INCTelangana: ఎవుసానికి కాంగ్రెస్ భరోసా..!

Telangana: -బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు. ============== నూతన సంవత్సరం తొలివారంలోనే శుభవార్త విన్న తెలంగాణ రైతన్నలకు పది రోజుల ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చింది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎల్లప్పుడూ ముందుండే కాంగ్రెస్ అన్నదాతలకు మరింత భరోసా కల్పిస్తూ ‘రైతు భరోసా’ను ప్రకటించి మాది ‘రైతు ప్రభుత్వం’ అని మరోసారి నిరూపించుకుంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ‘రైతు రుణమాఫీ’ ‘వరికి బోనస్’ పథకాలను అమలుచేసిన కాంగ్రెస్ ఇప్పుడు…

Read More

RevanthReddy: పార్టీకి ఎజెండా సెట్ చేసిన సీఎం..!

INCTELANGANA: ‘తనదాకా వస్తే కాని తత్వం బోధపడదం’టారు. ఆ గ్రహింపు అన్ని స్థాయిల్లో కాంగ్రెస్ నాయకులకు రావాల్సిన అవసరముంది. సదరు అవసరాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుర్తించడమే కాదు అందరికీ నొక్కిచెప్పారు. ఏమైతేనేం, ఏడాది పాలన దాటాక ఆయన నోరు విప్పారు. ఎప్పుడో ఒకప్పుడు చెప్పక తప్పని నాలుగు మంచి మాటల్ని మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు కొందర్ని కూర్చోబెట్టుకొని చెబుతూ, వారి ద్వారా సమస్త కాంగ్రెస్ శ్రేణులకు కార్యాచరణ ప్రకటించారు….

Read More

Telangana: బీసీలపై చర్చకు సిద్ధమా కవితకు టీపీసీసీ చీఫ్ మహేష్ సవాల్..!

INCTELANGANA: బీసీల అభివృద్ధి కోసం పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రకటన విడుదల చేశారు. కవిత ధర్నా చేపట్టబోయే ముందు తాను సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని సవాల్ విసిరారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో బీసీలను వంచించడమే కాకుండా.. వారికి న్యాయంగా అందాల్సిన నిధులను ఖర్చు చేయకుండా నిట్టనిలువునా ముంచిందన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత…

Read More

Delhielection2025: ఆప్ కి అంత ఈజీ కాదు..!

AAP: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అర్వింద్ కెజ్రీవాల్ రాజకీయాలకు అగ్నిపరీక్ష రేపటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. 2025 ఆరంభంలో జరిగే ఈ ఎన్నికల తర్వాత, ఏడాది చివర్లో జరగాల్సిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు దేశంలో ఎన్నికలేవీ లేవు. కేంద్రంలోని ఎన్డీయే, ముఖ్యంగా కూటమి పెద్దన్న బీజేపీ తలపోస్తున్నట్టు ‘ఒక దేశం ఒక ఎన్నిక’ ఫలితంగా జమిలి ఎన్నికలు 2027లోనే జరిపేట్టయితే, ఇక 2026 లోనూ ఏ ఎన్నికలూ ఉండకపోవచ్చు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఢిల్లీ…

Read More

TSAT: యువతకు దిక్సూచి టీ-సాట్..!

T- SAT: సాంకేతికంగా దూసుకుపోతున్న నేటి యుగంలో టీ-సాట్ ఆధునిక టెక్నాలజీతో తెలంగాణలోని అన్నివర్గాలకు చేరువవడమే కాకుండా, ఒక వరంగా మారింది. ప్రస్తుత కాలంలో అన్ని అంశాలు సాంకేతికతతో ముడిపడి ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు, యువతకు, మహిళలకు, రైతులకు ఇలా అందరికీ టీ-సాట్ చేదోడుగా ఉంటుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో ఇంటింటికీ దగ్గరవుతుంది. ఆధునికానికి అనుగుణంగా టీ-సాట్ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని అన్ని రంగాల్లో విస్తరించేలా…

Read More

ManmohanSingh : మంచి పనుల్తో మాట్లాడిన మౌని..!

