Telangana: కొండా చూపు.. గులాబీ వైపు?

Telangana: ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా..? రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న కొండా దంపతులు కొత్త రాజకీయ నిర్ణయానికి సిద్ధమవుతున్నారా..? అధికార కాంగ్రెస్‌లో కొనసాగుతూనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారా..? గులాబీ పార్టీతో పాటు కమలం పార్టీ నుంచి కూడా ఆహ్వానాలు అందుతున్నాయా..? ఇంతకీ కొండా దంపతుల తదుపరి అడుగు ఏంటి..? చూద్దాం ఈ ప్రత్యేక కథనంలో..  

Read Full News

Telangana: కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం అవినీతి రుజువైంది: మహేష్‌కుమార్ గౌడ్

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ సీఎం రేవంత్‌రెడ్డి పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కవిత చేసిన వ్యాఖ్యలతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తేలిపోయిందని ఆయన స్పష్టం చేశారు. “కాళేశ్వరంలో తప్పు చేసింది కేసీఆరా? లేక హరీశ్‌ రావా? అనేది మాకు సంబంధం లేదు. వారి హయాంలోనే స్కాం జరిగిందనేది కవిత మాటలతో రుజువైంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే? కాళేశ్వరం అవినీతిలో మామ కేసీఆర్‌ వాటా ఎంత..?…

Read Full News

BRS: అవినీతి అనకొండలు హరీశ్–సంతోష్: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు, సంతోష్ రావు “అవినీతి అనకొండలు” అంటూ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. “కేసీఆర్ కు తిండి, డబ్బుల మీద ధ్యాస ఉండదు. కానీ ఆయన పక్కన ఉన్న వారివల్లే అవినీతి మరక అంటింది. నేడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను విమర్శించే పరిస్థితి రావడానికి కారణం హరీశ్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు మెగా కృష్ణారెడ్డి” అని కవిత ఆరోపించారు. ప్రస్తుతం…

Read Full News

BRS:‘సైన్యాధ్యక్షుడు’రాని యద్ధం.. నెగ్గేదెలా?

BRSParty: బీఆర్ఎస్ లో అంతర్మధనం..! ‘రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవం‘ టారు. ఏడాది కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన ప్రజామద్దతు కాంగ్రెస్ నిలబెట్టుకోకున్నా, ఓటమి నుంచి పాఠం నేర్చి బీఆర్ఎస్ పుంజుకోకున్నా, తద్వారా ఏర్పడే శూన్యంలోకి బీజేపీ విస్తరించకపోయినా… అది మూడు పార్టీలకీ రాజకీయ ఆత్మహత్యా సదృశమే! కాస్త హెచ్చు-తగ్గులతోనే అయినా… ముగ్గురి ముంగిటా ఇపుడు అవకాశాలున్నాయి. అంతా అయ్యాక, తమ దుస్థితికి ఎదుటివారొకరిని నిందించి ప్రయోజనముండదు. స్వయంకృతాపరాధం లేకుండా చూసుకోవడంలోనే నైపుణ్యం, విజయరహస్యం దాగి ఉంది….

Read Full News

KCR: కేసీఆర్ వ్యూహంతో ఫలితం దక్కేనా?

Telangana politics: రాష్ట్రంలో రాజకీయాలు….. శీతాకాలపు చలిని మరిపించేంత వేడి పుట్టిస్తున్నా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మౌనమే పాటిస్తున్నారు. అప్పుడప్పుడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో అంతర్గతంగా మాట్లాడుతున్న అంశాల సారాంశం మాత్రం బయటకు వస్తోంది. ఇటీవలే… పాలకుర్తి నియోజకవర్గం వారితో మాట్లాడి, పంపిందీ అటువంటి సందేశమే! చాన్నాళ్లుగా ఆయన పాటిస్తున్న మౌనం వెనుక ఏముంది! అది వ్యూహాత్మక ఎత్తుగడా? రాజకీయ వైరాగ్యమా? జనం మెదళ్లను ఈ ప్రశ్న తొలుస్తోంది. ఇదుగో ఇప్పుడొస్తారు, అదుగో అప్పుడొస్తారు,…

