BRS: పార్టీ ఫిరాయింపుల పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు..

కవీందర్ రెడ్డి (పొలిటికల్ అనలిస్ట్):  పార్టీ ఫిరాయించే వాళ్ళ గురించి వాళ్ళను చేర్చుకునే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత తెరాస కు అందులోని నాయకులకు లేదు ప్రజలకు మాత్రమే ఉంది. 2019 లో గెలిచిన తరువాత బ్రహ్మాండమైన మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్యెల్యేలను చేర్చుకున్నారు. ఇప్పుడు 64 మంది మాత్రమే ఉన్న కాంగ్రెస్ ఊరుకోదు కదా అదే పని చేస్తోంది. ఉదాహరణకు కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు ఓడిపోయిన తరువాత కాంగ్రెస్ నుండి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డిని…

Read More

Telangana: కాంగ్రెస్ – బీఆర్ఎస్ ఒకే చెట్టు మీది పక్షులు..

బండి సంజయ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు . ============= తెలంగాణలో ప్రభుత్వం మారినా ప్రజల జీవితాలు ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయి. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అష్టకష్టాలు పడిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి చరమగీతం పాడితే ఆకాశమే హద్దుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వంద రోజుల్లోనే చేతులెత్తేసి ప్రజలను వంచించడంలో బీఆర్‌ఎస్‌కు తానేమి తక్కువ కాదని నిరూపించింది. బీఆర్‌ఎస్‌ బంగారు తెలంగాణ అంటూ అరచేతిలో స్వర్గం…

Read More

Telangana : కోదండరామ్‌ చట్టసభకు నామినేట్‌ కాలేకపోవడం తెలుగునాట కులం గొప్పతనాన్ని చెబుతోంది..!

Nancharaiah merugumala senior journalist: కాంగ్రెస్‌ రెడ్డి సీఎం వస్తేనేగాని ఎం.కోదండరామ్‌ గారు చట్టసభకు నామినేట్‌ కాలేకపోవడం తెలుగునాట కులం గొప్పతనాన్ని చెబుతోంది!రెండక్షరాల తోకను పాతికేళ్ల క్రితమే తీసేసినా అదే ఆయనను పెద్దల సభకు పంపిస్తోంది! పూర్వ మార్క్సిస్టు, పౌరహక్కుల సంఘం మాజీ నేత, తెలంగాణ ఉద్యమ నాయకుడు డాక్టర్‌ ముద్దసాని కోదండరామ్‌ రెడ్డి గారు 2014లోనే టీఆరెస్‌ నేత, నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుగారి సంపూర్ణ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికకావాల్సింది. మారిన పరిస్థితుల్లో…

Read More

విమర్శలు సరే! వాస్తవాలనూ విస్మరిస్తారా?

శేఖర్ కంభంపాటి ( సీనియర్  జర్నలిస్ట్ ): ప్రస్తుత ప్రభుత్వాలు, గత ప్రభుత్వాల మీద విమర్శలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. నిన్న మొన్నటి వరకు  రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కాంగ్రెస్ మీద ఒంటికాలు మీద లేచేవి. స్వాతంత్ర్య భారతంలో అర్థ శతాబ్దానికి పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అధోగతి పాలు చేసిందనే విమర్శలు చేసేవి, ఇప్పుడు చేస్తూనే ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశానికి, రాష్ట్రానికి…

Read More

తెలుగు రాష్ట్రాల్లో పదేళ్లుగా బ్రాహ్మణ మంత్రి లేకపోవడం మంథని నియోజకవర్గం ఘనతకు నిదర్శనం..

Nancharaiah merugumala senior journalist:దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ప్రమాణం చేసే వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పదేళ్లుగా..బ్రాహ్మణ మంత్రి లేకపోవడం మంథని నియోజకవర్గం ఘనతకు నిదర్శనం ‘సింథాల్‌ ఇచ్చే వాగ్దానం నిలబెట్టుకునేది సింథాల్‌ ఒక్కటే’ అనే మాటలు మా తరం ‘యువకులకు’ 1960లు, 70ల్లో కనిపించేవి, వినిపించేవి. సింథాల్‌ అనే ఒంటి సబ్బు వ్యాపార ప్రకటనతో ఈ మాటలు జోడించి అప్పట్లో జనాన్ని ఆకట్టుకునేది బహుళ ఉత్పాదకల కంపెనీ గోద్రెజ్‌. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు…

Read More

తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయింపు..

telanganacabinet2023: తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. భట్టి విక్రమార్క _ ఆర్ధిక శాఖ దామోదర రాజనర్సింహ _ ఆరోగ్య పొంగులేటి _ సమాచార శాఖ శ్రీధర్ బాబు_ ఐటి ఉత్తమ్_ పౌర సరఫరా, తుమ్మల నాగేశ్వరరావు _ వ్యవసాయ శాఖ కోమటి రెడ్డి _ రోడ్లు, భవనాలు సీతక్క_ పంచాయతీ రాజ్ జూపల్లి_ ఎక్సైజ్ శాఖ పొన్నం ప్రభాకర్ _ రవాణా శాఖ కొండా సురేఖ…

Read More

అట్టహాసంగా రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ..

Revanthreddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి,మంత్రులుగా మరో 11 మందితో గవర్నర్ తమిళి సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎల్బీ స్టేడియంలో అతిరధ మహారధులు సమక్షంలో రేవంత్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఏఐసీసీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హిమాచల్ ప్రదేశ్ సిఎం , తదితరులంతా ఈ కార్యక్రమానికి…

Read More

Newsminute24 ఎగ్జిట్ పోల్ ప్రకారమే ఫలితాలు..

Telanganaexitpoll2023:తెలంగాణలో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. విజేత ఎవరో తేలిపోయింది. అయితే ఫలితాలపై పలు సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పొల్స్ దాదాపు 90 శాతం నిజమయ్యాయి. ఇక newsminute24 సంస్థ  ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితం సైతం దాదాపు 95 శాతం నిజమయ్యింది. (క్రింది బాక్స్ లో newsminute24 ఇచ్చిన ఎగ్జిట్ పోల్)  

Read More

తెలంగాణ అమర వీరులకు ఈ విజయం అంకింతం: రేవంత్

TelanganaElections: కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని తెలంగాణ అమర వీరులకు అంకింతం ఇస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  తెలంగాణ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఆదివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి సచివాలయాన్ని సామాన్యులకు అందుబాటులో ఉంచుతామన్నారు రేవంత్ రెడ్డి.  సామాన్యులకు పరిపాలనను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రగతి భవన్ ను డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్…

Read More

పీపుల్స్‌పల్స్‌- సౌత్‌ఫస్ట్‌ ఎగ్జిట్ పోల్ ..తెలంగాణ కాంగ్రెస్దే..!

Telangana election: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా సాగింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ఎదురే లేదు, కాంగ్రెస్‌ ఇక రాదు అని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎన్నికల ముందు పరిస్థితులు ఒక్కసారిగా ‘నువ్వా-నేనా’ అన్నట్టుగా మారడంతో హ్యాట్రిక్‌ విజయంపై ధీమా పెట్టుకున్న బీఆర్‌ఎస్‌  ఆశలు గల్లంతయ్యే అవకాశాలున్నాయి. పీపుల్స్‌పల్స్‌ సంస్థ రాష్ట్రంలో నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ప్రకారం ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య కంటే బీఆర్‌ఎస్‌ ప్రజల…

Read More
Optimized by Optimole