Telangana: జర్నలిస్ట్ వుప్పల నరసింహం మృతి..!

VuppalaNarasimha: సాహిత్య ప్రేమికులు జీర్ణించుకోలేని వార్త.  ప్రముఖరచయిత,సీనియర్ జర్నలిస్ట్ వుప్పల నరసింహం గురువారం  అనారోగ్యంతో మృతి చెందారు. ఆంధ్రప్రభ దినపత్రికలో సంపాదకులుగా పనిచేశారు. అంతేకాక సాహిత్య రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన మృతితో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు,శ్రేయోభిషలు శోక సంద్రంలో మునిగిపోయారు. వుప్పల నరసింహం సబండవర్ణాల వారసత్వం,వాదం, మట్టి మనిషి ఉప్పల నరసింహం కథలు,నిజం, మావోయిస్టుల రక్త చరిత్ర, అద్దంలో బౌద్ధం, హళ్ళికి హళ్ళి,రాగం, భావం, క్లేశవుడు,ఊసరవెల్లి,జంగల్ నామాపై జనం ప్రజా ప్రశ్న,ఈ…

Read Full News

KCR: కేసీఆర్ వ్యూహంతో ఫలితం దక్కేనా?

Telangana politics: రాష్ట్రంలో రాజకీయాలు….. శీతాకాలపు చలిని మరిపించేంత వేడి పుట్టిస్తున్నా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మౌనమే పాటిస్తున్నారు. అప్పుడప్పుడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో అంతర్గతంగా మాట్లాడుతున్న అంశాల సారాంశం మాత్రం బయటకు వస్తోంది. ఇటీవలే… పాలకుర్తి నియోజకవర్గం వారితో మాట్లాడి, పంపిందీ అటువంటి సందేశమే! చాన్నాళ్లుగా ఆయన పాటిస్తున్న మౌనం వెనుక ఏముంది! అది వ్యూహాత్మక ఎత్తుగడా? రాజకీయ వైరాగ్యమా? జనం మెదళ్లను ఈ ప్రశ్న తొలుస్తోంది. ఇదుగో ఇప్పుడొస్తారు, అదుగో అప్పుడొస్తారు,…

Read Full News

Telangana: అయోధ్య, అలీగఢ్‌ కన్నా ఎక్కువ ‘సెన్సిటివ్‌’ అని నిరూపించిన ‘ కొడంగల్ ‘ గ్రామం లగచర్ల..!

Nancharaiah merugumala senior journalist: భోగమోని సురేశ్‌ అనే యువకుడికి ఎక్కడ లేని విస్తృత ప్రచారం!కలెక్టర్‌ కారద్దాలు పగిలితే కరంటు ఆగింది, ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి! ఉత్తరాది, మణిపూర్‌తో పోల్చితే..తెలంగాణ సర్కారు ‘హైపర్‌ సెన్సిటివ్‌’ అయింది. తెలంగాణ రాష్ట్రం–వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్, రెవెన్యూ అధికారులపై స్థానిక ఊళ్ల జనం జరిపిన దాడిలో ఒక్కరూ కన్నుమూయ లేదు. ఎవరి తలా పగల్లేదు. ఏ ఒక్కరి కాలూ విరగ…

Read Full News

KTRcomments: రేవంత్, పొంగులేటి ప‌ద‌వులు ఊడ‌టం ఖాయం: కేటీఆర్‌

KTRVSREVANTH: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌నీ లాండ‌రింగ్ కు పాల్ప‌డిన చాలా మంది ప‌ద‌వులు కోల్పోయార‌ని ..త్వ‌ర‌లోనే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప‌ద‌వులు ఊడ‌టం ఖాయ‌మ‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. ఈసంద‌ర్భంగా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చార సమ‌యంలో రాష్ట్రానికి వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మారింద‌ని చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తుచేశారు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌క‌మైన అమృత్ టెండ‌ర్ల‌లో ఇంత పెద్ద అవినీతి జ‌రుగుతున్నా.. ప్ర‌ధాని…

Read Full News

Tribute: ఆమె జ్యోతక్క.. అది కాంగ్రెస్..!

