గుజరాత్ మున్సి’పోల్స్’ లో భాజపా ప్రభజనం!

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో భాజపా ప్రభంజనం సృష్టించింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా స్వరాష్ట్రమైన గుజరాత్ లో.. ఆదివారం  ఆరు కార్పొరేషన్లలోని 576 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా 466 చోట్ల విజయం సాధించి భాజపా సత్తా చాటింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 45 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 27 డివిజన్లను గెలుచుకొని బోణి కొట్టింది. ఎంఐఎం ఏడూ స్థానాలను కైవసం చేసుకొంది. కాాగా ఆప్ పార్టీ…

Read More

బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: మోదీ

పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  సోమవారం బెంగాల్  పర్యటించిన ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. అధికార తృణమూల్ నేతల కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని అన్నారు. ఇల్లు అద్దెకిచ్చిన.. అద్దెకు తీసుకున్న వారి ఇరువురి నుంచి డబ్బులు వసూలు చేస్తు రెండువైపులా సంపదిస్తున్నారని మోదీ అన్నారు. ఈ సంస్కృతికి చరమ గీతం పాడాలంటే బెంగాల్లో కమల వికసించాలని మోదీ పేర్కొన్నారు. ఇక తృణమూల్ తాజాగా లేవనెత్తిన…

Read More

ఈశాన్య రాష్ట్రాల పై కాంగ్రెస్ సవతి ప్రేమ: మోదీ

గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలపై సవతి ప్రేమను ఒలకబోసాయని  ప్రధాని మోదీ విమర్శించారు. సోమవారం ఆస్సాంలో పర్యటించిన ప్రధాని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. స్వాత్రంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ఈశాన్య రాష్ట్రాలలో, విద్య, వైద్యం, పరిశ్రమలు వంటి విషయాలను  నిర్లక్ష్యం చేసిందని మోదీ అన్నారు. అసోం అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిపనిచేయాలని మోదీ సూచించారు. కాగా పర్యటనలో భాగంగా 3,300…

Read More

గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం : బండి సంజయ్

ఛత్రపతి శివాజీ స్పూర్తితో 2023లో తెలంగాణ లో హిందూ రాజ్య స్థాపన చేసి తీరుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. శివాజీ జయంతి సందర్భంగా బోరాబండ డివిజన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఎనభై శాతం మంది హిందువులున్న దేశంలో హిందూ ధర్మ స్థాపకుడు శివాజీ మహరాజ్ విగ్రహ ఏర్పాటు అడ్డుకుంటారా అని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శివాజీ విగ్రహాలు కాకుంటే, బాబర్ ,అక్బర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు….

Read More

దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి : బండి సంజయ్

బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరిస్తూన్న తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హుజర్నగర్ గుర్రంబోడు గిరిజన భూములకు సంబంధించి పోరాడుతున్న బీజేపీ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని.. మేమంతా మళ్ళీ గుర్రంబోడు వెళతామని దమ్ముంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ హుజర్నగర్ దుబ్బాక లో ఇచ్చిన హామీలే,ఇప్పడు నాగార్జున సాగర్ లో ఇచ్చారని సంజయ్ వెల్లడించారు….

Read More

తెలంగాణ చిన్నమ్మ సేవలు మరువం: కిషన్ రెడ్డి

మంత్రి కేటీఆర్కి దమ్ము ధైర్యం ఉంటే మజ్లీస్ పై యుద్ధం చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువులను కించపరిచే మజ్లీస్ పార్టీని పక్కన పెట్టుకొని ప్రధానిపై యుద్ధం చేస్తానని కేటీఆర్ అనడం ఏంటని అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక ,బీజేపీ అనుకూల…

Read More

తెలంగాణ చిన్నమ్మ జయంతి నేడు!

సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షతను చేరిపేస్తూ..మహిళ అబల కాదు సబల అని నిరూపించి..రాజకీయాలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్న మహిళ నేతల్లో ఒకరైన బిజిప్ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ జయంతి సందర్భంగా ఆ మహానీయురాలి స్మృతిలో.. హర్యానా రాష్ర్టంలోని కంబోలా స్వస్థలం.. 1953 ఫిబ్రవరి14 న సుష్మాస్వరాజ్ జన్మించారు.తల్లిదండ్రులు హరిదేవ్ శర్మ లక్ష్మీదేవి.వీరి కుటుంబం దేశ విభజనకు ముందు లాహోర్ లో ఉండేవారు.తండ్రి హరిదేవ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త..వారసత్వంమే సుష్మ జి పాటించారు.విద్యాబ్యాసం అంత అక్కడే గడిచింది..పాఠశాల…

Read More

ఎట్టకేలకు దిగొచ్చిన ట్విట్టర్!

విద్వేష పూరిత పోస్టులు, నకిలీ ఖాతాల నిలుపుదల విషయంలో ట్విట్టర్ ఎట్టకేలకు దిగొచ్చింది. బుధవారం కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి తో  సమావేశమైన, ట్విట్టర్  ప్రతినిధుల చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో పలుచోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై విద్వేష పూరిత పోస్టులు, నకిలీ ఖాతాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్న ఖాతాలను మూసివేయాలని ట్విట్టర్ను కేంద్రం ఆదేశించింది. అయితే కొన్ని ఖాతాలను మాత్రమే నిలిపేసిన ట్విట్టర్ …..

Read More

వ్యాక్సినేషన్ తర్వాత సీఏఏ అమలు: అమిత్ షా

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమలుచేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం వెల్లడించారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో భాగంగా ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కో-వ్యాక్సినేషన్  ప్రక్రియ ముగిసిన వెంటనే సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం) అమలు చేస్తామని, దీని వలన ఎవరు పౌరసత్వం కోల్పోరని అమిత్ షా స్పష్టం చేశారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో  ‘ప్రధాని వికాస్ అభివృద్ధి నమూనా.. సీఎం మమతా బెనర్జీ వినాష్ నమూనా ‘ మధ్య పోటీ…

Read More

సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్!

కేసీఆర్ కల్లబొల్లి మాటల్తో మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ సాగర్ పర్యటనపై ఆయాన స్పందిస్తూ మీడియాకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని సాగర్ ఎన్నికల ప్రచారం సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్దమాడాడని సంజయ్ తెలిపారు. గిరిజన రైతుల భూములను అధికార ఎమ్మెల్యే కబ్జా చేశారని, ప్రశ్నించిన గిరిజనులపై దాడి చేయించి, జైల్లో పెట్టడంపై ముఖ్యమంత్రి సమాధానం చెబితే బాగుండేదని…

Read More
Optimized by Optimole