APcastcensus: ఆంధ్రాలో కులగణనతోనైనా కాపుల ‘లెక్క’ తేలుతుందా?

Nancharaiah merugumala senior journalist:“ఆంధ్రాలో కులగణనతోనైనా కాపుల ‘లెక్క’ తేలుతుందా?బిహార్‌లో యాదవులు ఎందరున్నారో చెప్పడమంత ఈజీ కాదు ఏపీలో కాపుగణన!” ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం కులాల జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం మొదలైంది. మొదట రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల్లోని (ఓబీసీలు) 139 కులాల జనాభా విడివిడిగా ఎంతో తేల్చడానికి ఈ ‘జాతిగత జనగణన’ (హిందీలో వాడే ఈ మాటలే బాగున్నాయి. కాపు జాతి అనే ముద్రగడ పద్మనాభం గారిని ఈ హిందీ పదాలు గుర్తుచేస్తాయి) చేస్తారని అనుకున్నారు. ఇప్పుడు…

Read Full News

జనసేన అధినేత పవన్ తో మాజీ మంత్రి కొణతాల భేటీ..

Janasenaparty: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో  మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైదరాబాదులో భేటీ అయ్యారు. భేటీలో భాగంగా రాష్ట్ర రాజకీయాలు, ఉత్తరాంధ్రలో రాజకీయపరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని కొణతాల జనసేన లో చేరే అవకాశం ఉంది. అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం నుండి జనసేన తరుపున ఎంపీగా పోటీచేసే యోచనలో కొణతాల రామకృష్ణ ఉన్నారు. ఉత్తరాంధ్రలో సీనియర్‌ నాయకుడుగా పేరున్న కొణతాల.. 1989 నుండి 1996 వరకు  అనకాపల్లి…

Read Full News

‘‘ప్రతీ చేతికి పని-ప్రతీ చేనుకు నీరు’’ … దిశగా జనసేన-టీడీపీ మ్యానిఫెస్టోను రూపొందించాలి.

‘ప్రతి చేతికి పని ` ప్రతి చేనుకు నీరు’, ‘‘వలసలు, పస్తులు లేని’’ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించే దిశగా జనసేన-టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ జరిగినట్టు ఇటీవల జనసేన ప్రకటించింది. దేశంలో ఎక్కడ చూసినా పోటీపడి ఉచితాలు ఇస్తామంటున్న సమయంలో ఇలాంటి ప్రకటన రావడం రాజకీయాల్లో శుభపరిణామమే. చూడటానికి ఆరు పదాలు మాల గుచ్చినట్టు ఉన్నా దీని వెనక ఒక తాత్విక సిద్ధాంతం కూడా ఉంది. ఈ సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే తరాలను నిలబెట్టే పునాది కాగలదు. అయితే…

Read Full News

రాజన్న రాజ్యం రావాలన్న షర్మిలకు ఎక్కడి నుంచి వచ్చిందీ ధైర్యం?

Nancharaiah merugumala senior journalist: ” ఇందిరమ్మ రాజ్యం ఊసెత్తకుండానే….మన దేశంలోనే రాజన్న రాజ్యం రావాలన్న షర్మిలకు ఎక్కడి నుంచి వచ్చిందీ ధైర్యం?” కాంగ్రెస్‌ ప్రతిపక్ష నేత డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004 ఏప్రిల్‌–మేలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మొదటిసారి (దేశంలోనే తొలిసారి) ‘ఇందిరమ్మ  రాజ్యం తీసుకొద్దాం’ అనే నినాదాన్ని విజయవంతంగా వాడుకున్న విషయం ఆయన కూతురు వైఎస్‌ షర్మిలకు తెలుసు. అలాగే 2023 నవంబర్‌–డిసెంబర్‌ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో  పీసీసీ అధ్యక్షుడు ఎనుముల…

Read Full News

వంగవీటి రంగా హత్యానంతరం తెలుగు జర్నలిస్టులకు ‘పోస్ట్-మాడ్రన్‌ హింస’గా కనిపించాయి..

