×

Atmakur: పెరిగిన ఎరువుల ధరలను తగ్గించాలని ఆత్మకూరు రైతు సంఘం మండల అధ్యక్షులు తుమ్మల సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆత్మకూరు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కందడి వెంకట్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా తుమ్మల సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం ఎరువుల ధరలను అడ్డగోలుగా పెంచి రైతుల పై మోయలేని భారాలు పెట్టీ రైతుల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. రైతులు వ్యవసాయాన్ని మానేసి.. కూలీలుగా మారే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు .వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని లేనిపక్షంలో రైతులందరినీ పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. గతంలో DAP బస్తా 1350 ఉండగా ఇప్పుడు 1650 కి పెరిగిందన్నారు. ఇతర కాంప్లెక్స్ ఎరువుల అన్నింటిపై దాదాపు వంద రూపాయలకు పై గా ధరలను పెంచి బీజేపీ సర్కార్ రైతులను నట్టేట ముంచిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్   ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతున్నా.. వారు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం  రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు సిపిఎం నేత వేముల బిక్షం.  రైతు భరోసా నిధులు ఇవ్వలేదని .. పెంచుతామన్న ఆసరా పెన్షన్ లు పెంచలేదన్నారు. మహిళలకు ఇస్తామన్న 2500 ఇవ్వలేదని.. తక్షణమే ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సేవ సమితి జిల్లా కార్యదర్శి కానుగంటి శ్రీశైలం, రచ్చ గోవర్ధన్,వేములబిక్షం,రాచమల్లసత్తయ్య,కనుకుంట్ల మధుసూదన్ రెడ్డి,సిరుగురు అంజయ్య, సామ వెంకట్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

crime: క్షణికానందం కోసం కుటుంబాల నాశనం!

Hyderabad: By Amaravaji Nagaraju ✍🏽 ఒకప్పుడు సమాజంలో పేరు సంపాదించాలంటే ప్రతిభ ఉండాలి… కష్టపడాలి… విలువలు పాటించాలి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్ని సెకన్ల వీడియోతో కోట్ల మందికి...

Read out all

crime: ఒక్క క్లిక్‌తో మొదలై… జీవితాన్ని కుదేలు చేసే మోసాలు..!!

Socialmedia: సోషల్ మీడియా ప్రపంచంలో కనిపించే విలాసవంతమైన జీవితం చాలామందిని ఆకర్షిస్తోంది. ఖరీదైన కార్లు, ఫైవ్ స్టార్ హోటళ్లు, విదేశీ పర్యటనలు, బ్రాండెడ్ గిఫ్ట్స్… ఇవన్నీ సులభంగా దక్కుతాయనే భ్రమలో...

Read out all

cinima: “నా జీవితం తెల్లకాగితం.. మచ్చ పడనివ్వను”: మురళీమోహన్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం సందర్భంగా ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ను తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన ‘మీట్ ది...

Read out all

cinima: “కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి.. నిజమేనా?”

Kollywood: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్.. గత కొంతకాలంగా వీరిద్దరి పేర్లు ప్రేమ, పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి....

Read out all

cinima: తెలంగాణ నేటివిటీకి అద్దం పట్టే ‘ఇడుపు కాయితం’

Tollywood: లోకేష్ కనకరాజ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన సుకుమార్ రైటింగ్స్ – బన్నీ వాస్ వర్క్స్ చిత్రం.. తెలంగాణ కుటుంబాల భావోద్వేగాలు, ఆచార వ్యవహారాలు, బంధాల మధ్య దాగి...

Read out all

Cinima : రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్

Tollywood: మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద...

Read out all
Optimized by Optimole