×
In

జనాభా నియంత్రణకు అసోం కొత్త అస్త్రాన్ని ఉపయోగించనుందా? ఇప్పటికే యూపీ సర్కారు ఈ బిల్లు కు ముసాయిదా రూపొందించిన నేపథ్యంలో అస్సాం సర్కార్ ఇందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాపులేషన్​ ఆర్మీ పేరుతో యువతను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది.

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని యూపీలో ఇప్పటికే జనాభా నియంత్రణ బిల్లుపై ముసాయిదా రూపొందించి.. ప్రతి పక్షాలను అభిప్రాయాలను తీసుకుంటోంది. అసోం ప్రభుత్వం సైతం ఇదే తంతును కొనసాగిస్తూ.. బిల్లుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘పాపులేషన్ ఆర్మీ’ పేరుతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రాంతాల్లో నివసిస్తున్న మైనారిటీల జనాభా వృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇటీవలే ఓ కార్యక్రమంలో జనాభా నియంత్రణపై కాంగ్రెస్​ ఎమ్మెల్యే శెర్మాన్​ అలీ అహ్మద్​ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ..
” రాష్ట్రంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు సుమారు 1,000 మంది యువతతో పాపులేషన్​ ఆర్మీని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నాం. దాంతో పాటుగా గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు(ఏఎస్​హెచ్​ఏ) ఆధ్వర్యంలో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వీరు జనాభా నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించటం, మహిళలకు గర్భనిరోధక సాధనాలను పంపిణీ చేస్తారు. అలాగే.. అమ్మాయిల వివాహ వయస్సును 18 నుంచి 20కి పెంచాలనే డిమాండ్​ను ప్రభుత్వం పరిశీలిస్తోందని అసోం ముఖ్యమంత్రి సమాధామిచ్చారు.
కాగా సీఎం మాటలకు అలీ జవాబిస్తూ.. నదీ పరివాహక ప్రాంతాల్లో విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని, కొన్ని జిల్లాల్లో బాల్యవివాహాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిపైనా దృష్టి సారించాలని కోరారు అ. కాంగ్రెస్​ నేత అడిగిన ప్రశ్నలకు.. జనాభా నియంత్రణ విధానం అనేది ముస్లింలకు వ్యతిరేకం కాదని, పేదరికానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు సీఎం హిమంత్ బిశ్వ.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: కేరళలో యూడీఎఫ్ సర్కార్: పీపుల్స్ పల్స్

National: కేరళలో అధికార మార్పు సంప్రదాయానికే మళ్లీ రాష్ట్ర ప్రజలు ఓటేశారని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది. కేరళలో వరుసగా 2016, 2021లో అధికారంలోకి వచ్చిన వామపక్షాల...

Read out all

National: తమిళనాడులో మ‌రోసారి డీఎంకే…

National: తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మ‌రోసారి అధికారం చేప‌ట్ట‌నుంద‌ని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు...

Read out all

National: పుదిచ్చేరిలో మ‌ళ్లీ ఏన్‌డీఏనే…

National: కేంద్ర పాలిత ప్రాంతం పుదిచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది.పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా మెజార్టీకి 17 స్థానాలు...

Read out all

National: బెంగాల్ మళ్లీ దీదీదే: పీపుల్స్ పల్స్

National: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే పై చేయి సాధిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. పశ్చిమ బెంగాల్...

Read out all

Bollywood: ‘ఏక్ దిన్’తో సాయి పల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ…!!

Bollywood: దక్షిణాదిన తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ‘ఏక్ దిన్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఆమె, ఇప్పటికే ప్రమోషన్లలో...

Read out all

AP: ప్రజల నమ్మకానికి నిదర్శనం… నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ: సతీష్ బాబు

తెనాలి, ఏప్రిల్ 26, 2026: ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తూ విశ్వసనీయతను నిలబెట్టుకుంటున్న నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ భవిష్యత్తులో మరింత విస్తరిస్తూ అనేక శాఖలను ప్రారంభించాలని...

Read out all
Optimized by Optimole