అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది: ఖుష్బూ

బీజేపీ పై విమర్శలు చేసిన వారికి నటి కుష్బూ తనిదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకొని వికసించదంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాక అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించలేదంటూ విమర్శలు చేసిన వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఖాతా తెరవని పార్టీ, ఈసారి నాలుగు స్థానాలు గెలుచుకుందని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, రానున్న రోజుల్లో అధికారంలోకి కమలం పార్టీ రావడం ఖాయమని…

Read More

టీఆర్ ఎస్ నేత‌లు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు..

కేసీఆర్ ప్ర‌భుత్వం కూలిపోయే స‌మ‌యం ఆసన్న‌మైంద‌ని బీజేపీ నేత విజ‌య‌శాంతి అన్నారు. బుధ‌వారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గ‌తంలో ఎన్న‌డు లేని విధంగా కేసీఆర్ క‌ళ్ల‌లో భ‌యం క‌న్పిస్తుందని అన్నారు. కాంగ్రెస్ నేత‌లకు, కేసీఆర్తో ర‌హ‌స్య ఒప్ప‌దం ఉంద‌ని.. అందులో భాగంగానే చాలా మంది ఎమ్మేల్యేలు టీఆర్ ఎస్ చేరార‌ని తెలిపారు. కేసీఆర్ దొంగ దీక్ష వ‌ల్ల తెలంగాణ రాలేద‌ని, ఎంతోమంది ప్రాణత్యాగాల వ‌ల‌న తెలంగాణ సాకార‌మైంద‌ని గుర్తుచేశారు. హ‌లియా ముఖ్య‌మంత్రి స‌భ‌పై…

Read More

టీఎంసీ కుట్ర‌ల‌కు పాల్ప‌డుతుంది : జేపీ న‌డ్డా

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అద్భుత ఫ‌లితాలు సాధిస్తుంద‌ని భాజాపా జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ధీమా వ్య‌క్తం చేశారు. ఆదివారం ఓవార్త సంస్థ ఇంట‌ర్య్వూలో ఆయ‌న మాట్లాడుతూ పలు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ప‌శ్చిమ్ బెంగాల్లో రాబోయే రోజుల్లో బీజేపి ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుందని.. అసోంలో అధికారాన్ని నిల‌బెట్టుకుంటాం. తమిళనాడులో అధికార కూటమిలో కీలకంగా ఉంటామని.. పుదుచ్చేరిలో అధికారాన్ని చేజికిచ్చుకుంటాం. కేరళలో కీలకంగా నిలుస్తామని న‌డ్డా పేర్కొన్నారు. ఓట‌మి భ‌యంతో టీఎంసీ…

Read More

తృణ‌మూల్ కుట్ర‌లకు పాల్పడుతోంది : ప్ర‌ధాని మోదీ

బెంగాల్ నాలుగో ద‌శ అసెంబ్లీ ఎన్నిక‌లు రక్త‌సిక్త‌మ‌య్యాయి. శ‌నివారం కూచ్‌బెహార్ జిల్లాలో జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌ల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నిక‌ల విధుల్లో ఉన్న‌ పోలీసుల నుంచి స్థానికులు తుపాకులు లాక్కొనేందుకు ప్ర‌య‌త్నించడంతో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. శ‌నివారం ఉద‌యం పోలింగ్ ప్రారంభ‌మైన కొద్దిసేప‌టికి ఓట్లు వేయ‌డానికి వచ్చిన వారిపై కొంద‌రు రాళ్లు రువ్వార‌ని, భ‌ద్ర‌త బ‌ల‌గాల‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగార‌ని, త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో పోలీసులు కాల్పులు జ‌రిపిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాక కూచ్‌బెహార్ జిల్లాలోని మ‌రో…

Read More

బెంగాల్లో పీకే ఆడియో క‌ల‌క‌లం!

