Telangana: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం లోకేశ్ తో కేటీఆర్ భేటీ?

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి ఉపఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయం రంజుగా మారింది. ఈ ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు కోసం బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ప్రయత్నిస్తున్నట్టు కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇంతటితోనే ఆగకుండా, “నారా లోకేష్‌ను కేటీఆర్ ఎందుకుకలవాలనుకుంటున్నారు ?అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై,” ఉందన్నారు. అంతేకాదు, కేటీఆర్-లోకేష్ మధ్య ఒక్కసారి కాదు, పలు మార్లు రహస్య మంతనాలు జరిగాయి అని ఆరోపించారు సామా. ఈ…

Read Full News

TDP: కోటరీ వలయంలో యువనేత..!

TDP : రాజకీయాల్లో దూకుడుతోపాటు అనుభవానికి కూడా పెద్దపీట వేస్తేనే రాణించగలుగుతారు. సీనియర్లు పాత చింతకాయ పచ్చడి లాంటి వారని పక్కనపెడుతూ పూర్తిగా యువతకే ప్రాధాన్యతిస్తే కొత్త చింతకాయ పచ్చడితో ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. ఈ పచ్చడి ఉదాహరణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సరిగ్గా సరిపోతుంది. తనది నలభై ఏండ్ల రాజకీయ అనుభవమని నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెబుతుంటారు, అయితే టీడీపీలో మాత్రం ప్రస్తుతం అనుభవం కన్నా యువనేత నారా లోకేశ్‌ పెత్తనమే సాగుతోంది….

Read Full News

‘యువగళం ‘ పాదయాత్ర కి మంగళమేనా?

Naralokesh:టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ‘యువగళం ‘ పాదయాత్ర కి మంగళం పాడినట్లేనా? పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఆగిపోయిన పాదయాత్ర కొనసాగే దాఖలాలు కనిపించడం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాబు అరెస్ట్ తో గల్లీ వదిలేసి ఢిల్లీలో తిష్ట వేసిన లోకేష్ లో ..ఎంతసేపూ కేంద్ర పెద్దల మెప్పు పొంది కేసుల నుంచి  ఎలా బయట పడలనే తాపత్రయమే కనిపిస్తోందని పార్టీలో బయట గుసగుసలు వినిపించాయి….

Read Full News

” న్యాయానికి సంకెళ్లు” నిరసన కార్యక్రమంలో నారా లోకేష్, బ్రాహ్మిణి.

APpolitics: “న్యాయానికి సంకెళ్లు” ఇంకెన్నాళ్లని  నారా లోకేష్, బ్రాహ్మణి నినదించారు.  హైదరాబాద్లోని తమ నివాసంలో చేతులకు తాళ్లు కట్టుకుని చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసించారు. ఏ ఆధారాలు లేకపోయినా, రాజకీయ కక్షతో, ప్రజల నుంచి చంద్రబాబుని దూరం చేసేందుకు అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచి చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జైలులో ఆరోగ్యం క్షీణించినా తప్పుడు నివేదికలు ఇస్తూ అంతా బావుందని ప్రభుత్వం మోసపూరితంగా…

Read Full News

చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. భయాందోళనలో టిడిపి శ్రేణులు..

APpolitics : స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ విషయం టీడీపీ పార్టీలో సరికొత్త చర్చకు తావిస్తోంది. గురువారం కేసుపై  అటు చంద్రబాబు..ఇటు ఏసీబీ తరపు వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఆయన రిమాండ్ ను అక్టోబర్ 19 వరకు పొడిగించింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన మొదలైంది. మొదట చంద్రబాబును సెప్టెంబరు 9 న అరెస్ట్ చేసినప్పుడు.. షాక్ కి గురైనా.. ఆ పార్టీ నేతలు , కార్యకర్తలు..ఇది  జగన్…

Read Full News

అక్రమ కేసుల నుంచి న్యాయమే మమ్మల్ని కాపాడుతుంది: నారా లోకేష్

APpolitics : అక్రమ కేసులనుంచి న్యాయం, చట్టాలే తమను కాపాడతాయని యువనేత నారా లోకేష్ ధీమా వ్యక్తంచేశారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా డిల్లీలో లోకేష్ చేపట్టిన నిరాహారదీక్షను ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ కుటుంబసభ్యులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ…  మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా నమ్మిన సిద్ధాంతం కోసం జైలుకెళ్లారు.. చంద్రబాబు గారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు తెచ్చినందుకే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని…

Read Full News

నిరసనల మాట వింటేనే జగన్ ఉలిక్కి పడుతున్నాడు: నారా లోకేష్

APpolitics: రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై సిఎం జగన్ అణిచివేత వైఖరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. జనం రోడ్డెక్కితే సిఎం జగన్ జడుసుకుంటున్నాడని.. నిరసనల మాట వింటే ఉలిక్కి పడుతున్నాడని ఎద్దేవ చేశారు. ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రశ్నించే గళాలను చూసి భయపడుతోందన్నారు. చంద్రబాబు అరెస్టుపై, తమ హక్కుల కోసం పోరాడుతున్న వివిధ వర్గాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జగన్  పిరికితనాన్ని చాటిచెపుతోందని లోకేష్  స్పష్టం చేశారు. తమ…

Read Full News

‘జంగు సైరనుదేనో… జైలులో చంద్రన్నా…’ సాంగ్ వైరల్..రెచ్చిపోతున్న టీడీపీ అభిమానులు..

APpolitics: తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ తీవ్ర చర్చనీయంశమైంది. అటు టీడీపీ అభిమానులు.. ఇటు జన సైనికులు, మేధావులు.. బాబు అరెస్ట్ సరికాదంటూ వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అభిమానులు చంద్రబాబు పై రూపొందించిన సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇదే అదనుగా బాబు అభిమానులతో పాటు జనసేన నేతలు.. ” యుద్ధం మొదలైందని..కాస్కో జగన్ అండ్ కో ” అంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.ఇక టీడీపీ అభిమానులు…

Read Full News

లోకేష్ ను కలిసిన జనసేన నేతలు..చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు….

APpolitics:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను జనసేన నేతలు  మంగళవారం రాజమహేంద్రవరంలో  పరామర్శించారు. మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని, దుర్మార్గపాలనపై కలసి పోరాడుదామని జనసేన నేతలన్నారు. చంద్రబాబు అరెస్టును జనసేన తీవ్రంగా ఖండిస్తోందని .. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో ఆధారాలు లేకుండా చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిందని..రాష్ట్రంలో జగన్ అరాచకపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అరెస్టును ఖండించిన వారిపైనా వైసీపీ నేతలు  విమర్శలు చేస్తున్నారని, ఎన్నికల తర్వాత వైసీపీ భూస్థాపితం అవుతుందన్నారు. టీడీపీ పిలుపునిచ్చిన బంద్ కు…

Read Full News

అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అమరావతి నిర్మాణం: నారా లోకేష్

అమరావతి: విధ్వంసకర విధానాలతో 5కోట్లమంది భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, ఇది కేవలం అమరావతి రైతులకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు, యావత్ రాష్ట్రప్రజల సమస్య, సైకో పాలన అంతంతోనే రాష్ట్రానికి మళ్లీ గతవైభవం చేకూరుతుందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తాడికొండ నియోజకవర్గం రావెల శివార్లలో అమరావతి ఆవేదన పేరుతో రాజధాని రైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో పరిస్థితులను…

Read Full News
Optimized by Optimole