SheikhHasina: ‘రజాకార్లు’ అన్నందుకే హసీనాను తరిమికొట్టారు..!

Nancharaiah merugumala senior journalist:  ‘రజాకార్లు’ అన్నందుకే హసీనాను బాంగ్లా యువకులు ఇండియా తరిమికొట్టారు..హైదరాబాదైనా ఢాకా అయినా రజాకార్‌ అనేది ఇప్పుడు బూతు మాటే! 1940ల చివర్లో నాటి హైదరాబాద్‌ స్టేట్‌లోని తెలంగాణ ప్రాంతంలో ‘రజాకార్లు’ అంటే నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ పాలనకు మద్దతుగా నిలిచిన కిరాయి ముస్లిం సాయుధ గూండాలు. వారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పనిచేశారు. నిజాం పోలీసులను, పాలనను నిరసించిన ముస్లింలను సైతం రజాకార్లు వదలలేదు….

Read More

wayanadlandslide: వ‌య‌నాడ్ విషాదం.. ‘డార్లింగ్’ భారీ విరాళం..!

Prabhas:  రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. కేర‌ళలోని వ‌యనాడ్ విషాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయ‌న‌ భారీ విరాళం ప్ర‌క‌టించారు. వ‌య‌నాడ్ బాధితుల స‌హ‌యార్థం కేర‌ళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 2 కోట్ల విరాళం ఇస్తున్న‌ట్లు ప్ర‌భాస్ టీం సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపింది. దీంతో ప్ర‌భాస్ అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ.. డార్లింగ్ మ‌న‌సు బంగారం అంటూ  కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అటు సినీఅభిమానులు సైతం గొప్ప మ‌న‌సు చాటుకున్న‌ ప్ర‌భాస్…

Read More

Tenali: జగనన్న కాలనీల్లో జగమంత అవినీతి: నాదెండ్ల మనోహర్

Nadendlamanohar: ‘ప్రజా ధనాన్ని కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడానికే గత పాలకులు జగనన్న కాలనీల పథకం తీసుకొచ్చారు తప్ప పేదలకు మేలు చేయడానికి కాద’ని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్లనూ, గృహ నిర్మాణంలోనూ భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. రైతుల నుంచి ఎకరా కోటి రూపాయలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి నాలుగైదు రెట్లు ఎక్కువకు విక్రయించి భారీగా ప్రజాధనాన్ని లూటీ చేశారని చెప్పారు. ప్రజా ధనాన్ని దోచుకున్న…

Read More

Keralalandslide: వయనాడ్ విపత్తు వేళ రాకీయాలు అవసరమా రాహుల్ అండ్ ప్రియాంక..?

Nancharaiah merugumala senior journalist: వయనాడ్‌ విషాదానికి, రాజీవ్‌ చావుకూ ఏమైనా పోలిక ఉందా?నరేంద్రమోదీని మించిపోయిన అన్నాచెల్లెళ్ల ‘భావోద్వేగాలు’! ‘‘కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన వయనాడ్‌ బాధితులను చూస్తే..నా తండ్రి మరణించినప్పుడు నేను ఎలాంటి బాధ అనుభవించానో అలాంటి నొప్పి ఇప్పుడు నాకు కలుగుతోంది,’’ గురువారం చెల్లెలు ప్రియాంకా వాడ్రాతో కలిసి కేరళలో తన పూర్వ లోక్‌సభ నియోజవర్గంలోని ప్రాంతాలను సందర్శించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్న మాటలివి.‘‘నా అన్నకు కలిగిన బాధే…

Read More

Reservations: ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల మీద ఏడుపు – కొన్ని నిజాలు ..!!

