ఎట్టకేలకు దిగొచ్చిన ట్విట్టర్!

విద్వేష పూరిత పోస్టులు, నకిలీ ఖాతాల నిలుపుదల విషయంలో ట్విట్టర్ ఎట్టకేలకు దిగొచ్చింది. బుధవారం కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి తో  సమావేశమైన, ట్విట్టర్  ప్రతినిధుల చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో పలుచోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై విద్వేష పూరిత పోస్టులు, నకిలీ ఖాతాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్న ఖాతాలను మూసివేయాలని ట్విట్టర్ను కేంద్రం ఆదేశించింది. అయితే కొన్ని ఖాతాలను మాత్రమే నిలిపేసిన ట్విట్టర్ …..

Read More

వ్యాక్సినేషన్ తర్వాత సీఏఏ అమలు: అమిత్ షా

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమలుచేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం వెల్లడించారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో భాగంగా ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కో-వ్యాక్సినేషన్  ప్రక్రియ ముగిసిన వెంటనే సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం) అమలు చేస్తామని, దీని వలన ఎవరు పౌరసత్వం కోల్పోరని అమిత్ షా స్పష్టం చేశారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో  ‘ప్రధాని వికాస్ అభివృద్ధి నమూనా.. సీఎం మమతా బెనర్జీ వినాష్ నమూనా ‘ మధ్య పోటీ…

Read More

సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్!

కేసీఆర్ కల్లబొల్లి మాటల్తో మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ సాగర్ పర్యటనపై ఆయాన స్పందిస్తూ మీడియాకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని సాగర్ ఎన్నికల ప్రచారం సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్దమాడాడని సంజయ్ తెలిపారు. గిరిజన రైతుల భూములను అధికార ఎమ్మెల్యే కబ్జా చేశారని, ప్రశ్నించిన గిరిజనులపై దాడి చేయించి, జైల్లో పెట్టడంపై ముఖ్యమంత్రి సమాధానం చెబితే బాగుండేదని…

Read More

కేసీఆర్ ని తక్షణం పదవి నుంచి తొలగించాలి: అరవింద్

సీఎం పదవిని అవమానించిన కేసీఆర్ ని తక్షణం ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని ఎంపీ ధర్మపూరి అరవింద్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన గవర్నర్ కి లేఖ రాశారు. సోమవారం ఢిల్లీ చౌకలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై పార్టీ నేతల్లో విశ్వాసం సన్నగిల్లిందని, మంత్రులు,ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మార్పు విషయం అందులో భాగమే అని ఆయన అన్నారు. ఇటీవల పార్టీ వరుస ఓటములతో, పార్టీలో వ్యతిరేక గళం వినిపిస్తుండటంతో కెసిఆర్ భద్రతా భావంలో ఉన్నారని అరవింద్…

Read More

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మోదీ

రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సోమవారం పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ దశాబ్దపు అనేక లక్ష్యాలను నిర్దేశించిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సూక్తులను ఉటంకిస్తూ.. రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు స్వేచ్ఛాయుత మార్కెట్ కావాలని మన్మోహన్ జీ అంటుండేవారు.. అవకాశాన్ని మేము కల్పించినందుకు మీరు (కాంగ్రెస్ పార్టీని…

Read More

ఆదివాసీ గిరిజనులు కోసం కరసేవ ప్రారంభం: బండి సంజయ్

తెలంగాణలో పొడుభూములు,అదివాసులు, గిరిజనులు కోసం భాజపా యుద్ధం మొదలెట్టిందని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం గుర్రంబోడు తండాలో సభలో ఆయన మాట్లాడుతూ.. నాడు అయోధ్యలో రామాలయం కోసం కరసేవ చేశామని నేడు పేదల కోసం గుర్రంబోడు తండా నుంచి కరసేవ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు. 70 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న గిరిజన భూములను టీఆర్ఎస్ నేతలు కబ్జా చేసి, వారిమీద అక్రమ…

Read More

దేశ ప్రతిష్టతను దిగజార్చే కుట్ర: మోదీ

దేశ ప్రతిష్టతను దిగజార్చేందుకు కొన్ని విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం అసోంలోని సొంటిపూర్ జిల్లాలో టీ కార్మికులు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని పరిశ్రమల గురించి బయటి శక్తులు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, అలాంటి వారికి మద్దతు తెలిపే రాజకీయ పార్టీలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని మోదీ పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం 8 వేల కోట్లతో తలపెట్టిన ‘అసోంమాల’ పథకాన్ని ఆయన…

Read More

ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం : అనురాగ్ ఠాకూర్

కరోనా తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా 2020-21 వార్షిక బడ్జెట్ రూపొందించామని కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా సంక్షోభంతో కష్టాల్లో ఉన్నవారిపై ఎలాంటి భారం పడకుండా.. ఆత్మనిర్భర భారత్ లక్ష్యంగా ముందుకెళ్తూమాని అన్నారు. అనంతరం లఘు ఉద్యోగ భారతి సంస్థ నిర్వహించిన పారిశ్రామిక వేత్తలు, మేధావులతో చర్చా గోష్టిలో పాల్గొన్నారు. నీతి ఆయోగ్ సూచన…

Read More

దేశ ప్రతిష్టతను మసకబార్చే కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

భారత్ ప్రతిష్టతను మసక అంతర్జాతీయ కుట్ర జరుగుతొందని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు. నాగపూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ప్రఖ్యాత సెలబ్రెటీలు ట్వీట్స్ వెనక అంతర్జాతీయ కుట్ర దాగుందని ఆయన తెలిపారు. దేశంలో గందరగోళం వాతావరణం సృష్టించి అల్లర్ల రేపే ప్రయత్నం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కాగా రైతులకు మద్దతు తెలుపుతూ హాలీవుడ్ పాప్ సింగర్ రిహనా, ప్రపంచ పర్యావరణ వేత్త గ్రేటా…

Read More

బెంగాల్లో నియంత పాలన కొనసాగుతోంది: అమిత్ షా

బెంగాల్ లో నియంత పాలన కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఆదివారం హౌరాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ.. మమతా ప్రభుత్వ పాలన వైఫల్యం వల్లే నేతలు తృణముల్ పార్టీని వీడి భాజపాలో చేరుతున్నట్లు షా వెల్లడించారు. ప్రధాని మోడీ ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తుంటే, దీదీ అల్లుడు శ్రేయస్సు కోసం పనిచేస్తుందని అన్నారు. దీదీ హయాంలో, దోపిడీలు దొంగతనాలు అవినీతి పెరిగిపోయిందని పేర్కొన్నారు. కాగా ఎన్నికల సమయానికి పార్టీ అంతా…

Read More
Optimized by Optimole