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ఆమె జ్యోతక్క.. అది కాంగ్రెస్.. ఇదే అసెంబ్లీ భవనం. రెండో నెంబర్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించగానే, కుడివైపు మూలన మెట్లు, ప్రత్యేక ద్వారంతో రెండు గదులు (ఓటి పెద్దది హాలు లాగా, మరోటి చిన్నది చాంబర్ లాగా) అప్పట్లో కాంగ్రెస్ శాసనసభా పక్షానికి (CLP) ఆఫీస్ గా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ సంఖ్య 26 మంది శాసనసభ్యులకు కాంగ్రెస్ పార్టీ పరిమితమైన…

Read Full News

Bandisanjay: మహారాష్ట్రలో రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలే: బండి సంజయ్

Bandisanjay: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీల అమలు, రుణమాఫీ, 6 గ్యారంటీలపై తెలంగాణలో ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. నక్సలైట్ల భావజాలమున్న వాళ్లకు విద్యా కమిషన్ లో చోటు కల్పించి సభ్య సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారని నిలదీశారు. ఆనాడు నక్సలైట్లను కాంగ్రెస్ నాయకులను…

Read Full News

Musirevival: మూసీ పునరుజ్జీవనంతో బాధెవరికి? మేలెవరికి?

Musi riverfront: నదుల వెంట నాగరికత విలసిల్లిందని మానవ వికాస చరిత్ర చెబుతోంది. నగరాలు నరకకూపాలై నదులను విషతుల్యం చేయడం మన కళ్లముందరి ఆధునిక వాస్తవం. పరిశ్రమల విషరసాయనాలు, మానవ వ్యర్థాలు, ఇతర మురుగుతో కాలుష్యమైన మూసీ దేశంలోనే అత్యంత విషపూరితమైన నదిగా, ప్రపంచంలోని పాతిక అతి కాలుష్య నదుల్లో ఒకటిగా రికార్డులకెక్కింది. రాజధాని హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే ఈ ప్రకృతి జల సంపదను దశాబ్దాల నిర్లక్ష్యంతో నాశనం చేసుకున్న హీనచరిత్ర మనది. దిగువ గ్రామీణ…

Read Full News

Karimnagar: వినోద్ కుమార్ నీ దుకాణం బంద్: బీజేపీ కన్వీనర్ ప్రవీణ్ రావు

BJPKarimnagar:  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. స్వయం ప్రకటిత మేధావి గొప్పలు చెప్పుకోవడం తప్ప సాధించిందేమీలేదని.. కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు రెండు ఎన్నికల్లో ఘోరంగా ఓడించినప్పటికీ వినోద్ కుమార్ బుద్ది మారలేదని మండిపడ్డారు. జనం మెచ్చిన నాయకుడి పై విషం కక్కుతూనే ఉన్నారని.. బండి…

Read Full News

BJPtelangana: తెలంగాణ బీజేపీకి వైరస్..!

BJPTELANGANA: తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఏదో వైరస్ సోకినట్టుంది. పాతాకొత్తనీటి కలయిక కుదురుకోవటం లేదు. పార్టీ మూలవాసులకు, వలసనేతలకు మధ్య సయోధ్యకు బదులు సంకులసమరమే సాగుతోంది. స్వార్థం, అలసత్వం, ముఠాతత్వం…. అంతటా ముప్పిరిగొంటున్నాయి. వ్యాధి సంస్థాగత ఎన్నికలకూ పాకి, ప్రక్రియ ఓ ప్రహసనంగా మారుతోంది. ముఠాతత్వం తారాస్థాయి చేరి, గ్రూప్ రాజకీయాలు ఊపందున్నాయి. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులున్నా…. ప్రజాక్షేత్రంలో పార్టీ రోజురోజుకు వన్నె తగ్గుతోందే తప్ప పుంజుకోవటం లేదు. బీజేపీ సంస్థాగత ప్రగతి ‘ఒకడుగు…

Read Full News

BJPDHARNA: బీజేపీ మహాధర్నాను విజయవంతం చేయండి : కేంద్ర‌మంత్రి బండిసంజ‌య్

Bandisanjay:   ‘‘మూసీ పునరుజ్జీవం’’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న‌ట్లు కేంద్ర‌హొంశాఖ స‌హాయ‌మంత్రి బండిసంజ‌య్ కుమార్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈమేర‌కు మూసీ బాధితుల ప‌క్షాన శుక్ర‌వారం(ఈనెల‌25న‌)ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్ట‌బోయే మహాధర్నాను విజయవంతం చేయాలని కేంద్ర‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ పథకం పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీస్తోంద‌న్నారు. లక్షా 50 వేల కోట్ల వ్యయంతో చేపడుతున్న…

Read Full News
Optimized by Optimole