కొత్తగా క్రీమ్ ఫంగస్ వెలుగులోకి!

కరోనా సెకండ్ వేవ్ కి తోడు ఫంగస్ లు జనాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న బ్లాక్.. వైట్..ఎల్లో ఫంగస్ జాబితాలో.. తాజాగా క్రీమ్ ఫంగస్ చేరింది. మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లో ఒక క్రీమ్​ ఫంగస్ కేసు వెలుగుచూసింది. అయితే.. బ్లాక్​, వైట్​ ఫంగస్​ల కంటే ఇది ప్రమాదకారి కాదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జబల్​పుర్​లో దాదాపు 150 మంది శీలీంద్ర వ్యాధుల కారణంగా ఆసుపత్రిలో చేరారు. వీరికీ జబల్​పుర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 100 మంది చికిత్స…

Read More

కోవిడ్ ను జయించాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వైరస్ బారినుంచి కోలుకున్నాక శరీరం నుంచి వైరస్ పూర్తిగా పోయినట్లేనా? వైద్యుల చెబుతున్న సలహా ఏమిటి? వైరస్ పోవాలంటే ఎటువంటి వ్యాయామాలు చేయాలి? కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజువారీ కేసులు సంఖ్య ఎక్కువగానే నమోదవుతున్న.. కోలుకున్న వారి సంఖ్య కూడా ఆ స్థాయిలోనే ఉంది. వైరస్ నుంచి కోలుకున్నాక దాని ప్రభావం శరీరంలో కొంతకాలం ఉంటుందని వైద్యులు చెపుతున్నారు. 3 నెలల పాటు…

Read More

“వైశాఖ పూర్ణిమ”..

వైశాఖ బుద్ధ పూర్ణిమనే మహా వైశాఖ అంటారు. ఈరోజు మహావిష్ణువు కూర్మావతారం దాల్చిన రోజని పురాణాలు చెబుతున్నాయి. తద్వారా జనులందరూ మహావిష్ణువును ఆరాధిస్తారు. ఈరోజున దానం చేస్తే పాపాలు తొలగిపోతాయని.. ఆధ్యాత్మిక సాధనలు చేసిన విశిష్టమైన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. వైశాఖ పూర్ణిమ నాడు ఉపవాసం సత్యనారాయణ వ్రతం , సంపత్ గౌరీ వ్రతం, దాన ధర్మాలు చేస్తారు. శక్తిని బట్టి కష్టకాలంలో ఉన్నవారికి సహాయం చేస్తే సరిపోతుంది. కుటుంబ ఆచారాలను బట్టి ఈరోజున వ్రతాలు…

Read More

ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్!

ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్. కరోనాతో అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ ను తిరిగి నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ రెడీ చేస్తోంది. మిగతా మ్యాచ్ ల్ని సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ సీజన్‌లో ఇంకా 31 మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో మిగిలిన మ్యాచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. 21 రోజుల షెడ్యూల్‌తో ఆ తర్వాత జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది. సెప్టెంబర్‌…

Read More

కరోనాతో చనిపోయిన వ్యక్తి లో వైరస్ ఎంతసేపు ఉంటుంది..?

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. సమాజంలో మానవ సంబంధాలను ప్రభావితం చేస్తోంది. ఎవరైనా కరోనాతో చనిపోతే సొంత కుటుంబ సభ్యులే చూడలేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో అందరినీ తొలి చేస్తున్న ప్రశ్న.. చనిపోయిన వ్యక్తిలో కరోనా ఎంతసేపు సజీవంగా ఉంటుంది? ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునేందుకు ఎయిమ్స్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ ఫోరెన్సిక్ మెడిసిన్ గతఏడాది కాలంగా అధ్యయనం చేసింది. అధ్యయన ఫలితాలను వెల్లడించిన ఎయిమ్స్‌ ఫొరెన్సిక్‌ చీఫ్‌ డాక్టర్‌ సుధీర్‌ గుప్త.. అందులో దాగున్న ఆసక్తికర…

Read More

నృసింహ జయంతి!!

నృసింహ జయంతి అంటే ఏమిటి..? ఎందుకు ఈ వేడుకను జరుపుకుంటారు..? ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్ నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యుర్నమామ్యహమ్ విష్ణుమూర్తి యొక్క దశావతారాలలోని 4వ అవతారమే నరసింహస్వామి. నృసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్ధతి నాడు జరుపుకొంటారు. నరసింహస్వామి రూపంలో దేహం మానవ రూపం, తల సింహం రూపంలో అవతరించిన దేవుడు.నృసింహస్వామి మాహా శక్తి వంతమైన దేవుడు. ఈ రోజున విష్ణుమూర్తి హిరణ్యకశిపుడిని సంహరించి, ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి నృసింహ జయంతిని వేడుకగా…

Read More

కలవరపెడుతున్న ఎల్లో ఫంగస్!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కి తోడు ఫంగస్లు కలవరపెడుతున్నాయి. తాజాగా ఉన్నటువంటి బ్లాక్ ఫంగస్.. వైట్ ఫంగస్ జాబితలోకి ఎల్లో ఫంగస్ చేరింది. యూపీ ఘజియాబాద్ లో మొదటి ఎల్లో ఫంగస్ కేసు ఒకటి నమోదయ్యింది. అయితే మొదటి రెండు ఫంగస్ల కంటే ఈ ఎల్లో ఫంగస్ ఇంకా డేంజర్ అని నివేదికలు చెబుతున్నాయి. దీంతో కరోనాతో అల్లాడుతున్న జనాలు వెన్నులో ఇప్పుడు వణుకు మొదలయ్యింది. బద్ధకంగా ఉండడం, బరువు తగ్గడం, తక్కువ ఆకలి లేదా…

Read More

ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!

ప్రకాశ జిల్లా ఒంగోలు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ లో 12 మందికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 13 ఏళ్ల క్రితం ఏడుగురు డ్రైవర్లునుు.. క్లీనర్లు ను హత్య చేసిన కేసులో నిరూపితం కావడంతో మున్నా టీమ్ సభ్యులందరికీ మరణదండన విధించింది. నేరాలు వెలుగులోకి వచ్చాయిలా.. పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌ నుంచి 21.7 టన్నుల ఇనుప రాడ్లతో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్‌ అదృశ్యమయ్యారంటూ 2008…

Read More

తుఫాన్ హెచ్చరిక !

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం ఉదయం వాయుగుండంగా మారింది. సాయంత్రానికి ఇది పోర్ట్‌బ్లెయిర్‌కి ఉత్తర వాయువ్యదిశగా 590 కి.మీ, పారాదీప్‌కి దక్షిణ ఆగ్నేయంగా 570 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం అర్థరాత్రికి తీవ్ర వాయుగుండమై, సోమవారం మరింత బలపడి తుపానుగా మారనుందని, ఆ తర్వాత 24 గంటల్లో క్రమంగా అతి తీవ్ర తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారులు ప్రకటించారు. ఈ నెల 26…

Read More

‘ఆసియా కప్’ టోర్నీ రద్దు!

శ్రీలంకలో జరగనున్న ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్ రద్దయింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా బుధవారం ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్నందున టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదని శ్రీలంక క్రికెట్ చీఫ్ యాష్లే డిసిల్వా  పేర్కొన్నారు.  2023లో వన్డే ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత ఆసియా కప్ టోర్నీ నిర్వహించాలని బోర్డు ఆలోచనలో ఉందని తెలిపాడు. మరోవైపు ఈ విషయంలో బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. వాస్తవానికి ఈ ఏడాది టోర్నమెంట్‌ పాకిస్థాన్‌లో…

Read More
Optimized by Optimole