BharatRatna: పీవీకి భారతరత్న ఇబ్బందికరం కాబట్టే.. ఇద్దరు ప్రముఖుల పేర్లతో కలిపి ప్రకటించేశారా?

Nancharaiah merugumala senior journalist: ” పీవీకి భారతరత్న విడిగా ఇవ్వడం బీజేపీకి ఇబ్బందికరం కాబట్టే మరో ఇద్దరు దివంగత ప్రముఖుల పేర్లతో కలిపి ప్రకటించేశారా?” హరియాణా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ లో కుటుంబ మూలాలున్న గొప్ప వ్యవసాయ అర్థశాస్త్రవేత్త, రాజకీయ, సామాజిక సంస్కర్త, రైతు నాయకుడు చౌధరీ చరణ్‌ సింగ్, తమిళనాడుకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్‌ పేర్లతో కలిపి తెలంగాణ తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు గారికి భారతరత్న పురస్కారం ప్రకటించింది…

Read Full News

PV: అడ్వాణీకి ప్రకటించి 6 రోజులకు పీవీకి భారతరత్న ఇవ్వడం న్యాయమా?

Nancharaiah merugumala senior journalist: 21 సంవత్సరాల క్రితం అయోధ్యలోని బాబరీ మసీదును దగ్గరుండి మరీ కూలగొట్టడానికి అనుమతించిన లాల్‌ కిషన్‌ ఆడ్వాణీ జీకి, అలాగే 1992 డిసెంబర్‌ 6న ప్రధానమంత్రి హోదాలో హస్తినలోని అధికార నివాసంలో కూర్చుని వివాదాస్పద ముస్లిం కట్టడాన్ని నేలమట్టం చేయడానికి పరోక్షంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన పాములపర్తి వేంకట నరసింహారావు గారికి భారత రత్న పురస్కారాన్ని వారం రోజుల్లో వెంట వెంటనే ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయం. మసీదు ముందు పట్టపగలే నిలబడి…

Read Full News

Pmmodi: అయోధ్య రామ్‌లల్లా క్రెడిట్ మోదీ ఖాతాలో.. ..!

Nancharaiah merugumala senior journalist: ” అయోధ్యలో రామ్‌ లల్లా గుడికి పరోక్షంగా పునాదులేసిన పండిత నెహ్రూ, జీబీ పంత్, పీవీలకు రావాల్సిన కీర్తి ప్రధాని నరేంద్ర మోదీ సొంత ఖాతాలో పడిపోయింది!” తనపై అభాండాలు, నిందలేసిన నగర ప్రజలపైన, పాలకుడిపైనా కోపంతో సీతాదేవి అయోధ్య నగరాన్ని శపించిందని కొందరు చెప్పగా విన్నాం. ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని కాశీ, మథుర వంటి హిందువుల పుణ్యక్షేత్రాల్లో కనిపించే ఉత్సాహం, సంపద, చలనశీలత అయోధ్యకు వేలాది సంవత్సరాలుగా లేవు. ఈ…

Read Full News

భారత చివరి బ్రాహ్మణ ప్రధానులు గుడి కట్టి ఉంటే..నలుగురు పీఠాధిపతులూ ప్రాణప్రతిష్ఠకు వచ్చేవారేమో!

Nancharaiah merugumala senior journalist:   “భారత చివరి బ్రాహ్మణ ప్రధానులు పీవీ, ఆటల్జీ హయాంలో అయోధ్య గుడి కట్టి ఉంటే..నలుగురు పీఠాధిపతులూ ప్రాణప్రతిష్ఠకు వచ్చేవారేమో! “ భారతదేశంలో చిట్ట చివరి బ్రాహ్మణ ప్రధ్రాన మంత్రులు పీవీ నరసింహారావు గారు, అటల్ బీహారీ వాజపేయి జీ పాలనాకాలంలో అయోధ్య రామజన్మ భూమిపై బాల రాముడి మందిరం నిర్మించి ఉంటే చాలా బాగుండేది. అంత గొప్ప పని.. దైవభక్తి కలిగిన మంచి బ్రాహ్మణ పాలకుల పర్యవేక్షణలో జరిగి ఉంటే… గెడ్డమున్న…

Read Full News

అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణమే పీవీ నరసింహారావుకు నిజమైన నివాళి!

Nancharaiah merugumala senior journalist:  ఇందిరా గాంధీ హయాంలో వేళ్లూనుకున్న కుహనా సోషలిజాన్ని, రాజీవ్‌ గాంధీ పాలనలో బలహీన పడిన కుహనా లౌకికవాదాన్ని కూకటి వేళ్లతో పీకేసి ‘హిందూ’ మహాసముద్రంలో కలిపారు పాములపర్తి వేంకట నరసింహారావు గారు. ఈ తెలుగు అపర చాణక్యుడు ప్రధాని పదవి నుంచి దిగిపోయిన 8 ఏళ్లకు అంటే–19 సంవత్సరాల క్రితం 2004 శీతాకాలంలో కన్నుమూశారు. దక్షిణాదికి చెందిన ఒకే ఒక బ్రాహ్మణ ప్రధానమంత్రిపై చరిత్ర తుది తీర్పు ఇంకా ఇవ్వాల్సి ఉంది….

