Headlines

ఐపీఎల్2022లో బోణీ కొట్టిన రాజస్థాన్ రాయల్స్!

ఐపీఎల్​ 15 వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి మ్యాచ్లో బోణీ కొట్టింది. బుధవారం సన్​రైజర్స్​ హైదరాబాద్​ తో జరిగిన పోరులో రాజస్థాన్ జట్టు 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు.. నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ సంజూ శాంసన్‌ (55) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడు దేవ్‌దత్‌ పడిక్కల్, జోస్‌ బట్లర్…

Read More

పూనమ్ పై విచక్షణ రహితంగా దాడి చేసిన భర్త.. అసలు ఏం జరిగింది..?

బాలీవుడ్లో బోల్డ్ హీరోయిన్ పూనమ్ పాండే మరోసారి వార్తల్లో నిలిచారు. తన భర్త సామ్ అహ్మద్ శారీరకంగా వేధిస్తున్నాడని ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సామ్ పై గృహా హింస కింద కేసు నమోదు చేశారు. కాగా బాలీవుడ్లో బోల్డ్ సినిమాలతో పాపులర్ అయిన పూనమ్ ..సామ్ తో డేటింగ్ అనంతరం సెప్టెంబర్ 9 న వివాహ బంధం తో ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం ఓ సినిమా షూటింగ్ కోసం గోవా వెళ్లిన…

Read More

అరిషడ్వర్గాలు వివరణ!

కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను  అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు కంటికి కనిపించని శత్రువులు వీటిని జయిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. వివరణ : 1. కామము – ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన అతిగా ప్రతిదీ కావలనే కోరికలు కలిగి యుండడము. 2. క్రోధము – కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని భావించడం ఇతరులను నిందించడం వారిపై…

Read More

BJPTELANGANA: తెలంగాణ బీజేపీలో మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి చేరికపై రచ్చ..

BJPTELANGANA:  సెల్ఫ్ గోల్ కొట్టడంలో తెలంగాణ బీజేపీ నేతలు దిట్ట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకొని  చచ్చి చెడి 8 స్థానాలను  గెలుచుకున్నారు.  ప్రస్తుతం దేశమంత  ప్రధాని మోదీ చరిష్మా..  రామమందిర ప్రాణ ప్రతిష్టతో  బీజేపీ గాలి వీస్తోంది.  ఈతరుణంలో అందివచ్చిన  సువర్ణవకాశాన్ని క్యాష్ చేసుకోవడంలో మాత్రం  తెలంగాణ బీజేపీ నాయకత్వం తడబడుతోంది. దీనికి తోడు  సొంత పార్టీ నేతలపై  దాడులు చేయించిన నేతలను పార్టీలో చేర్చుకోవడంపై  సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  దీంతో అసెంబ్లీ…

Read More

పాత్రికేయుడు దిలీప్ రెడ్డికి దేవులపల్లి రామానుజరావు పురస్కారం

Hyderabad: ప్రముఖ పాత్రికేయుడు ఆర్ దిలీప్ రెడ్డికి 2023 సంవత్సరానికి డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పురస్కారాన్ని అందజేయాలని తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్ణయించింది. నాటి ఆంధ్ర సారస్వత పరిషత్తు కు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా, కవిగా, విమర్శకునిగా, శోభ పత్రిక సంపాదకునిగా విశేష సేవనందించిన దేవులపల్లి రామానుజరావు పేరుతో పురస్కారాన్ని ఏటా పరిషత్తు అందజేస్తున్నది. ఈ సంవత్సరం పురస్కారానికి ఎంపికైన దిలీప్ రెడ్డి మెదక్ జిల్లాకు చెందినవారు. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వివిధ హోదాల్లో సేవలు…

Read More

Tollywood: తెలుగు సినిమాల్లో ‘ఫోర్‌ప్లే’ గురించి మాట్లాడే సందర్భాలు రావచ్చేమో..?

