ఇంకా నాలుకెక్కని బిఆర్‌ఎస్‌ ….

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) దేశం మొత్తానికి విస్తరించే లక్ష్యంతో భారతరాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) గా రూపాంతరం చెందింది. అధికారికంగా పేరు మారిన దృష్ట్యా విషయాన్ని ఎన్నికల సంఘానికి, లోక్‌సభ, శాసనసభా స్పీకర్‌ కార్యాలయాలకు, ఇతరత్రా అందరికీ తెలియజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల శ్రేణులు దాటి పేరు ప్రజల్లోకి వెళుతున్న క్రమం ఇది. పేరు మార్పు ఎంతగా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళింది? అంతకన్నా ముందు పార్టీ నాయకుల్లో, కార్యకర్తల శ్రేణుల్లో కొత్తపేరు (బిఆర్‌ఎస్‌) ఎంతగా మెదళ్లలో నాటుకుంది …?…

Read More

యాదాద్రిలో భారీ స్వాగత తోరణం..

యాదాద్రిలో భారీ తోరణం ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. పంచనారసింహుల ఆలయ వైభవానికి అనుగుణంగా భారీ స్వాగత తోరణం వచ్చే ఫిబ్రవరిలో వార్షిక బ్రహ్మోత్సవాల్లోపు ఆవిష్కృతం కానున్నట్లు సమాచారం. కొండపైకి వెళ్లే కనుమదారులను కలుపుతూ వాటి మధ్య 40 అడుగుల ఎత్తు.. 40 అడుగుల వెడల్పుతో ఈ తోరణానికి అధికారులు రూపకల్పన చేశారు.స్వాగత తోరణం కుడివైపున రక్షణ గోడపైన ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో దివ్య విమాన రథోత్సవం సాదృశ్యమయ్యేలా ఐరావతం, తీర్ధజనుల దృశ్యాలను తోరణంలో తీర్చిదిద్దారు….

Read More

మత్స్యకారులకు ఎల్లవేళలా జనసేన అండగా ఉంటుంది: నాదెండ్ల మనోహర్

ఉత్తరాంధ్ర ప్రాంతంపై జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. విద్య, వైద్యం, వలసల నిరోధం, ఉద్యోగ, ఉపాధి కల్పన వంటి అంశాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో చిన్న చిన్న అవసరాల కోసం కూడా దేహీ అంటూ అడుక్కునే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి శంకుస్థాపనలకే పరిమితమైందన్న ఆయన..రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రజల్లో మార్పు రావాలని వ్యాఖ్యానించారు.  ఇక…

Read More

పతనం అంచున పోలీస్ ప్రభుత్వం: ఎంపీ రఘురామ

ఏపీలో ప్రభుత్వం మారితే..ఇంతకంటే గొప్పగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు. రాష్ట్రంలోని ప్రజలకు.. రాజ్యాంగంలో 14 నుంచి 22వ అధికరణ లో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు అమలు కావాలంటే.. వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోవాలన్నారు. ఎలుకల్లా అధికారంలోకి వచ్చినవారు.. పందికొక్కుల్లా మారి  ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. పతనం అంచున  పోలీస్ ప్రభుత్వం.. పతనం అంచుల్లో ఏపీ పోలీసు ప్రభుత్వం ఉందని…

Read More

పెళ్లి కొడుకును లారీలో మండపానికి తీసుకొచ్చిన వధువు ..వీడియో వైరల్ ..!!

కేరళలోని త్రిసూర్ లో అరుదైన ఘటన జరిగింది . ఓ యువతి నిశ్చితార్థం చేసుకోబోయే యువకుడ్ని లారీ నడుపుకుంటూ చర్చికి తీసుకెళ్లింది. ఈ ఘటన చూసి నిశ్చితార్థ వేడుకకు వచ్చిన అతిథులందరూ ఆశ్యర్యపోయారు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. త్రిసూర్ జిల్లాలోని మానలూరుకు చెందిన దలీషా అనే యువతికి చిన్నప్పుటి నుంచి లారీ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. తండ్రి డేవిస్…

Read More

నిజామాబాద్ బాక్సర్ నిఖత్ ను సన్మానించిన తెలంగాణ కాంగ్రెస్..

అర్జున పురస్కార గ్రహీత నిజామాబాద్ కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ ను తెలంగాణ కాంగ్రెస్ సన్మానించింది. అనంతరం 5 లక్షల రూపాయలను క్రీడాకారిణికి బహుమతిగా అందించారు. అప్పుడు సానియా మీర్జా.. ఇప్పుడు నిఖత్ చొరవచూపి క్రీడలల్లో రాణించడం అభినందనీయమన్నారు PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాబోయే ఒలింపిక్ క్రీడలల్లో కూడా నిఖత్ విజేతగా నిలిచి దేశ ప్రతిష్ఠను పెంచాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ లో నిఖత్ … స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసుకోవడానికి స్థలాన్ని కేటాయించి.. నిర్మాణానికి…

Read More

ప్రతిపక్ష నేతల్ని అడ్డుకునేందుకు వైసీపీ చీకటి జీవోను తీసుకొచ్చింది: పవన్ కల్యాణ్

వైసీపీ ప్రభుత్వం  తీసుకొచ్చిన జీవో 1 పై ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.  ప్రతిపక్ష నేతల్ని  అడ్డుకునేందుకు బ్రిటీష్ కాలం నాటి చీకటి జీవోను సీఎం జగన్ అమల్లోకి తెచ్చారని మండిపడ్డారు.  ఓటమి భయంతోనే వైసీపీ దుందుడుకు చర్యలకు దిగుతూ.. ఇలాంటి చెత్త జీవోలు తీసుకువస్తోందన్నారు. సీఎం జగన్ అరాచక విధానాలపై ఏ విధంగా సంయుక్త పోరాటాలు చేయాలనే అంశం మీద టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చించినట్టు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్య…

Read More
Optimized by Optimole