Tollywood:“హరిహరవీర మల్లు గుడిసె కాదు.. పవన్ కంచుకోట!”

Hariharaviramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా “హరిహరవీర మల్లు” పై దర్శకుడు జ్యోతి కృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా ట్రైలర్ ఈవెంట్‌లో ఆయన, ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. ముఖ్యంగా, సినిమా మీద మొదటినుంచే నెగటివ్ ప్రచారం జరగడంతో, అందుకు ఆయన..“హరిహరవీర మల్లు గుడిసె కాదు.. పవన్ కళ్యాణ్ కంచుకోట!” అంటూ చేసిన ఇండైరెక్ట్ వార్నింగ్‌…

Read More

శాంతమ్మకు సలాం.. 94 ఏళ్ల వయసులోనూ బోధన..!!

ఆమె వయస్సు 94 ఏళ్లు. అయితేనేం తనకున్న మక్కువతో రోజూ 140 కిలోమీటర్లు ప్రయాణించి విద్యార్థులకు పాఠాలను బోధిస్తుంది. ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె..ఈవయసులోనూ రెండు పుస్తకాలను రాస్తున్నారు. సొంత ఇంటిని మెడికల్ ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చి అద్దె ఇంటిలో ఉంటున్న ఆమె వ్యక్తిత్వానికి చేతులెత్తి మొక్కాలి. కాలం విలువైనదని.. క్షణం వృథాచేయకుడదని చెబుతున్న ప్రోఫెసర్ చిలుకూరి శాంతమ్మ జీవన ప్రయాణం గురించి తెలుసుకుందాం. ప్రోఫెసర్ శాంతమ్మ స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం.1929…

Read More

మహిళా లబ్ధిదారులకు నగదు అందజేసిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ..

మెదక్: పెద్ద శంకరంపేట మండలం కమలాపూర్ గ్రామపంచాయతీలో మహిళా లబ్ధి దారులకు ఎమ్మెల్యే నగదు పురస్కారం అందజేశారు. గతంలో ప్రకటించిన విధంగా గ్రామంలో ఆడపిల్లలు కలిగిన 26 మంది మహిళలకు..అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఒక్కొకరికి 2 వేల 116 రూపాయలు చొప్పున 26 మంది లబ్ధిదారులకు నగదును అందజేశారు. సర్పంచ్ కుంట్ల రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి జయశ్రీ భూపాల్ రెడ్డి, శంకరంపేట ఎంపీపీ శ్రీనివాస్ జెడ్పిటిసి విజయరామరాజు టిఆర్ఎస్ పార్టీ…

Read More

జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని జనసేన కీలక నిర్ణయం..

జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘ కౌలు రైతు భరోసా ‘ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని.. అన్ని గ్రామాల ప్రజలకు  తెలిపే విధంగా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు  రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుల కొణిదెల నాగబాబు ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యా చేసుకున్న 3 వేల రైతు కుటుంబాలకు పవన్ ఆర్థిక సహాయం అందజేసి భరోసా కల్పించారు….

Read More

కేసిఆర్ సీఎం పదవికి రాజీనామ చేయాలి: తరుణ్ చుగ్

ఎట్టకేలకు దిల్లీ లిక్కర్ స్కాంలో గుట్టు రట్టయిందన్నారు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్  కుమార్తె కవిత ప్రమేయాన్ని నిర్ధారించడంతో బిజెపి ఆరోపణలు నిజమని రుజువైందన్నారు. సౌత్‌ గ్రూప్‌లో భాగంగా ఆప్ దళారుకు..కవితలు రూ.100 కోట్లకు పైగా లంచం ఎలా అందజేసింది.. ఈ డీల్ ద్వారా ఈ గ్రూప్‌కి రూ.192 కోట్లకు పైగా…

Read More

Telangana: పార్టీ ఫిరాయింపులపై ప్లేటు ఫిరాయిస్తున్న కాంగ్రెస్‌..!

