అనకొండ జగన్ సొంత చిన్నాయనను మింగేశాడు: పవన్ కళ్యాణ్

Varahivijayayatra: సీఎం జగన్ తను పెట్టిన గుడ్లను తినే అనకొండ పాము లాంటి వాడని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి సొంత చిన్నాయననే మింగేశాడని.. దళితులకు మేనమామ అని గొప్పలు చెప్పుకొంటూ వారికి చెందిన 23 పథకాలను రద్దు చేశాడని మండిపడ్డారు. వారాహి విజయయాత్రలో భాగంగా మలికిపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా  పవన్ మాట్లాడుతు.. ‘పాము ఆకలి వేస్తే ఎక్కడపడితే అక్కడ ఉన్న గుడ్లు తినేస్తుంది.. అప్పటికీ ఆకలి తీరకపోతే తన సొంత…

Read More

బీజేపీ నమ్మకాన్ని వమ్ముచేసిన తెలంగాణ రెడ్లు?

Nancharaiah merugumala senior journalist:  బీజేపీ నమ్మకాన్ని వమ్ముచేసిన తెలంగాణ రెడ్లు?రాజకీయ పరిశోధకుడు అసీం అలీ అంచనా! తెలంగాణలో పాలకపక్షం భారత రాష్ట్ర సమితికి (బీఆరెస్‌) ప్రధాన ప్రత్యర్థిగా అవతరించాలనుకున్న హిందుత్వ రాజకీయపక్షం బీజేపీ అంచనాలు తారుమారవుతున్నాయని దిల్లీ రాజకీయ పరిశోధకుడు అసీం అలీ భావిస్తున్నారు. అడపాదడపా ఆంగ్ల పత్రికల్లో వ్యాసాలు రాసే అసీం అలీ విశ్లేషణలు ‘అతి సెక్యులర్‌’ భావాలతో కాస్త వాస్తవ విరుద్ధంగా కనిపిస్తాయి. హిందుత్వ బీజేపీని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలు 2024లో విజయవంతంగా…

Read More

పురుషుడిగా మారుతున్న బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ కూతురు సుచేతన!

Nancharaiah merugumala senior journalist: “పదేళ్లకు పైగా మార్క్సిస్టు సీఎంగా కొనసాగిన నేత పేరు ఇన్నాళ్లకు వార్తల్లోకి.. 42 ఏళ్ల సుచేతన సర్జరీ తర్వాత సుచేతన్‌–ఎంతైనా కమ్యూనిస్టులే నిజంగా గొప్పోళ్లు “ ‘పురుషుడిగా మారనున్న మాజీ సీఎం కుమార్తె..’ అనే శీర్షికతో బుల్లి వార్త ఈరోజు ఈనాడు 15వ పేజీ కింద మూలలో కనపడింది. రెండు చిన్ని చిన్ని ఫోటోలు చూశాక పశ్చిమ బెంగాల్‌ సీపీఎం చివరి మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్జీ, ఆయన ఒకేఒక కూతురు…

Read More

“హాలో ఏపీ.. బైబై వైసీపీ” జనసేన నినాదం: పవన్ కళ్యాణ్

Varahivijayayatra: ‘అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి … అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి… జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి… “హాలో ఏపీ.. బైబై వైసీపీ” ఇదే జనసేన ఎన్నికల నినాదం కావాల’ని  పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.  వారాహి విజయయాత్రలో భాగంగా గురువారం అమలాపురం గడియార స్తంభం కూడలిలో భారీ బహిరంగ సభలో భాగంగా.. అందరితో నినాదాన్ని పలికించారు.సభకు హాజరైన అశేష జనవాహిని ‘హల్లో ఏపీ… బైబై వైసీపీ’ అని నినదిస్తుంటే అమలాపురం…

Read More

‘రామోజీరావు’ యూనీఫాం సివిల్‌ కోడ్‌ వ్యతిరేకిస్తారేమో!

Nancharaiah merugumala senior journalist:  “ఉమ్మడి పౌర స్మృతి వస్తే అవిభక్త హిందూ కుటుంబాలు (హెచ్యూఎఫ్‌) నడిపే సంస్థలకు పన్ను రాయితీలు రద్దవుతాయి..ఈ లెక్కన హెచ్‌ యూ ఎఫ్‌ ‘కర్త’ రామోజీరావు గారు కూడా మరి యూనీఫాం సివిల్‌ కోడ్‌ ను వ్యతిరేకిస్తారేమో!” ఉమ్మడి పౌర స్మృతిని (యూనీఫాం సివిల్‌ కోడ్‌–యూసీసీ) కాంగ్రెస్, కమ్యూనిస్టులు మొదలు తీవ్ర లౌకికవాద పార్టీలమని చెప్పుకునే అన్ని రాజకీయపక్షాలూ వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి ముస్లిం మైనారిటీల కొంప…

Read More

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన లేడీ రిపోర్టర్స్ వీడియో..!

