దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి : బండి సంజయ్

బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరిస్తూన్న తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హుజర్నగర్ గుర్రంబోడు గిరిజన భూములకు సంబంధించి పోరాడుతున్న బీజేపీ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని.. మేమంతా మళ్ళీ గుర్రంబోడు వెళతామని దమ్ముంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ హుజర్నగర్ దుబ్బాక లో ఇచ్చిన హామీలే,ఇప్పడు నాగార్జున సాగర్ లో ఇచ్చారని సంజయ్ వెల్లడించారు….

Read More

తెలంగాణ చిన్నమ్మ సేవలు మరువం: కిషన్ రెడ్డి

మంత్రి కేటీఆర్కి దమ్ము ధైర్యం ఉంటే మజ్లీస్ పై యుద్ధం చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువులను కించపరిచే మజ్లీస్ పార్టీని పక్కన పెట్టుకొని ప్రధానిపై యుద్ధం చేస్తానని కేటీఆర్ అనడం ఏంటని అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక ,బీజేపీ అనుకూల…

Read More

సైన్యం అమ్ములపొదలో ‘అర్జున ‘

పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల త్యాగాలు మరువలేనివని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం చెన్నైలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. జ్ఞానం, సృజాత్మకతలకు చెన్నై నిలయమని మోదీ పేర్కొన్నారు. తమిళనాడు ఇప్పటికే ఆటోమొబైల్ హబ్ గా ఉందని, ఇప్పుడు యుద్ధ ట్యాంకుల తయారీ కేంద్రంగా మారిందని ఆయన అన్నారు. మొదట అడయారు లోని ఐఎన్ఎస్ కోస్ట్ గార్డ్ చేరుకొని.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అర్జున యుద్ధ ట్యాంక్ మార్క్_1ఏను సైన్యానికి అప్పగించారు. యుద్ధ…

Read More

తెలంగాణ చిన్నమ్మ జయంతి నేడు!

సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షతను చేరిపేస్తూ..మహిళ అబల కాదు సబల అని నిరూపించి..రాజకీయాలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్న మహిళ నేతల్లో ఒకరైన బిజిప్ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ జయంతి సందర్భంగా ఆ మహానీయురాలి స్మృతిలో.. హర్యానా రాష్ర్టంలోని కంబోలా స్వస్థలం.. 1953 ఫిబ్రవరి14 న సుష్మాస్వరాజ్ జన్మించారు.తల్లిదండ్రులు హరిదేవ్ శర్మ లక్ష్మీదేవి.వీరి కుటుంబం దేశ విభజనకు ముందు లాహోర్ లో ఉండేవారు.తండ్రి హరిదేవ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త..వారసత్వంమే సుష్మ జి పాటించారు.విద్యాబ్యాసం అంత అక్కడే గడిచింది..పాఠశాల…

Read More

‘నాగిని’ గా శ్రద్ధ కపూర్!

అందం అభినమయంతో ఉత్తరాదితోపాటు దక్షిణాదిలో అభిమానులను సంపాదించుకున్న నటి శ్రద్ధా కపూర్. ఆమె నటిస్తున్న తాజా చిత్రం నాగిని. ఈ చిత్రానికి సంబంధించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా బాల్యంలో శ్రీదేవి మేడం నటించిన నాగిని సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని.. ఎప్పటికైనా అలాంటి పాత్ర చేయలనుకునేదాన్ని , ఇప్పుడు ఆకోరిక నెరవేరబోతుంది.. నాగిని పాత్ర పోషించడం గౌరవంగా భావిస్తున్నా అని శ్రద్ధా చెప్పుకొచ్చింది. శాఫ్రాన్ బ్రాడ్ కాస్ట్ అండ్ మీడియా లిమిటెడ్ బెనర్లో నిఖిల్ ద్వివెది…

Read More

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సాంగ్ రిలీజ్!

యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. పూజా హెగ్డే హీరోయిన్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక గీతాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం విడుదల చేశారు. అరె.. గుచ్చే గులాబీలాగా.. నా గుండె లోతుల్లో తాకినదే.. అంటూ సాగే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరపరిచిన…

Read More

దోవల్ ఆఫీస్ పై దాడికి పాక్ కుట్ర!

జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ఇంటిపై పాక్ ఉగ్రవాదు సంస్థ రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని పోలీసులు అదుపులో ఉన్నా జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ మాలిక్ అంగీకరించాడు. పాక్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేసినట్లు అధికారులు విచారణలో టెర్రరిస్ట్ వెల్లడించాడని సమాచారం. కాగా ఈ నెల 6వ తేదీన  భారీ ఆయుధాలు కలిగిన ఉన్న కేసులో ఉగ్రవాదిని అనంత్ నాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా పలు ఆసక్తికర…

Read More

ఉప్పెన కలెక్షన్ల సునామీ!

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ చిత్రం కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు పది కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో వైష్ణవ్ డెబ్యూ మూవీతో మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. మొదటి రోజే మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా మున్ముందు మరిన్ని రికార్డులను కొల్లగొడుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు…

Read More

రాజ్యసభకు ఎంపీ దినేష్ త్రివేది రాజీనామా!

రాజ్యసభకు తృణమూల్ ఎంపీ దినేష్ త్రివేది రాజీనామా చేశారు. ఈ విషయమై ఆయన శుక్రవారం పెద్దల సభలో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న హింస నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇక్కడ మౌనంగా కూర్చోవడం కన్నా బెంగాల్ వెళ్లి ప్రజల మధ్య ఉండడం మేలని త్రివేది అన్నారు. అనంతరం రాజీనామా పత్రాన్ని చైర్మన్ వెంకయ్యనాయుడుకి అందిచగా ఆయన ఆమోదించారు. కాగా తృణమూల్ పార్టీ ప్రస్తుతం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేతిలో లేదని, కార్పొరేట్ వ్యక్తి కనుసన్నల్లో నడుస్తుందని ఆయన…

Read More

ఎట్టకేలకు దిగొచ్చిన ట్విట్టర్!

విద్వేష పూరిత పోస్టులు, నకిలీ ఖాతాల నిలుపుదల విషయంలో ట్విట్టర్ ఎట్టకేలకు దిగొచ్చింది. బుధవారం కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి తో  సమావేశమైన, ట్విట్టర్  ప్రతినిధుల చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో పలుచోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై విద్వేష పూరిత పోస్టులు, నకిలీ ఖాతాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్న ఖాతాలను మూసివేయాలని ట్విట్టర్ను కేంద్రం ఆదేశించింది. అయితే కొన్ని ఖాతాలను మాత్రమే నిలిపేసిన ట్విట్టర్ …..

Read More
Optimized by Optimole