Tamilnadu: హిందు ధర్మాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడుదాము: పవన్ కళ్యాణ్

Tamilnadu: ‘సజ్జనుడికి వచ్చే కోపం చాలా భయంకరంగా ఉంటుంది. నీతిగా, నిజాయతీగా జీవితాన్ని కొనసాగించే వారిని అమాయకులుగా భావించి దాడి చేస్తే.. ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ధర్మం కోసం నిలబడే ప్రతి అడగు మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  అన్నారు. దేశంలో అత్యధికులు హిందువులే అయినా వారి ధర్మం గురించి వారు మాట్లాడకూడదు. ఆచారం మంటగలిపినా నోరెత్తకూడదు. నమ్మకం మీద వెక్కిరింతలు చేసినా గొంతు ఎత్తకూడదు….

Read Full News

APpolitics: అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడేవారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలి: పవన్ కళ్యాణ్

APpolitics: సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకూ బాగుంటాయి. వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఎవరైనా చట్టం, నియమనిబంధనలను పాటించాల్సిందే. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదు. కచ్చితంగా అలాంటివారిపై రౌడీ షీట్లు తెరిచి… అసాంఘిక శక్తులను అదుపు చేస్తాము. అశాంతిని, అభద్రతను…

Read Full News

Apnews: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పై ప్రజాభిప్రాయం: పీపుల్స్ పల్స్

Peoplespulse: రాష్ట్ర ఖజానాపై తక్కువ భారంతోనే ఆంధ్రప్రదేశ్ లోని 70 శాతం పైగా కుటుంబాలకు నేరుగా ఆర్థిక లబ్ది చేకూరుస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ (దీపం-2) పథకాన్ని చిన్న చిన్న మార్పులతో మరింత ప్రభావవంతగా అమలు జరుపవచ్చు. ఇప్పుడున్న పద్దతిలోనే నడిపిస్తే… లబ్దిదారులు సంతృప్తి చెందక పోగా పథకం ప్రజాదరణ కోల్పోయి, రాజకీయ లబ్ది కూడా మిగలని ప్రమాద పరిస్థితులు ఉన్నాయి. ప్రజాభిప్రాయం ప్రకారం, ‘జీరో బిల్లింగ్’పద్దతిలో ఉచిత సిలిండర్ అందించడమనే చిన్న సాంకేతిక మార్పు ద్వారా…

Read Full News

APpolitics: వైఎస్ఆర్సీపీ బాటలో కూటమి..!

APpolitics : ఆంధ్ర ప్రదేశ్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలు, ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం తర్వాత బలహీనపడిందని కూటమి నేతలు, కార్యకర్తలు ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీకి చెందిన వారు పగటి కలలు కంటున్నట్టు ఈ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. రాష్ట్రంలో మార్చి 27వ తేదీన (గురువారం) జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ…

Read Full News

Apnews: ధాన్యం కొనుగోళ్లలో చారిత్రాత్మక మైలురాయి చేరాం: నాదెండ్ల మనోహర్

Janasena: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం ఓ చారిత్రాత్మక మైలురాయికి చేరిందన్నారు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేయని విధంగా కూటమి ప్రభుత్వం  రూ. 8,003 కోట్ల మేర ధాన్యం కొనుగోళ్లు చేసి చారిత్రాత్మక మైలురాయిని చేరిందని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలోనూ రైతులను ఏమాత్రం ఇబ్బందిపెట్టకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగించినట్లు పేర్కొన్నారు….

Read Full News

Apnews: ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణుల సంరక్షణను బలోపేతం చేస్తుంది: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Janasena: అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ యొక్క మార్గదర్శక చొరవ అయిన నగరవనంస్ యొక్క అధికారిక లోగోను  ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  ఆవిష్కరించారు, ఇది సహజ అడవులను అనుకరించే పట్టణ హరిత ప్రదేశాలను సృష్టించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ యొక్క మార్గదర్శక చొరవని ఆయన కొనియాడారు. ప్రస్తుతం, రాష్ట్రవ్యాప్తంగా 50 నగరవనంలు స్థాపించబడినట్లు, 2024-25 సంవత్సరానికి మరో 11 మంజూరు చేయబడ్డాయని అన్నారు. మరో 12 అదనపు ప్రతిపాదనలు పరిశీలనలో…

Read Full News

APpolitics: కూటమి ప్రభుత్వంలో ఆటలు, నాటికలు: డిప్యూటీ సీఎంపవన్

NDA: గత అయిదేళ్లలో శాసన సభ్యులంటే బెదిరింపులు, బూతులు అనే ధోరణిని చూశారు… ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి శాసన సభ్యుల్లో ఓ సుహృద్భావ వాతావరణం, సోదరభావం పెంపొందించేందుకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం శుభ సంప్రదాయం’ అని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఐక్యతతో, పోరాట పటిమతో, సమష్టిగా ముందుకు సాగడానికి ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కాగా రెండు రోజులుగా సాగిన క్రీడా పోటీలు, గురువారం సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో…

Read Full News

Peoplespulse: డొక్కా సీతమ్మ పథకం అమలు తీరుపై పీపుల్స్ పల్స్ అధ్యయనం..!

DokkaSeethammascheme: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంపై పీపుల్స్ పల్స్ అధ్యయన సమగ్ర నివేదిక.. ఇంటర్‌ విద్యార్థులకు: జీవితంలో ఎవరి కెరీర్‌ కైనా ఇంటర్మీడియటే టర్నింగ్‌ పాయింట్‌. ఇంటర్‌ లోనే విద్యార్థులు తమ జీవితానికి పునాదులు వేసుకుంటారు. ఇంటర్‌ నుంచి బాగా చదువుకుంటేనే మంచి ఉద్యోగం వస్తుంది. ఉన్నత ఉద్యోగం వస్తే కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని విద్యార్థులకు ప్రతి ఒక్కరూ చెప్తుంటారు. కానీ, పేద విద్యార్థులు చదువుకోవాలంటే, ముందుగా వారి కడుపు నిండాలి. అదికూడా సరైన పోషకాహారం…

Read Full News

janasena: న భూతో న భవిష్యతి అనేలా ఆవిర్భావ సభ: నాదెండ్ల

Janasena: ‘పిఠాపురం జనసేన పార్టీకి ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఇచ్చింది. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభకు కూడా పిఠాపురం వేదిక అయింది. ఈ సందర్భంగా పిఠాపురం ప్రజలకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెప్పుకొందాం.. థాంక్యూ పిఠాపురం’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్  అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని న భూతో అన్న రీతిలో…

Read Full News

ysrcp: వైసీపీలో ఏం జరుగుతోంది..?

APpolitics: ‘‘వైసీపీలో ఏం జరుగుతోంది?’’ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య, రాజీనామ తర్వాత ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేశారు. ముందు ముగ్గురు రాజీనామాల్లో అంత ప్రత్యేకత ఏమీ లేకపోయినా స్వయం ప్రకటిత జగన్ ఆత్మ అయిన విజయసాయిరెడ్డి రాజీనామ ప్రత్యేకమైనది. జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేసిన ఆయన, జగన్ కష్టకాలంలో…

Read Full News
Optimized by Optimole