ప‌శ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ఆడియో క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ఆడియోలో కొంద‌రు జ‌ర్న‌లిస్ట్‌ల‌తో ఆయ‌న జ‌రిపిన సంభాష‌ణ‌ల సారాంశాన్ని బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల‌వీయ సోష‌ల్ మీడియాలో పొస్ట చేశారు.’ బెంగాల్‌లో మోదీకి జ‌నాద‌ర‌ణ ఉంది. ఆయ‌న్ని దేవుడిలా ఆరాధిస్తున్నారు. రాష్ట్రంలోని టీఎంసీకి వ్య‌తిరేకత అధికంగా ఉంది. ఓట్లు చీలిపోతున్నాయి. ద‌ళితులు, మ‌తువా ఓట్ల‌తో పాటు, క్షేత్ర స్థాయిలో ఆపార్టీ యంత్రాంగం పనితీరు బీజేపికి క‌లిసోస్తుంది….

Read More

కేసిఆర్ కు దళిత నేతలంటే ఎందుకు పడదు : బండి సంజయ్

సీఎం కేసీఆర్ కు దళిత నాయకులంటే ఎందుకు పడదని ? బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి , వర్ధంతి కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావడం లేదని ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. దళిత నేతల కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం…

Read More

బీజేపి అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ ర‌వినాయ‌క్!

నాగార్జున సాగ‌ర్ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ ర‌వినాయ‌క్ పేరును భాజాపా సోమ‌వారం ఖ‌రారు చేసింది. టికేట్ కోసం అంజ‌న్ యాద‌వ్, నివేదిత రెడ్డి, ఇంద్రాసేన రెడ్డి పోటిప‌డ‌గా.. నియోజ‌క వ‌ర్గంలోని స‌మీక‌ర‌ణాల దృష్ట్యా, త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని , బీజేపి అధిష్టానం ర‌వి ‌నాయ‌క్ ను ఎంపిక చేసింది. త్రిపురారం మండ‌ల ప‌లుగుతాండాకు చెందిన ర‌వినాయ‌క్, ప్ర‌భుత్వ వైద్యుడిగా వివిధ మండ‌లాల్లో విధులు నిర్వ‌ర్తించారు. గ‌త ఏడాది ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రైవేట్ వైద్య‌శాల‌ను నిర్వ‌హిస్తూ, ప‌లు…

Read More

షాతో శ‌ర‌ద్ ప‌వార్ ర‌హ‌స్య భేటి?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ర‌హ‌స్య భేటి ప్రాధా‌న్యం సంతరించుకుంది. భేటికి సంబంధించి ఎటువంటి విష‌యం బ‌య‌టికి రాలేదు. కానీ హొంమంత్రి అమిత్ షా ఆదివారం ఓ మీడియా స‌మావేశంలో విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు త‌నదైన శైలిలో ప్ర‌తి విష‌యం బ‌య‌టికి చెప్ప‌లేం క‌దా అని బ‌దులివ్వ‌డంతో ర‌క‌ర‌కాల ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి. మ‌హ‌రాష్ట్ర హొంమంత్రి, ఎన్సీపీ నేత‌ అనిల్ దేశ్ ముఖ్ పై ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ భేటి జ‌రిగిన‌ట్లు ప్ర‌ధానంగా…

Read More

తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ!

తిరుపతి బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఎఎస్ రత్నప్రభ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఆమె పేరును బీజేపీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. గతంలో రత్నపభ కర్ణాటక ప్రభుత్వ కార్యదర్శిగా పనిచే శారు. పదవీవిమరణ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ప్రధానంగా కొందరి పేర్లు వినిపించిన తుదకు ఆమెను ఎంపిక చేశారు. తిరుపతిలో విద్యావంతులు ఎక్కువగా ఉండడంతో, దానిని దృష్టిలో పెట్టుకొని, అధిష్టానం అభ్యర్థిని…

Read More

బెంగాల్లో 200 పైగా స్థానాలు గెలుస్తాం : రాజ్నాథ్ సింగ్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా స్థానాలు గెలుస్తుందని  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తంచేశారు. గురువారం బెంగాల్ ఎన్నికలు పర్యటనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200 పైగా స్థానాల్లో విజయం సాధించిడం ఖాయమని అన్నారు. బెంగాల్లో  ప్రజాస్వామ్యం ఖునీ అయ్యిందన్నారు. ప్రభుత్వం అంటే రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని తృణమూల్  ప్రభుత్వానికి హితబోధ చేశారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా …

Read More
Optimized by Optimole