కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల…

inctelangana:2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో ను శుక్రవారం నాడు విడుదల చేసింది. గాంధీ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ముఖ్యఅతిథిగా పాల్గొని మ్యానిఫెస్టో ను విడుదల చేసారు. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు చైర్మన్ మేనిఫెస్టో రూపొందించారు.టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.అభయహస్తం.. మేనిఫెస్టో పేరుతో ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం అంటూ 37 అంశాలతో…

Read More

ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల పోరు …

ఎన్నికలకు ఏడాది ముందరే  పొత్తుల పొద్దు పొడుస్తోంది. రణానికి నగారా ‘రణస్థలం’ నుంచి మోగించారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌! ఎన్నికలకు ఇంకా పదహారు నెలల కాలం ఉంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన ‘యువశక్తి’ సభావేదిక నుంచి, ఒంటరి పోరుకు బలం చాలదనే పొత్తుకు సన్నద్దమౌతున్నట్టు పవన్‌ ప్రకటించారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పొత్తుకు మౌలికంగా జనసేన సంసిద్దమే అని సంకేతాలు ఈ వేదిక నుంచి వెలువడ్డాయి. పొత్తు ఏదైనా ‘గౌరవప్రదంగా’ ఉండాలనే ఒక షరతును…

Read More

టీ 20సీరీస్ భారత్ కైవసం!

శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్​ను భారత్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన రెండో టి 20 మ్యాచ్​లో టీమ్​ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగులుండగానే సీరీస్ సొంతం చేసుకుంది. కాగా అంతకుముందు టాస్ గెలిచిన భారత్.. లంక జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. నిస్సంక హాఫ్ సెంచరీతో (75)రాణించాడు. ఇండియా బౌలర్లలో భువనేశ్వర్, చాహల్, హర్షల్ పటేల్,…

Read More

Bandisanjay:కేటీఆర్ కండకావరంతో కన్నుమిన్నూ కానకుండా మాట్లాడుతున్నారు: బండి సంజయ్

Bandisanjay:  పార్లమెంట్ లో తాను ఏనాడూ మాట్లాడలేదని, ఒక్క పైసా తీసుకురాలేదంటూ కేటీఆర్ పచ్చి అబద్దాలాడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. కేటీఆర్ కు కళ్లు దొబ్బాయని, ఒక్క పార్లమెంట్ రికార్డులు చూసుకోవాలని సూచించారు. పార్లమెంట్ లో నిరంతరం వినోద్ కుమార్ మాట్లాడారని కండకావరమెక్కి మాట్లాడుతున్న కేటీఆర్… మరి వినోద్ కుమార్ సాధించేదేమిటో చెప్పాలన్నారు. కరీంనగర్- జగిత్యాల, కరీంనగర్–వరంగల్, ఎల్కతుర్తి – సిద్ధిపేట రోడ్ల విస్తరణకు నిధులెందుకు తేలేదని ప్రశ్నించారు. ఆయా…

Read More

నిమ్మగడ్డ బది’లీలలు’

అమరావతి: ప్రభుత్వంపై పోరాడి ఎట్టకేలకు తాను అనుకున్నట్లే గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వ అధికారుల బదిలీల విషయంలో ఎన్నికల కమిషనర్ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొత్త ఓటర్లతో కూడిన ఓటరు జాబితాను రూపొందించడంలో అలసత్వం వహించారని ఆరోపిస్తూ.. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సెక్రటరీ గిరిజా శంకర్ లను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ప్రధాన…

Read More

ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్!

ఐపీఎల్ 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్ జట్టు నిలిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా లీగ్లో అడుగుపెట్టిన గుజరాత్ జట్టు ఫైనల్ చేరి .. అదే ఊపులో కప్పుకొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఇక ఐపీఎల్ ఆరంభ సీజన్లో టైటిల్ కొట్టిన రాజస్థాన్.. ఇంత కాలానికి ఫైనల్లో అడుగుపెట్టిన నిరాశే ఎదురైంది. ఈ సీజన్లో రాజస్థాన్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ (863) పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవగా.. ఆ జట్టు బౌలర్‌ యుజువేంద్ర చాహల్‌ (27)…

Read More

IPL2025: ఆట అంటే గెలుపేనా…?

 ఆర్.దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): పొట్టి క్రికెట్ పోటీ పండుగ ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ IPL సందడి మొదలైంది. 18వ తాజా ఎడిషన్ క్రీడాభిమానులకు కన్నుల పండుగే! వేలాది మండి స్టేడియాలలో క్రిక్కిరుస్తుంటే కొన్ని కోట్ల మంది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్నారు. ఇక ల్యాప్-టాప్ లు, ట్యాబ్ లు, మొబైల్ లలో చూడ్డం సరేసరి! అప్పుడూ ఇప్పుడూ క్రికెట్ ఆడటం కొన్ని దేశాలకే పరిమితమైనా… ఫుట్ బాల్ తర్వాత అంతగా ప్రపంచ జనావళిని ఆకట్టుకుంటున్న…

Read More

పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్ ప్రశాంతంగా ముగిశాయి: ఎస్పీ రెమా రాజేశ్వరి

 నల్లగొండ: ఎస్సై, కానిస్టేబుల్  దేహదారుడ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి అయ్యాయాని జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి  పేర్కొన్నారు.రాష్ట్ర పోలీసు నియామక మండలి నియమాల ప్రకారం  ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా..పూర్తి సాంకేతికత పరిజ్ఞానంతో  పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం  జరిగిందన్నారు. జిల్లా పోలీస్ అధికారులు..సిబ్బంది.. ఇతర సాంకేతిక నిపుల సహకారంతొ ప్రశాంతంగా దేహదారుఢ్య (ఫిజికల్ టెస్ట్స్) పరీక్షలు ముగిశాయని ఎస్పీ వెల్లడించారు. ఇక మొత్తం 26 వేల 433 మంది అభ్యర్థులకు గాను.. 23 వేల 524 మంది…

Read More
Optimized by Optimole