‘వ‌కీల్ సాబ్’ టీంకీ మ‌హేష్ బాబు అభినందనలు!

‘వ‌కీల్ సాబ్’ చిత్ర బృందంపై సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌శంసంల వ‌ర్షం కురిపించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. మూడేళ్ల త‌ర్వాత ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ చిత్రంతో ప‌వ‌ర్‌పుల్ క‌మ్‌బ్యాక్ ఇచ్చార‌న్నారు. ప్ర‌కాశ్ రాజ్ న‌ట‌‌న అద్బుత‌మ‌ని కొనియాడారు. అంజ‌లి, నివేద‌, అన‌న్యలు హృద‌యాన్ని హ‌త్తుకునేలా న‌టించార‌న్నారు. త‌మ‌న్ సంగీతం సినిమాకు మ‌రో ఎసెట్‌గా నిలిచింద‌న్నారు. టీం మొత్తానికి శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్ చేశారు.                 …

Read More

తృణ‌మూల్ కుట్ర‌లకు పాల్పడుతోంది : ప్ర‌ధాని మోదీ

బెంగాల్ నాలుగో ద‌శ అసెంబ్లీ ఎన్నిక‌లు రక్త‌సిక్త‌మ‌య్యాయి. శ‌నివారం కూచ్‌బెహార్ జిల్లాలో జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌ల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నిక‌ల విధుల్లో ఉన్న‌ పోలీసుల నుంచి స్థానికులు తుపాకులు లాక్కొనేందుకు ప్ర‌య‌త్నించడంతో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. శ‌నివారం ఉద‌యం పోలింగ్ ప్రారంభ‌మైన కొద్దిసేప‌టికి ఓట్లు వేయ‌డానికి వచ్చిన వారిపై కొంద‌రు రాళ్లు రువ్వార‌ని, భ‌ద్ర‌త బ‌ల‌గాల‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగార‌ని, త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో పోలీసులు కాల్పులు జ‌రిపిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాక కూచ్‌బెహార్ జిల్లాలోని మ‌రో…

Read More

బెంగాల్లో పీకే ఆడియో క‌ల‌క‌లం!

ప‌శ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ఆడియో క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ఆడియోలో కొంద‌రు జ‌ర్న‌లిస్ట్‌ల‌తో ఆయ‌న జ‌రిపిన సంభాష‌ణ‌ల సారాంశాన్ని బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల‌వీయ సోష‌ల్ మీడియాలో పొస్ట చేశారు.’ బెంగాల్‌లో మోదీకి జ‌నాద‌ర‌ణ ఉంది. ఆయ‌న్ని దేవుడిలా ఆరాధిస్తున్నారు. రాష్ట్రంలోని టీఎంసీకి వ్య‌తిరేకత అధికంగా ఉంది. ఓట్లు చీలిపోతున్నాయి. ద‌ళితులు, మ‌తువా ఓట్ల‌తో పాటు, క్షేత్ర స్థాయిలో ఆపార్టీ యంత్రాంగం పనితీరు బీజేపికి క‌లిసోస్తుంది….

Read More

పవన్ నటన అద్భుతం : మెగాస్టార్ చిరంజీవి

మూడేళ్లయినా తనలో వాడి వేడి ఏ మాత్రం తగ్గలేదని పవన్ ‘వకీల్ సాబ్’ తో నిరూపించాడని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి వకీల్ సాబ్ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ కం బ్యాక్ ఇచ్చారన్నారు. పవన్ నటన అద్భుతం.. ప్రకాష్రాజ్ నివేదాథామస్ అంజలి అనన్య వాళ్ళ పాత్రల్లో జీవించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినిమాటోగ్రాఫర్ వినోద్ సినిమాకు…

Read More

ఓటమి భయంతోనే దీదీ ఆరోపణలు : అమిత్ షా

ఓటమి భయంతోనే దీదీ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోవడం తధ్యమని షా జోస్యం చెప్పారు. నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా బెంగాల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు పోలింగ్ జరిగిన స్థానాల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని.. తృణమూల్ పార్టీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో…

Read More

‘పుష్ప’ డబ్బింగ్ స్టార్ట్ !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రూపొందుతున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా గా రాబోతున్న ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు . తాజాగా ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. ఈ మేరకు చిత్ర బృందం మంగళవారం కొబ్బరికాయ కొట్టి డబ్బింగ్ శ్రీకారం చుట్టారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. బన్నీ సరసన రష్మిక మందన నటిస్తుండగా, ప్రతినాయకుడి పాత్రలో మలయాళ ఫేం…

Read More

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ రాజీనామా!

మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అందజేశారు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆరోపణలపై ముంబై హై కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయమై ఎన్సీపి నేత మంత్రి నవాబ్ మాలిక్, అనిల్ రాజీనామా లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎన్సీపి పార్టీ అధ్యక్షుడు పవార్ సూచన…

Read More

కేసిఆర్ కు దళిత నేతలంటే ఎందుకు పడదు : బండి సంజయ్

సీఎం కేసీఆర్ కు దళిత నాయకులంటే ఎందుకు పడదని ? బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి , వర్ధంతి కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావడం లేదని ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. దళిత నేతల కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం…

Read More

మహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్..

కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వీకెండ్స్ లో(శుక్రవారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు) లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజా పరిస్థితులపై ఆదివారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. మీటింగ్ తర్వాత వీకెండ్ లాక్ డౌన్ పై ప్రకటన విడుదల చేసింది. ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప , మిగతా వాటిని నిషేధిస్తూన్నామని,అందరూ కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని, ప్రభుత్వం…

Read More

డ్రగ్స్ కేసులో నలుగురు తెలంగాణ ప్రజాప్రతినిధులు..

సంచలనం సృష్టించిన బెంగళూరు డ్రగ్స్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ప్రజాప్రతినిధులతో పాటు కొందరు సినీ ప్రముఖుల పేర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్కు చెందిన రతన్ రెడ్డి, కలహన్ రెడ్డి నోటీసులు అందజేసినట్లు, వారు త్వరలో విచారణకు హాజరుకానున్నట్లు తెలిసింది. మిగత వారికి త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు పోలీసుల వెల్లడించారు. దీంతో వారెవరు అన్నది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కాగా మత్తు పదార్ధాలకు సంబంధించి…

Read More
Optimized by Optimole