‘‘బీసీ బంధు’’ పథకం వెంటనే ప్రారంభించాలని కోరుతూ కేసీఆర్ కు భ‌ట్టి లేఖ‌..

BhattivsKCR: ‘‘బీసీ బంధు’’ పథకం వెంటనే ప్రారంభించాలని కోరుతూ సీఎల్పీ నేత మ‌ల్లుభ‌ట్టి విక్ర‌మార్క సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర సంవత్సరాలు కావొస్తున్నా బడుగుబలహీనవర్గాల జీవితాల్లో ఎటువంటి మార్పురాలేదని పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో అనేక గ్రామాల్లో పర్యటించినప్పుడు కళ్లకు కట్టినట్లు కనబడుతోందని భ‌ట్టి లేఖ‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలు, బహుజనులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో…

Read More

అగ్రవర్ణ పేదల కల నెరవేరబోతుంది!

రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రిజర్వేషన్ల కల ఎట్టకేలకు నెరవేరబోతుంది. రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్ల( ఈ డబ్ల్యుఎస్) ఫలాలను తెలంగాణలో అమలుచేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో ప్రకటించారు. ఈ విషయానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి రిజర్వేషన్లపై ఆదేశాలు జారిచేయనున్నట్లు తెలిపారు. ఇవి అమలులోకి వస్తే రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం 60కి చేరుతుంది. అర్హులు ఎవరు..? ౼ అగ్రవర్ణ…

Read More

నిరుపేద విద్యార్థుల కోసం గురుకులాలను ప్రారంభించారు: డీఎస్పీ నాగభూషణం

సూర్యాపేట జిల్లా బాలెంల గురుకుల పాఠశాలలో స్వచ్ఛ గురుకుల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిఎస్పి నాగభూషణం  హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థినులు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల కోసం గురుకులాలను  ప్రారంభించిందని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ శైలజ మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులకు గురుకులాలు చక్కటి అవకాశమని అన్నారు.  విద్యార్థినులకు అర్థమయ్యేలా…

Read More

గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పేరు ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’

కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు.నూతన పార్టీకి ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’ నామకరణం చేశారు. నీలం, తెలుపు, ఆవరంగులతో కూడిన పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, స్వతంత్రంగా ఉండేలా పేరును ఖరారు చేసినట్లు ఆజాద్ వ్యాఖ్యానించారు.దాదాపు 1500 పేర్లు సూచనకు వచ్చాయని.. అందరీ అభిప్రాయాలకు పరిగణలోకి తీసుకుని పార్టీ పేరును ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఆవ రంగు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకని.. శ్వేతవర్ణం శాంతికి.. నీలం…

Read More

మూసీకి పెరుగుతున్న వరద ఉధృతి..ఆరు గేట్లు ఎత్తివేత!

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 44 వేల ఎకరాలకు సాగునీరు అందించే మూసీ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు వరద తాకిడి పెరగడంతో జలకళ సంతరించుకుంది. వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగుల కాగా.. ప్రస్తుతం 638.30 అడుగులకు నీరు చేరింది. ఇన్ ఫ్లో 3800 క్యూసెక్కులు.. జౌట్ ఫ్లో 3200 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం గేట్లు తెరిచారన్న…

Read More

నీతా అంబానీ గొప్ప స్ఫూర్తి..!!

ఆర్. దిలీప్ రెడ్డి (  విశ్లేషకులు): డబ్బున్న వాళ్లంతా గొప్ప పనులు చేస్తారని చెప్పలేం. కానీ, నీతా అంబానీ 36 స్వచ్చంద సంస్థల సహకారంతో 19 వేల మంది బాలికలను ప్రత్యేక నీలి జెర్సీల్లో ముంబాయి లోని వాంకడే స్టేడియంకి రప్పించారు. అందులో 200 మంది వైవిధ్య సామర్థ్యాల దివ్యాంగులున్నారు. వారిలో దాదాపు అందరు, లేదా అత్యధికులు తొలిసారి స్టేడియంకి వచ్చి క్రికెట్ లైవ్ చూస్తున్నవాళ్లే !  స్టేడియం ఓ నాలుగ్గంటల పాటు నిజంగా ‘నీలి సంద్రమే’…

Read More

Ilayaraja: ఇళయరాజా పాటల మీద హక్కు ఎవరిది?

సాయి వంశీ ( విశీ) : తన అనుమతి లేకుండా స్టేజీలపై తన పాటలు పాడకూడదంటూ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ చరణ్, చిత్రలకు సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు పంపిన కొన్ని రోజుల తర్వాత ఓ తమిళ టీవీ ఛానెల్ ఓ నిర్మాతను ఇంటర్వ్యూ చేసింది. ఆయన పేరు గుర్తు లేదు. ఆయన తీసిన నాలుగు సినిమాలకు ఇళయరాజా సంగీతం అందించారని చెప్పారు. అందులో ‘నాయగన్’ ఒకటి. ఈ నోటీసుల విషయం గురించి ఎదురుగా ఉన్న…

Read More

టెస్టులకు డూప్లెసిస్ రిటైర్మెంట్!

సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు,మాజీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసీస్ టెస్ట్ క్రికెట్ కు బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్ కు ప్రాధాన్యత ఇస్తానని అతను తెలిపారు. 36 ఏళ్ల డూప్లెసిస్ దక్షిణాఫ్రికా తరపున 69 టెస్టుల్లో 40.032 సగటుతో 4163 పరుగులు చేశాడు. అందులో 10 శతకాలు, 21 అర్ధ శతకాలు ఉన్నాయి. అతడు కెప్టెన్గా  36 టెస్టులకు నాయకత్వం వహించాడు. అతని సారథ్యంల జట్టు 18 విజయాల్ని నమోదు చేసింది. ఇప్పటివరకు అతను…

Read More

కిషన్ రెడ్డికి ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్‌షిప్ అవార్డు’

BJPTelangana:కేంద్ర  పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ  మంత్రి  కిషన్ రెడ్డిని ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్‌షిప్ అవార్డు’ వరించింది. భారత్-అమెరికాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్-టు-పీపుల్ ఎక్స్‌చేంజ్ కార్యక్రమాలు నిర్వహించే.. ‘యూఎస్ ఇండియా SME కౌన్సిల్’ సంస్థ ఈ అవార్డును కేంద్రమంత్రికి అందజేసింది.భారతదేశపు ఘనమైన సంస్కృతిని ప్రోత్సహించడంతోపాటు  పర్యాటకాభివృద్ధికి కేంద్రమంత్రి  చేసిన కృషికి గానూ.. అమెరికాలోని మేరీలాండ్ స్టేట్ నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు ఈ అవార్డును కేంద్రమంత్రికి శనివారం రాత్రి (భారత…

Read More
Optimized by Optimole