తెలంగాణ సీఎం వరుస ఓటములతో పరేషాన్ అవుతున్నారు_ పియూష్ గోయల్
తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు.. కేంద్రమంత్రితో పీయూష్ గోయల్తో ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ సీఎం వరుస ఓటములతో పరేషాన్ అవుతున్నారన్న పియూష్.. ధాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రులకు పని లేదా? వచ్చి ఢిల్లీలో కూర్చున్నారంటూ వ్యాఖ్యానించారు. మా పనుల్లో మేం బిజీగా ఉన్నాం,…