APpolitics: కూటమి ప్రభుత్వంలో ఆటలు, నాటికలు: డిప్యూటీ సీఎంపవన్

NDA: గత అయిదేళ్లలో శాసన సభ్యులంటే బెదిరింపులు, బూతులు అనే ధోరణిని చూశారు… ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి శాసన సభ్యుల్లో ఓ సుహృద్భావ వాతావరణం, సోదరభావం పెంపొందించేందుకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం శుభ సంప్రదాయం’ అని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఐక్యతతో, పోరాట పటిమతో, సమష్టిగా ముందుకు సాగడానికి ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కాగా రెండు రోజులుగా సాగిన క్రీడా పోటీలు, గురువారం సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో…

Read More

కర్ణాటకలో కాంగ్రెస్‌దే పైచేయి.. పీపుల్స్‌ప‌ల్స్ ఎగ్జిజ్‌పోల్‌ రిపోర్ట్‌…

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే ఆధిపత్యం అని పీపుల్స్‌ పల్స్‌ సంస్థ సౌత్‌ ఫస్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో వెల్లడయింది. హోరాహోరీ పోరులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ మెజార్టీ స్థానాలను  గెలుపొంది మెజార్టీ సాధించే అవకాశాలున్నాయి. బీజేపీ 100  స్థానాలలోపే పరిమితం కావచ్చు. ఇదే సమయంలో జేడీ(ఎస్‌) తనకు పట్టున్న స్థానాల్లో అధిప‌త్యం కొన‌సాగిస్తుంద‌ని.. ఇత‌రులు 1 నుంచి3 స్థానాల్లో  గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు…

Read More

తాండూర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పట్లోళ్ల రఘువీర్ రెడ్డి?

Vikarabad: తాండూర్ కాంగ్రెస్ అభ్యర్థిత్వం పై క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఆయా నియోజక వర్గాల అభ్యర్ధుల ఎంపిక పై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.  సర్వేల ఆధారంగా  ఇప్పటికే కొడంగల్, వికారాబాద్, పరిగి నియోజక వర్గాల అభ్యర్థులను హస్తం పార్టీ  దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాండూరు అభ్యర్దిని సైతం ఎంపిక చేసినట్లు నియోజక వర్గంలో చర్చ జరుగుతోంది. రేవంత్ శిష్యుడిగా పేరొందిన…

Read More

‘వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్’… జనసేన లక్ష్యం: నాదెండ్ల మనోహర్

Janasena: ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిపరంగా దూరం చేసి, అన్ని రకాలుగా వెనక్కు తీసుకువెళ్లిన వైసీపీ ప్రభుత్వ పాలన నుంచి ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రాన్ని విముక్తం చేయడానికి జనసేన పార్టీ కట్టుబడి ఉందన్నారు ఆపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. దీని కోసం కచ్చితంగా వైసీపీ వ్యతిరేక పక్షాలన్నీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి అన్నదే జనసేన అభిమతమన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ విధానాలపై చర్చించేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ , తెలుగుదేశం పార్టీ…

Read More

Hyderabad: ఆషాఢ బోనాల ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు : టీపిసిసి చీఫ్

హైదరాబాద్: రాష్ట్రంలో ఆషాఢ మాసంతో పాటు బోనాల ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.భక్తి, శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖంగా, శాంతిగా, ఆయురోగ్యంతో జీవించాలన్నారు. ఇక తల్లి దీవెనలతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు….

Read More

Ambedkar: అంబేడ్కర్‌ ఎంతటి గొప్ప నాయకుడో మండల్‌ వ్యతిరేక ఉద్యమం వల్లే బీసీలకు తెలిసింది!

Nancharaiah merugumala senior journalist: ‘గాంధీ’ సినిమాతో మోహన్‌ దాస్‌ గాంధీకి ‘అంతర్జాతీయ గుర్తింపు’ వచ్చిన మాట ఎంత వరకు నిజమోగాని–బాబాసాహబ్‌ అంబేడ్కర్‌ ఎంతటి గొప్ప నాయకుడో మండల్‌ వ్యతిరేక ఉద్యమం వల్లే బీసీలకు తెలిసింది! ప్రధాని నరేంద్రమోదీ ఏబీపీ న్యూస్‌ చానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్టు –మహాత్మా మోహన్‌ దాస్‌ గాంధీకి ‘ప్రపంచవ్యాప్త గుర్తింపు’ 1982లో ‘గాంధీ’ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన మాట ఎంత వరకు నిజమో గాంధీ ఇంటి పేరున్న రాహుల్‌…

Read More

కాంగ్రెస్ లో ముసలం.. రేవంత్ , ఠాగూర్ వైఖరిపై నేతలు గుస్సా!

  తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి అధికారంలోకి రావాలని ప్రధాన పార్టీలు వ్యూహాలతో ముందుకెళ్తుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఏకంగా ఆపార్టీ వ్యవహరాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేయడం.. ఇది చాలదన్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధిష్టానానికి లేఖరాశారంటూ వార్తలు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక…

Read More

భారత టెస్టు కెప్టెన్గా రోహిత్ శర్మ..?

భారత జట్టు టెస్ట్ సారథిగా రోహిత్ శర్మను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వన్డే, టీ20 కెప్టెన్​గా ఉన్న అతనిని.. బీసీసీఐ పూర్తిస్థాయి టెస్టు సారథిగా ఖరారు చేసిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. కాగా శ్రీలంక తో జరిగే టెస్ట్ సిరీస్ కి ముందే సెలెక్షన్ కమిటీ రోహిత్ పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక తో భారత జట్టు 2 టెస్టులు, 3టీ_20లు ఆడనుంది….

Read More
Optimized by Optimole