విశీ (వి.సాయివంశీ):    మనకు తెలిసి కొన్నిసార్లు, తెలియక ఇంకొన్నిసార్లు మనలో కొన్ని భ్రమలు పేరుకుపోతాయి. అవే వాస్తవాలు అనిపిస్తాయి. అవి అబద్ధాలని తెలిసినా ఒప్పుకోలేని స్థితికి మనల్ని చేరుస్తాయి. ఆ భ్రమలే నిజాలన్న నమ్మిక మనలో ఏర్పరుస్తాయి. ఏ సామాజిక సర్వేలు చూడక, ఏ సాంఘిక జీవనాన్ని పరిశీలించక ఆ ఊహల్లోనే బతకడం నేర్పిస్తాయి. కానీ నిజం నిప్పు లాంటిది. నివురును చీల్చుకుంటూ బయటికి రాక తప్పదు. సుధామూర్తి గారి ‘మాంసాహార ఛాయిస్’పై చర్చ జరుగుతోంది….

Read More

KCR: కేసీఆర్ 3.0

KCR: కేసీఆర్ కోలుకున్నట్టున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున ఒంటికి తగిలిన గాయం నుంచి ఇదివరకే కోలుకున్నా, రాజకీయ గాయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టున్నారు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలకు ఇప్పుడొక గట్టి హెచ్చరిక నోటీస్ జారీ చేశారు. ఇరువురికీ సమదూరం పాటించే పోరాట రాజకీయ పంథా ప్రకటించారు. విషాన్ని గొంతుకలో నిలుపుకున్న గరళకంఠుడ్ని అని చెబుతూ.. ఏ క్షణాన్నయినా బద్దలయే అగ్నిపర్వతంలా ఉన్నానన్నారు. లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైళ్లో ఉన్న కూతురు కవిత పరిస్థితిపై…

Read More

Haryana2024: హర్యానాలో కాంగ్రెస్ కే స్వల్ప ఆధిక్యత.. పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి..!

Haryanaelections2024:  ఇక హర్యానా హాట్ కేకే! అసెంబ్లీ పోటీ రసవత్తరంగా మారనుంది. అధికారం తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటున్న బీజేపీకి పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత రూపంలో ఎదురుగాలి కొడుతోంది. దాన్ని సొమ్ము చేసుకొని హర్యానాలో మళ్లీ పాగా వేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో ‘ఇండియా కూటమి’ పొందిన ప్రజామద్దతును నిలబెట్టుకుంటే, అధికార మార్పిడి సునాయాసంగానే జరుగొచ్చు. కానీ, కూటమి భాగస్వాములైన కాంగ్రెస్- ఆమ్ఆద్మీపార్టీ (ఆప్)లు ఈ సారి విడిగా పోటీ చేస్తుండటం వల్ల బీజేపీ రొట్టె విరిగి…

Read More

Telangana: గాడిద గుడ్డు పేరుతో బిజేపి పై కాంగ్రెస్ ఎటాక్..వినూత్న నిరసన..!

In Telangana: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో బ్యానర్లు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఇటీవలి బడ్జెట్ లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు అంటూ వినూత్న రీతిలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది. అయితే 8 ఎంపీ సీట్లు…

Read More

Unionbudget2024 : బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత హర్షణీయం: నాదెండ్ల మనోహర్

NadendlaManohar: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడాన్ని జనసేన పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15వేల కోట్లు కేటాయించడం, రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్రం ప్రకటించడంపై జనసేన పార్టీ శాసనసభ పక్షం తరఫున కృతజ్ఞతలు తెలిపారు….

Read More

Bandisanjay: జోడెద్దుల మాదిరి అభివృద్ది, సంక్షేమం సమపాళ్లలా బడ్జెట్ రూపకల్పన: సంజయ్

Budget 2024: జోడెద్దుల మాదిరిగా అభివృద్ది, సంక్షేమం సమపాళ్లలో ఉండేలా ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం గొప్ప బడ్జెట్ ను రూపొందించిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు బడ్జెట్ ప్రతీకగా ఉందన్న ఆయన.. 2047 నాటికి ఆర్దిక ప్రగతిలో భారత్ ను నెంబర్ వన్ గా చూడాలనే మోదీ విజనరీని సాకారం చేసే దిశగా బడ్జెట్ ను రూపకల్పన జరిగిందన్నారు. బడ్జెట్ లో ఏకంగా 11 లక్షల 50…

Read More
Optimized by Optimole