ManmohanSingh: పీవీ నర్సింహారావు దూరదృష్టి, సోనియాగాంధీ త్యాగం.. వెరసి, భారత దేశానికి కీలక సమయంలో పదేళ్లు ప్రధానమంత్రిగా లభించిన మానవతానేత మన్మోహన్సింగ్! ‘మాట్లాడరు, సొంత నిర్ణయాలు తీసుకోలేరు, టెన్ జన్పథ్ చేతిలో కీలుబొమ్మ’ లాంటి విమర్శలున్నా… ఎన్నో విషయాల్లో ఆదర్శనేత ఆయన. నిగర్వి, నిరాడంబరుడు, నిష్కళంకుడు, అన్నిటికీ మించి పక్కా నిజాయితీపరుడు. కష్టకాలంలో దేశాన్ని ఆర్థికంగా పునరుజ్జీవింపజేసిన సంస్కర్త. ఆర్బాటం లేకుండా దశాబ్దాల తరబడి దేశ గమనాన్ని నిర్దేశించే ఉపాధిహామీ, ఆహారభద్రత, సమాచారహక్కు, విద్యాహక్కు, భూసేకరణ-2013, కనీస…

Read More

ManmohanSingh: చేతల నేత డా.మన్మోహన్ సింగ్..!

INCTELANGANA:  నిజయితీకి, నిరాడంబరకు మారుపేరైన డా. మన్మోహన్ సింగ్కు తెలంగాణ రాష్ట్రానికి అవినాభావ సంబంధం ఉంది. ఆరు దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కల నెరవేర్చిన దేవుడు ఆయన. రాష్ట్ర ఏర్పాటులో ఎన్నో అడ్డకుంలు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ఏర్పాటులో భాగంగా ఎన్ని కష్టాలైన ఓర్పుతో సహించి మనకు రాష్ట్రం ఇచ్చిన డా.మన్మోహన్ సింగ్కు తెలంగాణ ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు. డా.మన్మోహన్ సింగ్ హయాంలో తెలంగాణ ఏర్పాటును ఒక కాంగ్రెస్ నేతగా,…

Read More

Telangana: అన్ని పండుగల్లా రైతు దినోత్సవాన్ని నిర్వహించుకోవాలి..!

Telangana:   జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా LTI Mind Tree Foundation సహకారంతో భవిష్య భారత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జాతీయ రైతుల దినోత్సవ వేడుకలను గట్టు మండలం, బలిగెర గ్రామంలో సమగ్ర గ్రామీణ అభివృద్ధి (IVDP) లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. బాలరాజు రాజారాం, డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ మాట్లాడుతూ.. రైతులకు ప్రత్యేకమైన పండుగగా జాతీయ రైతు దినోత్సవాన్ని నిర్వహించుకోవాలన్నారు. రైతులు, రసాయన ఎరువుల వాడకం తగ్గించి,…

Read More

Elections: ‘‘ఒక దేశం- ఒక ఎన్నిక’’పై.. ఒక మాట..!

OneNation- one election: ‘భిన్నత్వంలో ఏకత్వం’ భారత లక్షణమే కాదు, విలక్షణ సంపద అని పలుమార్లు రుజువైంది. ‘ఒక దేశం ఒక ఎన్నిక’ ఉద్వేగ నినాదంగా బాగున్నంత, ఆచరణ గొప్పగా ఉంటుందనే నమ్మకం లేదు. ఇందులో పలు సమస్యలున్నాయి. దేశంలో రావాల్సిన ఎన్నికల సంస్కరణల్లో ఇదంత ప్రాధాన్యతాంశమేం కాదు! అంతకన్నా ప్రాధాన్యతగల అంశాలెన్నో దిక్కూ-దివాణం లేక ప్రజాస్వామ్యమే వెనుకడుగులోకి జారుతోంది. ముందా సంస్కరణలు ముఖ్యం. పదేళ్ల బీజేపీ, ‘తరచూ వాదనలు మార్చే’ (షిఫ్టింగ్ న్యరేటివ్స్) ఒరవడిలో భాగంగా…

Read More

Telangana: పెరిగిన ఎరువుల ధరలను తగ్గించాలి: రైతు సంఘం మండల అధ్యక్షులు తుమ్మల సత్యనారాయణ

Atmakur: పెరిగిన ఎరువుల ధరలను తగ్గించాలని ఆత్మకూరు రైతు సంఘం మండల అధ్యక్షులు తుమ్మల సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆత్మకూరు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కందడి వెంకట్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా తుమ్మల సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం ఎరువుల ధరలను అడ్డగోలుగా పెంచి రైతుల పై మోయలేని భారాలు పెట్టీ రైతుల నడ్డి విరుస్తుందని…

Read More
Optimized by Optimole