Loksabhaelections:2024 పార్లమెంటు ఎన్నికల్లో ఈవీఎంలపై కాంగ్రెస్ నమ్మకం తప్పక పెరుగుద్ది!

Nancharaiah merugumala senior journalist: ” 2024 పార్లమెంటు ఎన్నికల్లో తన బలం 52 నుంచి 72 సీట్లకు చేరితే ఈవీఎంలపై కాంగ్రెస్ నమ్మకం తప్పక పెరుగుద్ది!” కాంగ్రెస్ తొలి సంకీర్ణ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కోహ్లీ జీ సర్కారు హయాంలో జరిగిన మొదటి (2009) లోక్ సభ ఎన్నికల్లో ఆయన పార్టీ కాంగ్రెస్ బలం 145 (2004) సీట్ల నుంచి 206 స్థానాలకు పెరిగింది. ఐదేళ్ల తర్వాత ఈ డాక్టర్ సాబ్ పాలన చివర్లో…

Read More

PawanKalyan: సొంత చెల్లిని తిట్టించేవాడు అర్జునుడు ఎలా అవుతాడు?: పవన్ కళ్యాణ్

PawanKalyan: సొంత చెల్లిని తిట్టించేవాడు అర్జునుడు ఎలా అవుతాడు?అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆదివారం  మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు  వల్లభనేని బాలశౌరి జనసేనలో  చేరిక సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తోడబుట్టిన చెల్లిని నోటికి వచ్చినట్లు తిడుతున్న వారిని ప్రోత్సహించేవాడు మహా భారతంలో అర్జునుడు ఎలా అవుతాడు…? సొంత బాబాయిని హత్య చేసిన వారిని వెనకేసుకొచ్చే వాడు గాంఢీవధారి ఎలా అవుతాడు…? తండ్రి…

Read More

APpolitics: అహం ఎంత తోపునైనా తొక్కి పడేస్తుంది!

(శేఖర్ కంభంపాటి, జర్నలిస్ట్):   ఏపీ పాలిటిక్స్ ఇంట్రెస్టుగా మారుతున్నాయి. నేతలంతా ప్రజల్లో ఉంటున్నా వారి పల్స్ మాత్రం పసిగట్టలేక పోతున్నారు. అభివృద్ధి పేరుతో జగన్ …  వైసీపీ అరాచకం పెరిగిందని బాబు జనాల్లోకి వెళ్తున్నారు. కానీ పబ్లిక్ టాక్ మాత్రం రివర్సులో వినిపిస్తోంది. చెప్పుకోవడానికి సీఎం మా చుట్టం అయినా అపాయింట్మెంట్ ఇవ్వడు అని కొందరు .. బాబుని కాదని జగన్ను సీఎం చేస్తే ఏపీలో డెవలప్మెంట్ అంతంత మాత్రమే అని ఓటర్ల మాట. జగన్ కోటరీలో…

Read More

వైసీపీ ప్రభుత్వంలో ప్రజాధనమంతా సలహాదారుల పాలు : నాదెండ్ల మనోహర్

Janasenaparty:  వైసీపీ ప్రభుత్వం సలహాదారులకు పెట్టిన ఖర్చు ఎంతో అసెంబ్లీ సమావేశాల్లో చెప్పాలని  జనసేన పార్టీ  పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.గురువారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం సలహాదారులకు పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.680 కోట్లని స్పష్టం చేశారు. ఇందులో ప్రధాన సలహాదారుడు  సజ్జల రామకృష్ణారెడ్డి కోసం పెట్టిన ఖర్చే రూ.140 కోట్లు అని.. ఇంత భారీగా ప్రజాధనాన్ని వెచ్చించి ఏర్పాటు…

Read More

Kumariaunty: కాపుల పేరు నిలబెట్టిన కుమారి ఆంటీ ..

Nancharaiah merugumala senior journalist: ” ఇప్పటి దాకా రామోజీ, కావూరు, సీవీ రావు వంటి గుడివాడ తాలూకా కమ్మ వ్యాపారుల పేర్లే హైదరాబాదులో మారుమోగినా.. కుమారి ఆంటీ అనే వీధి తిండి పెట్టే మహిళ ఇప్పుడు కాపుల పేరు నిలబెట్టింది! ”  ఇప్పటి వరకూ గుడివాడ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కమ్మ కులపోళ్లు మాత్రమే హైదరాబాద్‌ వచ్చి బాగా సంపాదించారని, వారు చాలా, శానా తెలివైన వ్యాపారులనే మితిమీరిన పేరు, ప్రచారం ఉన్నాయి. కృష్ణా జిల్లా…

Read More

TDP: కోటరీ వలయంలో యువనేత..!

