తెలంగాణలో బీజేపీ నేతల దూకుడు.. పార్టీలోకి భారీగా చేరికలు?
తెలంగాణలో బీజేపీ నేతలు దూకుడుమీదున్నారు. అధికార పార్టీ పై మాటల తూటాలు పేలుస్తునే.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. ప్రజాగోస భరోసా కార్యక్రమం పేరిట ప్రజాసమస్యలను తెలుసుకుంటూ.. అధికార టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మరోవైపు కమలం పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది.ఇప్పటికే హస్తం పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుండగా.. అతనితో పాటు మరికొంతమంది కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు అదే దారిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి చేరికలపై ఆపార్టీ అధ్యక్షుడు…
