ఆలస్యమైనా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది: నారా బ్రాహ్మణి

APpolitics: ఆలస్యం అయినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. ప్రజల ప్రేమాభిమానాలు, దేవుడి ఆశీస్సులతో చంద్రబాబు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాజమహేంద్రవరంలోని విద్యానగర్ లో పెద్ద ఎత్తున మహిళలతో కలసి టీడీపీ పిలుపునిచ్చిన *మోత మోగిద్దాం* కార్యక్రమంలో నారా బ్రాహ్మణి పాల్గొన్నారు.చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఢమరుకంతో శబ్ధం వినిపించిన అనంతరం విజిల్ ఊది, డప్పుకొట్టి బ్రాహ్మణి తన…

Read More

వై నాట్ 175 vs వై నాట్ చంద్ర ‘ సేన’ ..

APpolitics:  ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు  దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.’  వై నాట్ 175 ‘ అని అధికార వైసీపీ ప్రభుత్వం అంటుంటే.. పాత పొత్తు మళ్ళీ పొడవడంతో  ‘ ‘ వై నాట్ చంద్రసేన’  అంటూ ప్రతిపక్ష టిడిపి, జనసేన నేతలు అంటున్నారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో  గెలిచాకా ‘వై నాట్‌ కుప్పం?’ అని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మితిమీరిన అతివిశ్వాసంతో పిలుపునిస్తే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో ‘వై నాట్‌ పులివెందుల?’ అని టీడీపీ నేతలు ఉత్తరకుమార…

Read More

‘ మేలుకో తెలుగోడా ‘ యాత్రతో జనంలోకి నారా భువనేశ్వరి..

TDP: ఏపీ రాజకీయం రోజురోజుకీ మారుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో పొలిటికల్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన సతీమణి నారా భువనేశ్వరి.. రాజమండ్రి లోనే ఉంటు పార్టీ నేతలతో కలిసి నిరసన సభల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె బస్సు యాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యాత్రకు సంబంధించి టీడీపీ నేతలు రూట్ మ్యాప్ ను…

Read More

జనసేన ‘ ఎందుకు ఆంధ్రకు జగన్ వద్దంటే ‘ కార్టూన్ వైరల్..

Janasenacartoon: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. అటు అధికార వైఎస్ఆర్సీపీ..ఇటు ప్రతిపక్ష టిడిపి, జనసేన నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలోనే అధికార వైసిపి చేపట్టిన ‘ ఎందుకు ఆంధ్రకు జగనే కావాలి ‘ కార్యక్రమంపై జనసేన పార్టీ కౌంటర్ గా రూపొందించిన కార్టూన్ పై సర్వత్రా చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలోను కార్టూన్ పై జన సేన , టీడీపీ నేతలు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. దీంతో వైసీపీ, ప్రతిపక్ష పార్టీ…

Read More

హైదరాబాద్ ఐటీ రంగం చంద్రబాబుతో మొదలైందనే వాదన వాస్తవం..

Nancharaiah merugumala senior journalist: (ఆర్థిక సంస్కరణలు పీవీతో ఆరంభమయ్యాయనే దాంట్లో ఎంత నిజం ఉందో..హైదరాబాద్ ఐటీ రంగం చంద్రబాబుతో మొదలైందనే వాదనలోనూ అంతే వాస్తవం ఉంది!) ఇండియాలో ఆర్థిక సంస్కరణలు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారితోనే ఆరంభమయ్యాయనే అబద్ధాన్ని దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదలయి, విస్తరించిందనే ప్రచారాన్ని మాత్రం ఆమోదించడానికి కొందరికి అభ్యంతరాలు ఉన్నాయి….

Read More

నిరసనల మాట వింటేనే జగన్ ఉలిక్కి పడుతున్నాడు: నారా లోకేష్

APpolitics: రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై సిఎం జగన్ అణిచివేత వైఖరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. జనం రోడ్డెక్కితే సిఎం జగన్ జడుసుకుంటున్నాడని.. నిరసనల మాట వింటే ఉలిక్కి పడుతున్నాడని ఎద్దేవ చేశారు. ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రశ్నించే గళాలను చూసి భయపడుతోందన్నారు. చంద్రబాబు అరెస్టుపై, తమ హక్కుల కోసం పోరాడుతున్న వివిధ వర్గాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జగన్  పిరికితనాన్ని చాటిచెపుతోందని లోకేష్  స్పష్టం చేశారు. తమ…

Read More

టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారు: నారా భువనేశ్వరి

APpolitics: టీడీపీ అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై నిరసనల్లో పాల్గొన్న మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థమవుతోందని అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న శాంతియుత నిరసనలను సైతం అనుమతించకుండా ప్రభుత్వం…

Read More

అక్టోబర్ 1 వ తేదీ నుంచి నాలుగో విడత వారాహి విజయ యాత్ర..

Janasenavarahivijayayatra4: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  చేపట్టిన ‘వారాహి విజయ యాత్ర’ నాలుగో విడత కార్యక్రమానికి షెడ్యూల్ ఖరారైంది. కృష్ణా జిల్లాలో ఈ యాత్ర కొనసాగనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర మొదలవుతుంది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్  సోమవారం మధ్యాహ్నం ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన,…

Read More

ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ: నారా భువనేశ్వరి

TDP: రాష్ట్రం, ప్రజల కోసం కష్టపడటమే చంద్రబాబు చేసిన తప్పా అని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రశ్నించారు. ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ అని అన్నారు.  ప్రజల సొమ్ముకోసం ఆశపడే కుటుంబం తమది కాదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గంలో మహిళలు, టీడీపీ నేతలు చేపట్టిన నిరసత దీక్షలో సొమవారం భువనేశ్వరి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించిన…

Read More

చంద్రబాబు కష్టాలకు రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చడమే కారణమా?

Nancharaiah merugumala senior journalist:(చంద్రబాబు ప్రస్తుత కష్టాలకు రాజమండ్రి పేరును2..015లో రాజమహేంద్రవరంగా మార్చడమే కారణమా? గోదావరి తీరంలో జ్యోతిష్యులకు పెద్ద అనుమానం!) ============= 2015లో రాజమండ్రి ఇంగ్లిష్ స్పెలింగ్ నుR ajamandri అని సరళతరం చేయాల్సిన నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా దాన్ని సాగదీశారు. దాదాపు 500 సంవత్సరాల నుంచి రాజమహేంద్రి, రాజమండ్రి గా ఈ ఉన్న ఈ నగరం పేరును టీడీపీ అధినేత అనవసరంగా సాగదీసి రాజమహేంద్రవరం అని మార్చారు….

Read More
Optimized by Optimole