TDP : రాజకీయాల్లో దూకుడుతోపాటు అనుభవానికి కూడా పెద్దపీట వేస్తేనే రాణించగలుగుతారు. సీనియర్లు పాత చింతకాయ పచ్చడి లాంటి వారని పక్కనపెడుతూ పూర్తిగా యువతకే ప్రాధాన్యతిస్తే కొత్త చింతకాయ పచ్చడితో ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. ఈ పచ్చడి ఉదాహరణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సరిగ్గా సరిపోతుంది. తనది నలభై ఏండ్ల రాజకీయ అనుభవమని నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెబుతుంటారు, అయితే టీడీపీలో మాత్రం ప్రస్తుతం అనుభవం కన్నా యువనేత నారా లోకేశ్‌ పెత్తనమే సాగుతోంది….

Read More

Janasena: వైసీపీకి జనసేన కౌంటర్..”ఇప్పటికిప్పుడైన సంతోషంగా దిగిపోతా ” కార్టూన్ వైరల్..!

Janasenacartoon:ఏపీ సీఎం జగన్ పై జనసేన రూపొందించిన కార్టూన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల  నేషనల్ ఛానల్ ‘ఇండియా టుడే ‘ నిర్వహించిన  ఎడ్యుకేషన్ సమ్మిట్ లో జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రోగ్రాంలో భాగంగా కన్సల్టింగ్ ఎడిటర్  అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. దీంతో దేశ వ్యాప్తంగా  జగన్ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరిగింది. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ జనసేన సెటైరికల్ కార్టూన్ డిజైన్ చేసింది. …

Read More

APpolitics: ఆంధ్రా కాపులకు కావాల్సింది నితీశ్‌ వంటి వివేకమున్న నాయకుడు కాదా?

Nancharaiah merugumala senior journalist: ‘ ఇప్పుడు ఆంధ్రా కాపులకు కావాల్సింది నితీశ్‌ కుమార్‌ వంటి నిజాయితీ, పదునైన మెదడు, రాజకీయ వివేకమున్న నాయకుడు కాదా?’  బీజేపీ మొదటి ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి నాయకత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వాల్లో (1998–2004 మధ్య) కీలక కేబినెట్‌ మంత్రులుగా కొనసాగిన లోహియా సోషలిస్టులు జార్జి ఫెర్నాండెజ్, నితీశ్‌ కుమార్‌ (సమతా లేదా జేడీయూ) ఆ లేత కాషాయ రంగు సర్కారు మితిమీరిన మతతత్వ పంథా అనుసరించకుండా నియంత్రించగలిగారు. ఇప్పుడు తొలి…

Read More

Pawan: “పొత్తు ధర్మం” పై బాబుకు పవన్ ఝలక్.. తగ్గేదెలా..!

JanasenaTDPalliance :  ఆటల్లో గానీ…రాజకీయాల్లో గానీ నియమాలు, నిబంధనలు ఉంటాయి. ప్రధానంగా రాజకీయ పార్టీల పొత్తుల విషయంలో ఇవి మరింత ప్రధానం. వీటిని అతిక్రమించకుండా ఉంటే అంతా సక్రమంగానే ఉంటుంది. లేకపోతే ఎవరికి వారే అనుకుంటే గందరగోళం తప్పదు. పార్టీల పొత్తు ధర్మంలో అంతర్గతంగా ఎంత ఉత్తిడి ఉన్నా అధినేతలు మాత్రం పరస్పరం గౌరవించుకుంటూ ముందుకెళ్తే వారి మధ్య మంచి అవగాహనతో అపనమ్మకాలు లేకుండా వారు విజయ లక్ష్యానికి చేరువవుతారు. లేకపోతే ప్రత్యర్థులకు అస్త్రాలు అందించినట్టే.  ఆంధ్రప్రదేశ్‌లో…

Read More

APcastcensus: ఆంధ్రాలో కులగణనతోనైనా కాపుల ‘లెక్క’ తేలుతుందా?

Nancharaiah merugumala senior journalist:“ఆంధ్రాలో కులగణనతోనైనా కాపుల ‘లెక్క’ తేలుతుందా?బిహార్‌లో యాదవులు ఎందరున్నారో చెప్పడమంత ఈజీ కాదు ఏపీలో కాపుగణన!” ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం కులాల జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం మొదలైంది. మొదట రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల్లోని (ఓబీసీలు) 139 కులాల జనాభా విడివిడిగా ఎంతో తేల్చడానికి ఈ ‘జాతిగత జనగణన’ (హిందీలో వాడే ఈ మాటలే బాగున్నాయి. కాపు జాతి అనే ముద్రగడ పద్మనాభం గారిని ఈ హిందీ పదాలు గుర్తుచేస్తాయి) చేస్తారని అనుకున్నారు. ఇప్పుడు…

Read More
Optimized by Optimole