Read Full News

హైదరాబాద్ ఐటీ రంగం చంద్రబాబుతో మొదలైందనే వాదన వాస్తవం..

Nancharaiah merugumala senior journalist: (ఆర్థిక సంస్కరణలు పీవీతో ఆరంభమయ్యాయనే దాంట్లో ఎంత నిజం ఉందో..హైదరాబాద్ ఐటీ రంగం చంద్రబాబుతో మొదలైందనే వాదనలోనూ అంతే వాస్తవం ఉంది!) ఇండియాలో ఆర్థిక సంస్కరణలు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారితోనే ఆరంభమయ్యాయనే అబద్ధాన్ని దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదలయి, విస్తరించిందనే ప్రచారాన్ని మాత్రం ఆమోదించడానికి కొందరికి అభ్యంతరాలు ఉన్నాయి….

Read Full News

అమర్‌ సింగ్‌ చేతిలో తన్నులు తిన్న అరవ బాపనాయనకు పీవీ పై కోపమెందుకు?

Nancharaiah merugumala senior journalist: (పీవీకి తెలుగు బ్రామ్మల్లో ఉన్న అభిమానుల్లో నాలుగో వంతు… ఎన్టీఆర్‌ కు కమ్మ జనంలో ఉంటే…టీడీపీ స్థాపకుడి జీవితం అలా ముగిసేదా?)   ఎప్పుడో పాతిక ముప్పయేళ్ల క్రితం అయోధ్యలో బాబరీ మసీదు కూల్చడానికి నాటి కాంగ్రెస్‌ ప్రధాని పాలములపర్తి వేంకట నరసింహారావు గారు ఆరెసెస్‌–బీజేపీ శ్రేణులకు వీలుకల్పించినందుకు ఇప్పుడు సాటి దక్షిణాది బ్రాహ్మణ నేత నుంచి నిందలు పడాల్సివస్తోంది. కరీంనగర్‌–వరంగల్‌ ప్రాంత తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పీవీ గారిని…

Read Full News

దూరవిద్యతో మోదీ 2 డిగ్రీలు సంపాదించారంటే బుర్రలేని తెలుగోడికీ లోకువే!

Nancharaiah merugumala (senior journalist): ఇందిరకు కాలేజీ డిగ్రీ లేకున్నా ఫరవా లేదు, పండిత నెహ్రూ కూతురు కాబట్టి!ఎచ్‌.డీ.దేవెగౌడ ఎల్సీఈ చదివినా నష్టం లేదు, ఎందుకంటే ఆయన ఒక్కళిగ!దూరవిద్యతో మోదీ 2 డిగ్రీలు సంపాదించారంటే బుర్రలేని తెలుగోడికీ లోకువే! మొన్నీ మధ్య దిల్లీ రాజఘాట్‌ వద్ద నెహ్రూ–గాంధీ కుటుంబ వారసురాలు ప్రియాంకా గాంధీ వాడ్రా ఎంతో ఆవేశంగా మాట్లాడుతూ, ‘‘ నా అన్న రాహుల్‌ గాంధీ కేంబ్రిజ్, హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదవి, ఉన్నత పట్టాలు సంపాదించాడు. కాని…

Read Full News

తెలంగాణ బ్రాహ్మణ బిడ్డకి గుజరాతీ నేతలే న్యాయం చేయాలి!

Nancharaiah merugumala: _____________________________ బాబరీ మసీదును కూల్చి 30  ఏళ్లు నిండుతున్నా పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వరా? ‘వివాదాస్పద కట్టడం’ బాబరీ మసీదును అయోధ్యలో కూల్చేసి నేటికి 30 సంవత్సరాలు నిండుతున్నాయి. అప్పుడు ప్రధానమంత్రి పదవిలో ఉన్న పాములపర్తి వేంకట (పీవీ) నరసింహారావు గారు తనమౌనముద్రతో, ఉదాశీన వైఖరితో మసీదు కూల్చివేతకు దోహదం చేశారు. రాజధాని దిల్లీ నుంచే తన పరోక్ష తోడ్పాటును మిత్రుడు, బీజేపీ నేత అటల్‌ బిహారీ వాజపేయి గారికి అందించారు. పీవీ…

Read Full News

పీవీ పోస్టల్ స్టాంప్ విడుదల : కేంద్ర సహాయ మంత్రి

పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని పోస్టల్ స్టాంప్ విడుదల చేయనున్నట్లు కేంద్రం నిర్ణయించింది. ఈ విషయమై ప్రధాని మోదీ, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ తో చర్చించిన మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రిగా దేశ ప్రజలకు పీవీ ఎనలేని సేవలు అందిచారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చాణక్య నీతి, సంస్కరణలతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని ప్రగతి బాట పట్టించి,…

Read Full News
Optimized by Optimole