తెలుగు రాష్ట్రాల్లో ఇద్ద‌రు సీనియ‌ర్ లేడి జ‌ర్న‌లిస్టుల వివాదం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రెండు ప్ర‌ముఖ తెలుగు చాన‌ళ్ల‌లో  హైక్యాడ‌ర్ పొజిష‌న్ లో ప‌నిచేస్తున్న‌ ఇద్ద‌రు జ‌ర్న‌లిస్టులు.. త‌గువులాడుతున్న వీడియో నెట్టింట్ట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.  ఈవీడియోపై నెటిజ‌న్స్ భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా గ‌తంలో ఏపీ ఎమ్మెల్సీ సీటు కోసం ఇద్ద‌రు మ‌హిళ రిపొర్ట‌ర్లు  తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. ఎవ‌రికి వారు త‌మకున్న ప‌రిచ‌యాల‌తో లాభియింగ్ చేశారు. దీంతో హైక‌మాండ్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డ‌మే త‌రువాయి అన్నట్లుగా ప్ర‌చారం…

Read More

కాపుల ప్రయోజనాలు కాపాడే ‘కాపయ్య నాయకులు’ ఏపీలో ఉన్నారు!

Nancharaiah merugumala senior journalist: ఆంధ్రప్రదేశ్‌ లో విశాల కాపు సముదాయం ప్రయోజనాలు కాపాడడానికి గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారు, చేగొండి హరిరామజోగయ్య గారు, కొణిదెల పవన్‌ కల్యాణ్‌ గారు అవసరమైనప్పుడల్లా మీడియా ప్రకటనలు, బహిరంగ లేఖల ద్వారా తమ శాయశక్తులా కష్టపడుతున్నారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల జనాభాతో పోల్చితే కనీసం పది రెట్లు ఎక్కువ జనాభాతోపాటు వందకు పైగా కులాలున్న ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీలు) రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలు…

Read More

వైసీపీ క్రిమినల్ కోటలను బద్దలు కొడదాం: పవన్ కల్యాణ్

Janasenavarahi: • డి గ్యాంగ్ అరాచకాలను అరికట్టకపోతే భవిష్యత్తు లేదు • ఇప్పటికే రాష్ట్రం బిహార్ కంటే దారుణంగా తయారైంది • నాయకులను చూసి, కార్యకర్తలూ అరాచకవాదులుగా తయారవుతున్నారు • ప్రశాంతమైన కాకినాడను క్రిమినల్స్ అడ్డాగా మార్చేస్తున్నారు • కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నాడు • సకలం దోచేస్తూ… గూండాగిరి చేస్తున్నాడు • ద్వారంపూడి రేషన్ బియ్యం మాఫియా ద్వారా కూడబెట్టింది రూ.15 వేల కోట్లు • గంజాయి మత్తు, బియ్యం…

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: పవన్ కళ్యాణ్

Varahivijayayatra: ‘వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి స్థానం నాకు ఇవ్వగలిగితే శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన నేల సాక్షిగా చెబుతున్నాను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాన’ని జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ పునారు. దశాబ్దం తర్వాత అన్ని అంశాల మీద పూర్తి అధ్యయనం చేసి, సంపూర్ణ అవగాహనతో ఈ మాట చెబుతున్నానని అన్నారు. దత్తాత్రేయ అంశలోని శ్రీపాద వల్లభుడు క్షేత్రం, అష్టాదశ శక్తి…

Read More

ఖర్గే అన్నట్టు బీజేపీకి చరిత్ర లేదు గాని, మోదీ కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు..

Nancharaiah merugumala senior journalist:ఖర్గే అన్నట్టు బీజేపీకి చరిత్ర లేదు గాని, మోదీ కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు…అటల్‌ జీ కొత్త జీవిత చరిత్ర చదివితే–కాషాయ నేతలు ఎంతటి ‘చరిత్రకారులో’ తెలుస్తుంది! దిల్లీలోని నెహ్రూ మ్యూజియం అండ్‌ మెమోరియల్‌ లైబ్రరీ సొసైటీ అనే ప్రఖ్యాత సర్కారీ సంస్థ పేరును ప్రధానమంత్రి మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ అని మార్చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. 59 ఏళ్లుగా ఉన్న ఈ సంస్థ పేరులోని నెహ్రూ అనే మాటను తొలగించడం సహజంగానే…

Read More
Optimized by Optimole