రిలీజ్!