Nancharaiah merugumala senior journalist: ‘ఫోర్‌ప్లే’ లేకుండా చేస్తే ఆడవాళ్లకు ‘పెయిన్‌’ అని ఒక తమిళ సినిమాలో ఐశ్వర్యా రాజేష్‌ తన భర్తకు చెప్పినట్టు మరో నూరేళ్లకైనా తెలుగు సినీ నాయిక మాట్లాడుద్దా? ‘ తమిళ పాప్యులర్, కమర్షియల్‌ ’సినిమాల్లో కులం ప్రస్తావనల గురించి మన పాత్రికేయ మిత్రుడు జీఎస్‌ రామ్మోహన్‌ ఈరోజు ‘మహారాజా’ అనే తమిళ అనువాద తెలుగు సినిమా గురించి రాసిన సందర్భంలో నాకు నచ్చిన విషయం చెప్పాడు. ఈ కులాల విషయంలో–‘‘ తమిళులు…

Read More

కేసీఆర్, జగన్మోహన్రెడ్డి జమానా… అవినీతి ఖజానా : గోనె ప్రకాశరావు

” తెలుగు రాష్ట్రాల్లో పాలన తీరు తెన్నులు, ముఖ్యమంత్రుల పనితీరుపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఇరు రాష్ట్రాల సీఎంలకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు ఉన్నది ఉన్నట్టుగా “ నిజాయితి పాలన అందిస్తామని, అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా పరిపాలిస్తామని ముఖ్యమంత్రులుగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత మీరు నమ్మబలికారు. మీ పాలన చూసిన తరువాత మీ మాటలు నీటి మీద ” రాతలుగానే మిగిలిపోయాయన్నది స్పష్టమౌతోంది. తెలంగాణలో ఏడున్నర సంవత్సరాల పరిపాలనలో,…

Read More

Parasite: బడుగు జీవుల బతుకు అద్దంపట్టే ఓ జీవధార ‘ ప్యార సైట్ ‘..

సాయి వంశీ ( విశీ):  ప్యారసైట్ సినిమా ఇవాళే చూశా. ఇంతకు ముందే చాలా మంది చూసేశారు. రాయాల్సిందంతా రాశేశారు. నేను కొత్తగా ఏం రాయాలి? ఉన్నది.. అనిపించింది రాయాలి. ప్యారాసైట్ చూస్తున్నంతసేపూ నాకు ‘జీవధార’ గుర్తొచ్చింది. ఎక్కడిదీ మాట? ఏంటసలా జీవధార? కథ:  కాళీపట్నం రామారావు గారు 1971లో రాసిన కథ. చిన్న కథ. కొండంత అర్థాన్ని నింపుకున్న కథ. పేదవాళ్ల పాకలన్నీ ఓ చోట చేరిన వాడ. అక్కడ అందరూ బడుగు జీవులే! ఎర్రటి…

Read More

ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ పై చర్చ!

రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్​ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్ర కేబినెట్​ మంత్రులతో పాటు సుప్రీంకోర్టు జడ్జిలు, పాత్రికేయులు, ఆర్​ఎస్​ఎస్​ నేతల ఫోన్లను ఇజ్రాయెల్​కు చెందిన పెగాసుస్‌ స్పైవేర్‌ సంస్థ ట్యాపింగ్​ చేసినట్లు అంతర్జాతీయ పత్రికలు ప్రచురించినట్లు వదంతులు వస్తున్నాయి. ఇది నిజమైతే.. ఆ జాబితాను తాను విడుదల చేస్తానని స్వామి ట్వీట్ చేయడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. పెగాసుస్ స్పైవేర్​ ద్వారా గుర్తు తెలియని సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తల సమాచారాన్ని…

Read More

జనవరి 26 నుంచి పాదయాత్ర : గిడుగు రుద్రరాజు

ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు జనవరి 26వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వైఖరికి నిరసనగా  పాదయాత్ర నిర్వహించనున్నట్లు మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సామాన్య కార్యకర్తకు గొప్ప హోదా కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. నూరేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ విధానాలే మౌలిక మార్పులు చేసుకుంటూ నేటికీ అమలవుతున్నాయన్నారు. కాంగ్రెస్ పెద్దలందరితో కలిసి పనిచేసిన అనుభవం కలిగిన తాను…..

Read More
Optimized by Optimole