Headlines

టి-20 వరల్డ్ కప్ వేదికలు ఖరారు!

స్వదేశంలో జరగబోయే టీ-20 వరల్డ్ కప్ వేదికలను బీసీసీఐ శనివారం ఖరారు చేసింది. ఫైనల్ తో సహా మిగతా మ్యాచ్ లను 8 వేదికల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌క‌తా, బెంగుళూరు, హైద‌రాబాద్, ధ‌ర్మ‌శాల న‌గ‌రాల్లో టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా అధికారికంగా ప్రకటించాడు. ఫైన‌ల్ మ్యాచ్‌ను అహ్మ‌దాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం(మోతెర)లో నిర్వ‌హించ‌నున్నారు. కాగా ప్రపంచకప్లో పాల్గొనబోయే పాక్ ఆటగాళ్ల వీసా విషయంలోను స్పష్టత వచ్చినట్లు షా పేర్కొన్నారు.  

Read More

Tamilnadu: తొలి రైల్వే టికెట్ ఇన్స్పెక్టర్ గా ట్రాన్స్ జెండర్..

Transgendersindhu: ఇటీవల అన్ని రంగాల్లో హిజ్రాల ప్రాబల్యం పెరిగిపోతోంది. తక్కువ స్థాయి అన్యున్నత భావన నుంచి మేమేం తక్కువ స్థాయికి వారు ఎదుగుతున్న తీరు ” న భూతో న భవిష్యతి” . ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు చెందిన ఓ హిజ్రా తొలిసారిగా రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులైంది.  ఇక అసలు విషయంలోకి వెళ్తే తమిళనాడు నాగర్‌కోవిల్‌కు చెందిన హిజ్రా సింధు ఎన్నో అవమానాలను తట్టుకొని రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికైంది. శుక్రవారం సింధు దిండుక్కల్‌ రైల్వే…

Read More

ఇస్లాం విస్తరణలో కశ్మీరీ బ్రామ్మల పాత్ర..

Nancharaiah Merugumala (senior journalist): ఇస్లాం విస్తరణలో కశ్మీరీ బ్రామ్మల పాత్రపై పాత ‘థియరీ’ని సినిమా ఫక్కీలో విజయేంద్ర ప్రసాద్‌ కొద్దిగా మార్చారు –––––––––––––––––––––––––––––––––– బీజేపీ అంటే బ్రాహ్మణ జాతీయ పార్టీ కాదని నిరూపించే క్రమంలో గోదావరి హిందూ సాంస్కృతిక కమ్మ కుటుంబంలో పుట్టిన కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్‌ (80)ను రాజ్యసభకు నామినేట్‌ చేయించింది ప్రధాని నరేంద్రమోదీ – హోం మంత్రి అమిత్‌ శా ద్వయం. భారతీయులు, పాకిస్థానీయుల మధ్య సామరస్యాన్ని, మతాలకు అతీతంగా మనుషులంతా…

Read More

cinima: ఇద్దరు హీరోయిన్లను ప్రేమించిన ‘హీరో’..!

Kollywood: ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ..’ అని వేటూరి రాసిన పాట ఒక్కోసారి నిజంగానే నిజమవుతుంది. ఎవరెవరో ఎందుకో కలుసుకొని, మరెందుకో విడిపోతారు. ఆ తర్వాత మరెవరో దూరంగా ఉండేవాళ్లు దగ్గరై, ఒకటవుతారు. అలాంటి కథే ఇది. ఇద్దరు హీరోయిన్లను ప్రేమించిన ఓ హీరో కథ. తమిళ వాళ్లకి ఈ కథ కొంత తెలుసు. అయితే తెలుగువారికి ఈ కథ పూర్తిగా కొత్తదే! మనకు ఒకప్పుడు వెంకటగిరి, విజయనగరం రాజులు ఉన్నట్లే, తమిళనాడులోని రామనాథపురం/రామనాథ్…

Read More

దేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా!

దేశంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 5 వేల 476 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 158 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 59 వేల 442 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 0.60 శాతంగా ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో 9 వేల 754 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,23,88,475 కి…

Read More

వైసీపీకి మట్టి మాఫియా ప్రయోజనాలే ముఖ్యమా?: నాదెండ్ల మనోహర్

Janasena:పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తి గ్రామంలోని కోదండరాముని చెరువులో అడ్డగోలుగా మట్టి తవ్వేస్తుంటే అధికారులు చేష్టలుడిగి చూడటం దురదృష్టకరమన్నారు జనసేన పీఎసి ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్.కాకినాడకు చెందిన మట్టి మాఫియా సాగిస్తున్న తవ్వకాల మూలంగా తాటిపర్తి రైతుల పొలాలకు నీరు అందని పరిస్థితి నెలకొందని మండి పడ్డారు. ఇక్కడి మట్టి మాఫియా ఆగడాలను, అభ్యంతరం చెప్పిన గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న తీరునీ జన సేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  పిఠాపురంలోని వారాహి సభ ద్వారా రాష్ట్రమంతటికీ తెలియచెప్పారని…

Read More

వ్యూహకర్తలకు అంత సీన్ ఉందా? గెలిపించగలరా?

ప్రశాంతంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ‘ప్రశాంత్‌’ పేరిట మీడియా, సోషల్‌ మీడియాలో చర్చలు వేడి పుట్టిస్తున్నాయి. మొన్నటిదాక బిగ్‌బాస్‌ ‘పల్లవి ప్రశాంత్‌’ సలార్‌ డైరెక్టర్‌ ‘ప్రశాంత్‌ నీల్‌’ పేర్లు వైరల్‌ అయితే, ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసిన రాజకీయ వ్యూహకర్త ‘ప్రశాంత్‌ కిశోర్‌’ వైరల్‌ అవుతున్నారు.  గతంలో బీఆర్‌ఎస్‌కు కూడా పనిచేసిన ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముచ్చటగా మూడో పార్టీకి సలహాలు ఇవ్వడానికి  సిద్ధమయ్యారు. నిజంగా వ్యూహకర్తలు పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగలరా?…

Read More

jagityala: ఫ్రెండ్స్ అవమానించారని బీటెక్ విద్యార్థినీ ఆత్మహత్య..!

జగిత్యాల: స్నేహితుల తీరుతో మానసికంగా క్షోభకు గురైన ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌కు చెందిన కాటిపెల్లి నిత్య (21) హైదరాబాద్‌ కూకట్‌పల్లి (KPHB)లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉండి బీటెక్ మూడవ సంవత్సరం చదువుతోంది. ఇటీవల చదువులో వెనుకబడినదంటూ స్నేహితులు వైష్ణవి, సంజన ఆమెను అనుచితంగా అవమానించినట్టు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన నిత్య ఈ నెల 2న స్వగ్రామానికి వెళ్లి గడ్డి మందు సేవించింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే…

Read More
Optimized by Optimole