ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ రాజీనామా..?
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేయనున్నారా? అంటే అవుననే సమాధానం విశ్వసనీయవ వర్గాల సమాచారం! ఈ మేరకే ఆయన రాష్ట్ర గవర్నమెంట్ కోరినట్లు తెలిసింది! ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన తర్వాత గవర్నర్ను కలిసేందుకు సిద్ధమవడం వల్ల.. ఆయన తన రాజీనామాను సమర్పించేందుకే కలువబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి….
vaikuntaekadashi: వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత..!
Vaikunta ekadashi: హిందువుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారం లేక సౌరమాన ప్రకారం జరుపుకుంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏకాదశి గురించి మరి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.. భవిశ్యోత్తర పురాణం: వ్యాస మహర్షి రచించిన భవిష్యోత్తర పురాణం ప్రకారం మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే…
విద్యార్ధుల అస్వస్థతపై బండి సంజయ్ కీలక ప్రకటన…
వరంగల్ విద్యార్ధుల అస్వస్థతపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. తక్షణమే వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలకు సరైన చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులను అవసరమైతే హైదరాబాద్ తరలించి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఈ రెండు నెలల్లో .. గురుకులాల్లో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించడం లో కేసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మండి పడ్డారు. కాగా బల్లి పడ్డ ఆహారం…
దేశంలో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..
దేశంలో బంగారం ధరలు పలుచోట్ల పెరిగినప్పటికీ హైదరాబాద్లో స్వల్పంగా తగ్గాయి. మొత్తంగా చూసుకుంటే గత నాలుగు రోజులుగా దేశంలో బంగారం రేటు పెరిగిందనే చెప్పాలి. ఇక బుధవారం బంగారం ధరలను గమనిస్తే, 22 క్యారట్ బంగారం ధర పది గ్రాములకు 47 వేల 270 రూపాయలుగా ఉంది. 24 క్యారట్ బంగారం పది గ్రాములు 48 వేల 270. ఇక దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం ధరలు గమనిస్తే, చెన్నైలో 22 క్యారెట్ 45 వేల 380…
Apnews: కూటమి ప్రభుత్వములోనే రైతులకు న్యాయం: మంత్రి నాదెండ్ల
విజయవాడ, నవంబర్ 5: కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతోనే రైతుకు న్యాయం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.బుధవారం విజయవాడ సివిల్ సప్లై భవన్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఈసారి ఖరీఫ్ మాసానికి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధం అయ్యామని మంత్రి నాదెండ్ల తెలిపారు. అంటే రూ.12,200 కోట్లు విలువైన ధాన్యం కొనుగోలుకు సిద్ధం అయినట్లు చెప్పారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు 4041…
LawrenceBishnoi: బిష్ణోయీ..దావూద్ సహా పాత గ్యాంగ్స్టర్లంతా చదువులేనోళ్లు.!
Nancharaiah merugumala senior journalist: బాగా తెల్లగా, ఎర్రగాబుర్రగా ఉన్నాడని బిష్ణోయీ కుర్రాడికి బ్రిటిష్ ఉన్నతాధికారి హెన్రీ లారెన్స్ పేరు! బాలీవుడ్ ‘కండలవీరుడు’, ముస్లిం తండ్రికి, హిందూ తల్లికి పుట్టిన అత్యంత లౌకిక పౌరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు ముంబై నగరం బాంద్రాలో నివసించే డీలక్స్ అపార్ట్మెంట్ వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. విజిటర్లు ఎవరినీ ‘టైగర్ జిందా హై’ హీరో తన నివాసంలోకి అనుమతించడం లేదు. ఇవి ఇప్పుడు ఇంగ్లిష్ న్యూజ్ చానల్స్లో పదే…
ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్!
ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్. కరోనాతో అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ ను తిరిగి నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ రెడీ చేస్తోంది. మిగతా మ్యాచ్ ల్ని సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ సీజన్లో ఇంకా 31 మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో మిగిలిన మ్యాచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. 21 రోజుల షెడ్యూల్తో ఆ తర్వాత జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్కు సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది. సెప్టెంబర్…
రేవంత్ రెడ్డి ‘సొంత లాభం ఎంత చూసుకున్నా’ 4 కోట్ల తెలంగాణ జనం పట్టించుకోరట!
Nancharaiah merugumala senior journalist: (కాంగ్రెస్ అనుకూల పరిస్థితుల్లో పార్టీ టికెట్ల పంపిణీలో రేవంత్ రెడ్డి ‘సొంత లాభం ఎంత చూసుకున్నా’ 4 కోట్ల తెలంగాణ జనం పట్టించుకోరట) ================== హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని సనత్ నగర్ అసెంబ్లీ స్థానంలో బీఆరెస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద కోస్తాంధ్ర మూలాలున్న బ్రాహ్మణ మహిళ డాక్టర్ కోట నీలిమ వంటి అనామక అభ్యర్థిని నిలబెట్టినా, మేడ్చల్ లో మరో మంత్రి చామకూర మల్లారెడ్డిపై తోటకూర వజ్రేష్ యాదవ్…
హైదరాబాద్ ఐటీ రంగం చంద్రబాబుతో మొదలైందనే వాదన వాస్తవం..
Nancharaiah merugumala senior journalist: (ఆర్థిక సంస్కరణలు పీవీతో ఆరంభమయ్యాయనే దాంట్లో ఎంత నిజం ఉందో..హైదరాబాద్ ఐటీ రంగం చంద్రబాబుతో మొదలైందనే వాదనలోనూ అంతే వాస్తవం ఉంది!) ఇండియాలో ఆర్థిక సంస్కరణలు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారితోనే ఆరంభమయ్యాయనే అబద్ధాన్ని దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదలయి, విస్తరించిందనే ప్రచారాన్ని మాత్రం ఆమోదించడానికి కొందరికి అభ్యంతరాలు ఉన్నాయి….
