ఎట్టకేలకు దిగొచ్చిన ట్విట్టర్!
విద్వేష పూరిత పోస్టులు, నకిలీ ఖాతాల నిలుపుదల విషయంలో ట్విట్టర్ ఎట్టకేలకు దిగొచ్చింది. బుధవారం కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి తో సమావేశమైన, ట్విట్టర్ ప్రతినిధుల చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో పలుచోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై విద్వేష పూరిత పోస్టులు, నకిలీ ఖాతాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్న ఖాతాలను మూసివేయాలని ట్విట్టర్ను కేంద్రం ఆదేశించింది. అయితే కొన్ని ఖాతాలను మాత్రమే నిలిపేసిన ట్విట్టర్ …..