Telangana politics: ప్రజలు ఒక పార్టీని గద్దె దించారంటే అది చేసిన అనేక తప్పిదాలు కారణాలవుతాయి. వారి స్థానంలో అధికారం చేపట్టిన పార్టీ ఆ పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకొని వాటిని పునరావృతం చేయకుండా పాలిస్తే ప్రజాదరణ పొందుతారు. అలాకాక వారికంటే మేము నాలుగు ఆకులు ఎక్కువే తిన్నామంటూ ప్రత్యర్థులు నడచిన ప్రజావ్యతిరేక అడుగుజాడల్లోనే నడుస్తామంటే వీరిపై కూడా ప్రజాభిప్రాయం మారడం ఖాయం. పదేళ్ల కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజలు రేవంత్‌ సర్కారును అందలమెక్కిస్తే, కాంగ్రెస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ విడిచిన చెప్పులనే వేసుకుంటూ, వారి బాటలోనే నడుస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌కు ఓటర్లు రెండు సార్లు స్పష్టమైన మోజార్టీతో అధికారం అప్పగించినా విపక్షమే లేకుండా అంతా తానై పాలించాలనే ఆలోచనలతో ఆయన ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయాలని చూశారు. 2014లో 63 సీట్లతో బీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజలు 2018లో మరో 25 స్థానాల్లో అదనంగా గెలిపించి 88 సీట్లు కట్టబెట్టినా కేసీఆర్‌ సంతృప్తి చెందకుండా, ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్ధేశంతో వంద స్థానాల మార్కు దాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ప్రజాతీర్పుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునే కుట్రకు కేసీఆర్‌ తెరదీశారు. ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి తమ పార్టీ తరఫున గెలిపించుకొని ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని నిరూపించుకుంటే ఎలాంటి వివాదాలుండేవి కావు. కేసీఆర్‌ ఇందుకు భిన్నంగా చట్టంలోని లొసుగులను అనుకూలంగా మల్చుకొని 2018 తరువాత గంపగుత్తగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. పాలక పార్టీలో చేరితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చనే నెపంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అధికారాన్ని అనుభవించారు. కొందరికి మంత్రి హోదా కూడా దక్కింది   బీఆర్‌ఎస్‌ చేసిన ప్రజావ్యతిరేక కార్యకలాపాలను లెక్కపెట్టుకున్న ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తూ ఆ పార్టీని ఓడిరచారు. ఆ అనుభవాలతో జాగ్రత్త పడాల్సిన రేవంత్‌ సర్కారు అందుకు భిన్నంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ కలిగున్న రేవంత్‌ సర్కారు అవసరం లేకపోయినా లోగడ తమను ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌పై కక్ష తీసుకోవాలనే ఏకైక లక్ష్యంతో సాగుతోంది.  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్‌ మరింత మంది ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు ఆ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీనాన్ని సంపూర్ణం చేయాలని కాంగ్రెస్‌ అడుగులేస్తోంది. అధికారంలో ఉండి ఏమి చేసినా చెల్లుబాటయినా, ప్రజా కోర్టులో మాత్రం శిక్ష తప్పదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన 14 మంది ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌ తిరిగి టికెట్లిస్తే వారిలో మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్‌లో సుధీర్‌ రెడ్డి మాత్రమే గెలవగా మిగతా 12 మంది ఓడిపోయారు. అధికార దాహంతో ఫిరాయించే ఎమ్మెల్యేలతో పార్టీలో గ్రూపు రాజకీయాలకు నాందిపలికినట్టేనని గతనుభవాలే నిరూపిస్తున్నాయి. లోగడ కాంగ్రెస్‌ నుండి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో సదరు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కేసీఆర్‌ సర్కారు పుట్టిముంచాయి….

Read More

బీహార్ ప్రభుత్వ కీలక నిర్ణయం

పట్నా: ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల పరువుకు భంగంకలిగించే తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే సైబర్ క్రైమ్ నేరాల కింద చర్యలు తీసుకోనున్నట్లు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవడం బీహార్ లో చాలా అరుదు. అయితే ఈ తరహా ప్రచారం మరీ శృతిమించుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్ లో సర్క్యులేట్…

Read More

Telangana:తెలంగాణ ఎమ్మెల్యేల ప‌నితీరుపై పీపుల్స్ ప‌ల్స్, సౌత్ ఫ‌స్ట్ షాకింగ్ రిపోర్టు..!

Telangana: తెలంగాణలో 15 నెలల ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ వెబ్సైట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సర్వేలో బీఆర్ఎస్కు చెందిన సిద్దిపేట శాసనభ్యులు, మాజీ మంత్రి టి.హరీశ్రావు మొదటి స్థానంలో ఉండగా, బీఆర్ఎస్కు చెందిన సంగారెడ్డి శాసనభ్యులు చింతా ప్రభాకర్ చివరి స్థానంలో నిలిచినట్లు తేలింది. పీపుల్స్ పల్స్ సంస్థ-సౌత్ ఫస్ట్ వెబ్సైట్ 28 మార్చి నుండి 3 ఏప్రిల్ వరకు 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించింది….

Read More
Optimized by Optimole