Nancharaiah merugumala senior journalist: ” వంగవీటి రంగా హత్యానంతరం జరిగిన బెజవాడ అల్లర్లు అప్పట్లో కొందరు హైదరాబాద్‌ తెలుగు జర్నలిస్టులకు  ‘పోస్ట్-మాడ్రన్‌ హింస’గా కనిపించాయి!” బెజవాడ నుంచి, కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌ వచ్చేసి పాతికేళ్ళు దాటిపోయినా 1988 డిసెంబర్‌ 26 నాటి ‘రంగా గారి యాజిటేషన్‌’ మాలాంటి ఆంధ్రోళ్లను ఇంకా వెంటాడుతూనే ఉంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని కాటూరులో పుట్టాడని చెప్పే వంగవీటి మోహనరంగారావు గారిని తెలుగు జనం మర్చిపోకుండా గత కొన్నేళ్లుగా…

Read Full News

ఉండవల్లిని ఎన్నికల వ్యూహకర్తగా నియమిస్తే కాపు–బలిజలకు రాజ్యాధికారం ఖాయం!

Nancharaiah merugumala senior journalist: ఉండవల్లిని జై భారత్‌ నేషనల్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా నియమిస్తే కాపు–బలిజలకు రాజ్యాధికారం ఖాయం! వచ్చే ఏడాది ఏప్రిల్‌–మే మాసాల్లో జరిగే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ 16వ ఎన్నికల్లో కొందరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్లు నిరాకరించి, కొత్త అభ్యర్థులను నిలిపే దిశగా ఈ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏ మాత్రం అవకాశం దొరికినా ఆంధ్రా…

Read Full News

జగన్ తో షర్మిల ఢీ? ఏపి కాంగ్రెస్ కు ఆశాకిరణం..!

Appolitics :  ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రిస్క్‌ తీసుకొని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర విభజనకు పూనుకున్నారు. తెలంగాణ ఏర్పాటుతో కాంగ్రెస్‌ రాజకీయంగా ఎంతో నష్టపోయింది. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల ఆగ్రహంతో ఏపీలో కాంగ్రెస్‌ పునాదులే కూలిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం కలలను సాకారం చేసుకున్న తెలంగాణలో కూడా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తొమ్మిదిన్నరేళ్లు పట్టింది. దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణలో…

Read Full News

జగన్ మామ మోసం… విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం: నాదెండ్ల మనోహర్

Janasenaparty: ‘విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందిస్తానని మోసపు మాటలు చెప్పిన జగన్ మామ… పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. పిల్లల  భవిష్యత్  ప్రశ్నార్థకం అవుతోందని.. ఇంగ్లీష్ మీడియం పేరుతో హడావుడి చేశారని ఆయన అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు అని న్యాయస్థానం చెప్పడంతో సీబీఎస్ఈ సిలబస్ విధానం తెచ్చారని.. తీరా ఇప్పుడు సీబీఎస్ఈ సిలబస్ లో చదివిన విద్యార్థులు కనీసం పరీక్షలు రాసుకునే…

Read Full News

ప్రజా సమస్యలు తీర్చమంటే నిర్బంధం ఎందుకు? : నాదెండ్ల మనోహర్

NADENDLAMANOHAR:  ప్రజా సమస్యలను తీర్చాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తుంటే.. వాటి కోసం విపక్షాలు పోరాడాల్సిన విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. విశాఖపట్నం నగర వాసులకు ఎంతో అవసరమైన టైకూన్ జంక్షన్ ను మూసి వేసి, ప్రజలకు లేనిపోని సమస్యలు తెచ్చి పెట్టిన ప్రభుత్వం ఎవరి కోసం ఇంత నాటకం ఆడుతుందో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ ఎంపీ రియల్…

Read Full News

ముఖ్యమంత్రి కూడా ఎంత అవినీతి చేసిందీ ఒప్పుకోవాలి : నాదెండ్ల మనోహర్

Janasenaparty: వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరచుకుపడ్డారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా పనిచేసి, సీఎం కుటుంబంతో బంధుత్వం కలిగిన ఓ మాజీ మంత్రి ప్రజా వేదికపై బహిరంగంగా తాను మంత్రి పదవిలో ఉన్నపుడు అవినీతి చేశానని ఒప్పుకోవడం వైసీపీ పాలనలో జరుగుతున్న అసలు తంతును బయటపెట్టిందన్నారు . ఆయన ఇప్పటికైనా ప్రజల ముందు బహిరంగంగా తాను తప్పు చేసినట్లు ఒప్పుకొన్నందుకు అభినందించాలన్నారు. ఆయనే కాదు… ముఖ్యమంత్రి కూడా…

Read Full News
Optimized by Optimole