ఫలితాలు అన్ని పార్టీలకు మును(పటి)గోడే…!!
దేశంలోనే అత్యంత ఖరీదైన మునుగోడు ఉప ఎన్నికల హడావుడి ముగియడంతో ఇప్పుడు రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయాలపై చర్చలు మొదలయ్యాయి. మునుగోడు ఎన్నికల ఫలితాల ప్రభావంతో రాబోయే కాలంలో రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. టిఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలకు మునుగోడు బలమైన నియోజకవర్గం. 2018 సాధారణ ఎన్నికల్లో 12 వేల ఓట్లు మాత్రమే సాధించిన బిజెపి బలం నామమాత్రమే అయినా ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యక్తిగతంగా పట్టు ఉంది. 2014లో…