Read Full News

Arekapudigandhi: అంగలూరు + అరెకపూడి = ఆంధ్రోడు కాదు

Nancharaiah merugumala senior journalist అంగలూరు + అరెకపూడి = ఆంధ్రోడు కాదు త్రిపురనేని రామస్వామి సొంతూరు అంగలూరులోనే పీఏసీ ‘గాంధీ’ పుట్టాడు! పదేళ్ల క్రితం అరెకపూడి గాంధీ శేరీలింగంపల్లి నుంచి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైనప్పుడు కృష్ణా జిల్లాలో మా నాన్న తల్లిండ్రులిద్దరూ పుట్టిపెరిగిన సొంతూరు ‘అంగలూరు’ వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడనే ఆనందం కలిగింది. అదీగాక, రాష్ట్ర విభజన సమయంలో జరిగిన 2014 ఎన్నికల్లో తెలంగాణ అవతరణతో బాగా నష్టపోయిన తెలుగుదేశం తరఫున సైబరాబాద్‌ ప్రాంతమైన శేరిలింగంపల్లి…

Read Full News

రేవంత్‌ నోటికి తాళం వేసే సత్తువ సిద్దిపేట పద్మనాయకులకు లేదేమో మరి!

Nancharaiah merugumala senior journalist:   (‘సోనియా తెలంగాణ ఇస్తే–కేసీఆర్‌ దాన్ని దిల్లీ నుంచి మోసుకొచ్చాడు’..తెలంగాణ జనాన్ని నాడు ఆంధ్రోళ్లు సైతం ఇలాంటి ‘బూతు మాటల’తో కించపరచలేదే!రేవంత్‌ నోటికి తాళం వేసే సత్తువ సిద్దిపేట పద్మనాయకులకు లేదేమో మరి!) ………………………………………………………………………….. ‘ఆనాడు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే టీఆస్‌ నేత కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్‌ పరిస్థితి అధ్వానంగా ఉండేది,’ అని గురువారం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్‌ రెడ్డి పెద్దపల్లిలో అన్నారు. 1956–2014…

Read Full News

Telangana: బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు చిచ్చు.. తెరపైకి ఉద్యమ కారులు…

Telanganapolitics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు ముంచుకొస్తుంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు  అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించాయి. అయితే అధికార పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుపై మీడియాలో కథనాలు రావడంతో కలవరం మొదలైంది.దీంతో ఆయా నియోజక వర్గాల్లో టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సమవేశాలు ఏర్పాటు చేసి మా ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని ప్రెస్ మీట్లు పెట్టి అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది చాలాదన్నట్లు సీఎం కెసిఆర్…

Read Full News

Telangana: బీఆర్ఎస్ కు సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుతో భారీ డ్యామేజ్..

Telanganapolitics: తెలంగాణాలో ఆసక్తికర రాజకీయ నడుస్తోంది. ప్రధాన పార్టీలైనా బీఆర్ఎస్ ,కాంగ్రెస్ బిజెపి అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల లిస్టు వచ్చేస్తోందని మీడియా చానళ్లు ఊదరగొట్టేస్తున్నాయి. దీనికి తోడు అధికార బిఆర్ఎస్ 30 మేర  సిట్టింగ్ ఎమ్మెల్యేలను  మారుస్తుందన్న ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలలో సీటు వస్తుందా? రాదా?  అన్న గూబులు మొదలైంది. మరోవైపు పార్టీ టికెట్ ఆశించిన ఆశావాహులు.. కాంగ్రెస్ పార్టీ ఓవర్ లోడ్ అవడంతో బిజెపి నేతలతో సంప్రదింపులు…

Read Full News
Optimized by Optimole