BJPDHARNA: బీజేపీ మహాధర్నాను విజయవంతం చేయండి : కేంద్ర‌మంత్రి బండిసంజ‌య్

Bandisanjay:   ‘‘మూసీ పునరుజ్జీవం’’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న‌ట్లు కేంద్ర‌హొంశాఖ స‌హాయ‌మంత్రి బండిసంజ‌య్ కుమార్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈమేర‌కు మూసీ బాధితుల ప‌క్షాన శుక్ర‌వారం(ఈనెల‌25న‌)ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్ట‌బోయే మహాధర్నాను విజయవంతం చేయాలని కేంద్ర‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ పథకం పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీస్తోంద‌న్నారు. లక్షా 50 వేల కోట్ల వ్యయంతో చేపడుతున్న…

Read More

BJPTELANGANA: అధ్యక్షుడిగా బండి? కలిసొచ్చిన చలో సెక్రటేరియట్..!

BJP Telangana: తెలంగాణ బీజేపీ అధ్య‌క్ష కుర్చీ పై మ‌రోసారి చ‌ర్చ జ‌రుగుతోంది.త్వ‌ర‌లోనే పార్టీ అధ్య‌క్షుడి ఎంపిక జ‌ర‌గ‌నున్న‌ నేప‌థ్యంలో ఎవ‌రికివారు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఈక్ర‌మంలోనే గ్రూపు 1 అభ్య‌ర్థుల మ‌ద్ద‌తుగా మాజీ అధ్యక్షుడు , కేంద్ర‌హోంశాఖ‌ స‌హాయ‌మంత్రి బండిసంజ‌య్ కుమార్ చేప‌ట్టిన చ‌లో సెక్రెటేరియ‌ట్ ర్యాలీ క‌మ‌లం పార్టీలోపెద్ద‌చ‌ర్చ‌కు దారితీసింది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత స్తబ్దుగా ఉన్న పార్టీ కేడ‌ర్‌లో బండి ప్రోగ్రాంతో ఒక్క‌సారిగా జోష్ పెరిగింది. దీంతో మ‌రోసారి అధ్యక్షుడిగా బండిసంజ‌య్ ను…

Read More

కేంద్ర మంత్రిని కలిసిన కొమురవెల్లి చైర్మన్ డాక్టర్ ఉప్పు రవీందర్..

Telangana:  శ్రీ మల్లికార్జున స్వామి అఖిలభారత మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రం ట్రస్టు కొమురవెల్లి చైర్మన్ డాక్టర్ ఉప్పు రవీందర్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి   బండి సంజయ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొమురవెల్లి లో జరుగుతున్న మున్నూరు కాపు సత్రం నిర్మాణ పనుల గురించి వివరించి.. ఎంపీ నిధుల మంజూరు కోసం విజ్ఞప్తి చేశారు.ఇందుకు బండి సంజయ్ సానుకూలంగా స్పందించి తన వంతు ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. కొమురవెల్లిలో…

Read More

నిత్య స్ఫూర్తి… తరగని కీర్తి… పెద మల్లయ్యకు ఘననివాళి..!

Nalgonda: నెల్వలపల్లి గ్రామ మాజీ సర్పంచ్, బూరుగు పెద మల్లయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని నెల్వలపల్లి గ్రామంలో ఆయన కుమారులు, ప్రణవా గ్రూప్ అధినేత బూరుగు రవికుమార్, ప్రణావా గ్రూప్ డైరెక్టర్ బూరుగు రాంబాబుల వ్యవసాయ క్షేత్రంలో సద్గురు- పీఠాధిపతులు శ్రీ శివానంద స్వామి ఆధ్వర్యంలో ఈ ప్రథమ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. బూరుగు రవికుమార్ ఆహ్వానం మేరకు ఆయన స్నేహితులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి…

Read More

Telangana: మోట కొండూరులో సేవ్ దామగుండం పేరిట నిరసన..

Telangananews:  వికారాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ అనంతగిరి దామగుండ రక్షిత అడవులలో నౌకాదళ రాడార్ కేంద్ర ఏర్పాటుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా మోట కొండూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర వివిధ సంఘాల నాయకులు, ప్రకృతి ప్రేమికులు నిరసన తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల అడవిలో జీవిస్తున్న స్థానికులకు, జీవరాసులకు, నగరవాసులకు ముప్పు పొంచి ఉందని,మూసి నది ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని రచయిత పి.చిన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి,అటవీ…

Read More

Telangana: ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి..!

MLCElection’s2024: ఉత్తర తెలంగాణలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎన్నికలకు మూడు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. టికెట్ కోసం ఆశావాహులు సైతం ప్రయత్నాలు మొదలెట్టారు.అయితే అధికార కాంగ్రెస్ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచి జోరుమీదున్న బీజేపీ, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు బలమైన అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. ఇక ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు సైతం…

Read More

KCR: కేసీఆర్ 3.0

KCR: కేసీఆర్ కోలుకున్నట్టున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున ఒంటికి తగిలిన గాయం నుంచి ఇదివరకే కోలుకున్నా, రాజకీయ గాయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టున్నారు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలకు ఇప్పుడొక గట్టి హెచ్చరిక నోటీస్ జారీ చేశారు. ఇరువురికీ సమదూరం పాటించే పోరాట రాజకీయ పంథా ప్రకటించారు. విషాన్ని గొంతుకలో నిలుపుకున్న గరళకంఠుడ్ని అని చెబుతూ.. ఏ క్షణాన్నయినా బద్దలయే అగ్నిపర్వతంలా ఉన్నానన్నారు. లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైళ్లో ఉన్న కూతురు కవిత పరిస్థితిపై…

Read More

Telangana: గాడిద గుడ్డు పేరుతో బిజేపి పై కాంగ్రెస్ ఎటాక్..వినూత్న నిరసన..!

In Telangana: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో బ్యానర్లు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఇటీవలి బడ్జెట్ లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు అంటూ వినూత్న రీతిలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది. అయితే 8 ఎంపీ సీట్లు…

Read More

politics: హీరో ఎవరో..? జీరో ఎవరో..? ప్రజలే తేలుస్తారు..!

Telugustatespolitics: తగలబడిన తన ఇంటిని చక్కదిద్దుకోకుండా పక్క వారి ఇల్లు ఎలా తగలబడిరదా అని విచారించే వివేకి చందంగా ఉంది బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీరు. తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజా తిరస్కరణకు గురైన బీఆర్‌ఎస్‌ తమ వైఫల్యాలను విశ్లేషించుకొని, పార్టీని చక్కదిద్దుకోవాల్సి ఉంది. దానికి బదులు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఎలా ఓడిపోయింది అని బాధపడుతున్నట్టు ఉంది ఆయన వ్యవహారం. ఈ రెండు పార్టీలు ఒకే రకమైన తప్పులు చేసి.. ఒకే…

Read More

Telangana: బిఆర్ఎస్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తుందా..?

Telanganacongress: ఎన్నికలు ముగియగానే ప్రతీ రాజకీయ పార్టీ ప్రధానంగా అధికారం చేపట్టినవారు ‘‘రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం. ఇక పై అభివృద్ధిపైనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తాం…’’ అంటూ తియ్యటి మాటలను వల్లెవేస్తారు. ఆచరణలో మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్‌ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యతిస్తున్నట్టు కనిపిస్తోంది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పరిపాలనతో సంతృప్తి చెందని ప్రజలు ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో, అంతకు మించి పార్లమెంట్‌ ఎన్నికల్లో గట్టి గుణపాఠం…

Read More
Optimized by Optimole