ఏషియన్ గేమ్స్ లో భారత మహిళల క్రికెట్ జట్టుకు స్వర్ణం..

Cricket: ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్ 2023 లో భారత మహిళల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ లో 19 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడువికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో లంక జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు మాత్రమే చేసింది.  దీంతో భారత జట్టు విజయం ఖరారైంది.  

Read More

అండర్ -19 ప్రపంచ కప్ విజేత భారత్..

అండర్ -19 ప్రపంచ కప్ లో భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలిసారి నిర్వహించిన టీ 20 ప్రపంచ కప్ ఫైనల్లో.. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ పై గెలిచి భారత మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయం లిఖించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బ్రిటిష్ జట్టు 68 పరుగులకే కుప్పకూలింది. భారత్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో .. ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ ను ముప్పు తిప్పలు పెట్టారు. కెప్టెన్…

Read More

టీంఇండియాకు భారీ షాక్.. రోహిత్ శర్మకి కరోనా!

ఇంగ్లాడ్ తో ఐదో టెస్టుకు ముందు టీంఇండియాకు మరో షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మకు పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కరోనా సోకడంతో సీరిస్ నుంచి తప్పుకోగా.. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కి సైతం పాజిటివ్ అని ఓవార్త సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఇంగ్లాడ్ పర్యటనకు వెళ్లిన టీంఇండియా..ఐదు టెస్ట్ సిరస్లో భాగంగా జరిగిన నాలుగు టెస్టుల్లో 2 1తో…

Read More

ఐపీఎల్ _15వ సీజన్ షెడ్యూల్ విడుదల..

క్రికెట్​ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్​ 2022 షెడ్యూల్​నూ బీసీసీఐ ప్రకటించింది. మార్చి 26న మొదలై మే 29న జరిగే ఫైనల్​తో ఐపీఎల్​ 15వ సీజన్​ ముగియనుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో కోలకతా జట్టు తలపడనుంది. 65 రోజుల పాటు సాగే ఈ సీజన్​లో 70 లీగ్‌మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్‌మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్లేఆఫ్స్​కు సంబంధించిన షెడ్యూల్​ను బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది. ఇక ఈ సారి లఖ్​నవూ, గుజరాత్​ జట్ల…

Read More

భారత టెస్టు కెప్టెన్గా రోహిత్ శర్మ..?

భారత జట్టు టెస్ట్ సారథిగా రోహిత్ శర్మను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వన్డే, టీ20 కెప్టెన్​గా ఉన్న అతనిని.. బీసీసీఐ పూర్తిస్థాయి టెస్టు సారథిగా ఖరారు చేసిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. కాగా శ్రీలంక తో జరిగే టెస్ట్ సిరీస్ కి ముందే సెలెక్షన్ కమిటీ రోహిత్ పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక తో భారత జట్టు 2 టెస్టులు, 3టీ_20లు ఆడనుంది….

Read More

కెప్టెన్సీకి విరాట్ గుడ్ బై.. షాక్లో అభిమానులు!

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కొహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్యంగా టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి వైదోలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇన్నాళ్లు తనకు అవకాశం కల్పించిన బీసీసీఐతోపాటు.. సీనియర్లకు థ్యాక్స్ చెప్పారు. కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయమని ట్వీట్ చేశాడు. కాగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోల్పోయిన వెంటనే కొహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఏడేళ్ల పాటు కెప్టెన్‌గా తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు. అండగా…

Read More

ఐపీఎల్లో మరో రెండు కొత్త టీంలు_బీసీసీఐ

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరాయి. కొత్తగా లక్నో, ఆహ్మదాబాద్‌ ఫ్రాంచైజీలను బిసిసిఐ ప్రకటించింది. దీంతో ఐపీఎల్‌ లో జట్ల సంఖ్య పదికి చేరింది. లక్నో ఫ్రాంచైజీని సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ 7090 కోట్లకు దక్కించుకోగా… ఆహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని సివిసి కంపెనీ 5600 కోట్లకు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ లో పది జట్లు ఆడతాయని బిసిసిఐ తెలిపింది. ఆటగాళ్ల మెగా వేలం డిసెంబర్‌ లో నిర్వహించనున్నట్లు…

Read More

ఐపీఎల్ 20 21 సెకండ్ షెడ్యూల్ కి అంతా సిద్ధం!!

కరోనా మహమ్మారి కారణంగా అర్దాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ సీజన్ 2021 మిగతా మ్యాచ్ల నిర్వహణకు రంగం సిద్ధమైంది. మిగతా మ్యాచ్లను యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించనుంది. ఇందుకోసం బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధుమాల్ సహా ఇతర అధికారులు ఇప్పటికే కీలక చర్చలు జరిపారు. బీసీసీఐ అడిగిన ప్రతీ అంశానికి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తున్నది. 25 రోజుల్లోనే 31 మ్యాచ్‌లు పూర్తి చేయాలని బీసీసీఐ…

Read More

ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్!

ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్. కరోనాతో అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ ను తిరిగి నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ రెడీ చేస్తోంది. మిగతా మ్యాచ్ ల్ని సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ సీజన్‌లో ఇంకా 31 మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో మిగిలిన మ్యాచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. 21 రోజుల షెడ్యూల్‌తో ఆ తర్వాత జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది. సెప్టెంబర్‌…

Read More

ఇంగ్లాండ్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక !

ఇంగ్లాండ్ టూర్ కోసం కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. తుది జట్టులో ఓపెనర్ పృథ్వి షా తోపాటు, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కలేదు. గాయంతో కోలుకున్న రవీంద్ర జడేజా, పేసర్ మహ్మద్ షమీ జట్టులోకి తిరిగొచ్చారు. కాగా ఇదే జట్టును జూన్లో న్యూజిలాండ్ తో జరిగే ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు కొనసాగించనున్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా భారత…

Read More
Optimized by Optimole