జగన్ రెడ్డి చేసిన మోసాలపై బీసీ సోదరులు ఆలోచన చేయాలి: నాదెండ్ల మనోహర్
బీసీలను 56 సంఘాలుగా విడదీసి వైసీపీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన కార్పోరేషన్లు కేవలం స్టిక్కర్లు వేసుకుని టోల్ గేట్ల వద్ద గొడవలుపడడానికి మాత్రమే ఉపయోగపడ్డాయని ఎద్దేవ చేశారు. సీఎం జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేసిన మోసంపై ప్రతి బీసీ సోదరుడు ఆలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కుల గణన, తదితర అంశాలపై సలహాలు సూచనలు ఇవ్వాలని బీసీ సంఘాల…
